పనికి కాదు బడికి పంపించాలి – విద్యా పక్షోత్సవాల ప్రారంభోత్సవ సభలో సిఎం
పిల్లలను పనికి పంపించకుండా బడికి పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తల్లిదండ్రులకు పిలుపు నిచ్చారు. అమీర్పేట ధరమ్కరమ్ రోడ్డులోని ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యా పక్షోత్సవాలను సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 నుండి 25 వరకు నిర్వహిస్తున్న సందర్భంగా సిఎం మాట్లా డుతూ పేదరికాన్ని జయించేందుకు విద్య ఒక్కటే మార్గమ న్నారు. అక్షరాస్యతలో మన రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల్లో వెను కంజలో ఉందన్నారు. దీనిని నివారించేందుకే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సమస్యలెన్ని ఉన్నప్పటికీ తల్లిదండ్రులు పిల్లలను తప్పక చదివించాలని ప్రతిన బూనితే తప్ప ఈ కార్యక్రమం విజయవంతం కాద న్నారు. వచ్చే మూడేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాల కల్పనకు గాను పదోతరగతి, ఇంటర్ డిగ్రీ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి రూ.150 కోట్లతో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం రూ.3500 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు చెప్పారు. విద్యా పక్షోత్సవాల్లో భాగంగా బడి బయటి పిల్లలను బడిలో చేరేలా యాజమాన్య కమి టీలు, టీచర్లు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు కృషి చేయా లని సూచించారు. బాలికలు విద్యలో రాణించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిఎం పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. రాజీవ్ విద్యామిషన్, మహిళా శిశుసంక్షేమశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శన సందర్శించి జవహర్ బాలభవన్ చిన్నారులు వేసిన చిత్రాలను తిలకించారు.
No comments:
Post a Comment