ఈ శతాబ్దిలోనే ఇది సుదీర్ఘమైనది – నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం
ప్రపంచవ్యాప్తంగా ఖగోళ వింతలను వీక్షించాలనుకునే ఔత్సాహికులకు ఈరోజు సువర్ణావకాశం వచ్చింది. ఈ శతాబ్దిలోనే ఇది సుదీర్ఘమైన – దట్టమైన సంపూర్ణ చంద్ర గ్రహణం ఈ అర్ధరాత్రికే సంభవించ నుంది. భారత్లోని ఏప్రాంతం వారైనా ఈ గ్రహణాన్ని వీక్షించొచ్చు. బుధవారం అర్ధరాత్రి 12.52 గంటలకు ప్రారంభమయే గ్రహణం 02.32 గంటలకు ముగియనుంది. అంటే సుమారు గంట 58 నిమిషాలపాటు నిండు పున్నమి జాబిలి గ్రహణ ప్రభావానికి లోనుకానుంది. భూమి ఛాయలో చంద్రుడు సంపూర్ణంగా ఒదిగిపోనున్నాడని ఢిల్లీలోని నెహ్రూ నక్షత్రశాల డైరెక్టర్ ఎన్.రత్నశ్రీ చెప్పారు. పాక్షిక గ్రహణం అర్ధరాత్రి 12:52 గంటలకు ప్రారంభమై 03.32 గంటలకు ముగుస్తుందన్నారు. 2000 జులైలో సంభవించిన చంద్ర గ్రహణం దీనికన్నా సుదీర్ఘ సమయం కొనసా గిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇంతటి సుదీర్ఘకాలపు
చంద్ర గ్రహణం సంభవించేది మళ్ళీ 2141లోనేనని ఆమె చెప్పారు. మధ్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతీయులూ ఈ గ్రహణాన్ని చూడగలుగుతారన్నారు. దక్షిణ అమెరికా మీదుగా సాగే గ్రహణ గమనం పశ్చిమ ఆఫ్రికా, యూరపుల మీదుగా ప్రయాణించి తూర్పు ఆసియా, ఆస్ట్రేలియాల ఎగువన ముగుస్తుందని శాస్త్ర సమాచార అవగాహనా ప్రచారోద్యమ సంఘం(స్పేస్)కు చెందిన సి.బి.దేవ్గన్ చెప్పారు. తదుపరి భారత్లో వీక్షించడానికి అనువైన చంద్రగ్రహణం. ఈ గ్రహణ సమయంలో చంద్రుణ్ణి అనుసరించి 51ఒపూచీ అనే ఒక నక్షత్రం మిణుకులీనుతుందని భారత ప్లానెటరీ సొసైటీకి చెందిన రఘునందన కుమార్ చెప్పారు.
No comments:
Post a Comment