Sunday, June 5, 2011

విజయవాడలో విలీన సభ….


విజయవాడలో విలీన సభ….
కాంగ్రెస్‌ అధిష్ఠానంతో బేరసారాలు పూర్తి అయిన తర్వాత, విలీనానికి ఈసీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత చిరంజీవి ఇక విలీన సభకు ఏర్పాట్లు ప్రారంభించనున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో విలీన సభ నిర్వహిస్తామని ఆయన చాలా రోజుల క్రితమే చెప్పారు. ఈ విలీన సభను విజయవాడలో జరపాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవులపై ప్రతిష్టంభన తొలగి పోతే ఇక విలీనం జరగటం లాంఛనమే అవుతుందని పార్టీ వర్గాలు చెప్పాయి.
నాలుగు మంత్రి పదవులు, విప్‌…
తనకు కేంద్రంలో పదవి ఇచ్చినప్పటికీ, రాష్ట్ర మంత్రి వర్గంలో నాలుగు మంత్రి పదవులు, ఒక విప్‌ కావాలని చిరంజీవి గట్టిగా కోరుతున్నారు. అలాగే మున్ముందు జరిగే కార్పొరేషన్‌ పదవుల భర్తీలో తమకు గణనీయమైన వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకత్వం మాత్రం మూడు పదవులతో సర్దుకోమని నచ్చజెబుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చిరు అగదే డిమాండ్‌ చేస్తే సర్ది చెప్పి మూడు మంత్రి పదవులు, ఒక విప్‌కు అంగీకరించేలా ప్రయత్నాలు చేయవచ్చునని తెలిసింది. కార్పొరేషన్‌ పదవుల విషయంలో మాత్రం ఇప్పుడప్పుడే హామీ ఇవ్వకుండా కొంతకాలం వేచి చూడాలని చెప్పే అవకాశాలున్నాయి. 18 మంది ఎమ్మెల్యేలలో భూమా శోభా నాగిరెడ్డి పోగా చిరంజీవిని మినహాయించి 16 మందిలో చాలా మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గంటా శ్రీనివాసరావు, కన్నబాబు, వంగా గీత లాంటి వారు ఎప్పటినుంచో ఈ ఆశలు పెంచుకుని ఉన్నారు.
రేపు ఈసీ అనుమతి…
చిరంజీవి ఢిల్లీ యాత్రలో మరో విశేషం ఉంది. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని చాలా రోజుల క్రితమే దర ఖాస్తు చేసుకున్నారు. అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్ని కల సం ఘం సోమవారం అనుమతి పత్రాన్ని అందజేసే అవకాశం ఉం దంటు న్నారు. ఆ పత్రం వస్తే విలీనానికి అన్ని అడ్డంకులూ తొలగినట్టే అవుతుంది.

No comments:

Post a Comment