Monday, June 27, 2011

వైఎస్సార్ కాంగ్రెస్‌కు గ్రామాల్లో ఆదరణ మెండు


వైఎస్సార్ కాంగ్రెస్‌కు గ్రామాల్లో ఆదరణ మెండు
పరవాడ : రోజురోజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ్రామాల్లో ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి అన్నారు.26 06 2011 ఆదివారం మండలంలో పెదముషిడివాడ, సాలాపువానిపాలెం. కలపాక, రావాడ గ్రామపంచాయతీల వైఎస్సార్ కాంగ్రెస్ గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రజలు స్వచ్చందంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు.దీనికి కారణం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన తర్వాత నిరుపేదలకు అందాల్సిన పథకాలు కనుమరుగయ్యాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలకు బ్రేక్ పడిందని ఆయన ఆరోపంచారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చుట్టు ప్రదక్షిణలు చేయడానికే సమయం కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడితప్పిందని ఆయన ఆరోపించారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నేత పదవులు కాపాడుకునేందుకే సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నావ పూర్తిగా ఖాళీ అయ్యిందని, అయితే నేతలను తిరిగి పార్టీలోకి రప్పించుకునేందుకు నామినేట్‌డ్ పదవులు ఎరవేస్తున్నారని ఆయన ఆరోపించారు. భవిష్యత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రత్యమ్నాయ పార్టీలు ఉండవని ఆయన జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవాహంలో కొట్టుకు పోతాయని ఆయన అన్నారు. మూడు ఏళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని తెలిసినా అనేక మంది నేడు వైఎస్సార్ పార్టీలోకి వలసలు వస్తున్నారని ఆయన అన్నారు. గ్రామ కమిటీలను పూర్తి చేసి, త్వరలో మండల వ్యాప్తంగా భారీ సమావేశాలను నిర్వహించి కార్యకర్తలో నూతనోత్తజాన్ని తీసుకు వస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గండి రవికుమార్, చల్లా కనకరావు, కన్నూరు వెంకట రమణ, పయిల గోపాలకృష్ట, బొండా కనకరావు, కాసు అంజిరెడ్డి, మండల స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


పత్రికలను రెగ్యులర్ గా నడపండి

 విశాఖ స్మాల్ పేపర్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతున్న  డిటర్స్ ,


విశాఖపట్నం, సక్సెస్ న్యూస్ : పత్రికలను రెగ్యులర్ గా నడపాలని విశాఖ స్మాల్ పేపర్స్ ఎడిటర్స్ అండ్ పిరియాడికల్స్ అసోసియేషన్ సమావేశంలో పలువురు చిన్న పత్రికల ఎడిటర్లు సభ్యులుకు సూచించారు. విశాఖపట్నంలో గల నార్ల వెంకటేశ్వరరావు భవన్ లో సమావేశం నిర్వహించారు.














No comments:

Post a Comment