Friday, June 24, 2011

సామాన్యుడిపై బండ


సామాన్యుడిపై బండ
ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుంగిపోతున్న సామాన్యుడిపై మరోసారి భారాన్ని మోపేందుకు కేంద్రంలోని యుపిఎ సర్కారు సిద్ధమవుతోంది. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటిరోజే పెట్రోలు ధరను పెంచిన కేంద్రం ఇప్పుడు లీటర్‌ డీజిల్‌కు రు.2-3ల వంతున వంటగ్యాస్‌ సిలెండర్‌ ధరను రు.25 లు వంతున ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ధరలను పెంచటం వంటి అంశాలతో పాటు సుంకాలలో కొత విధించటం వంటి అంశాలను కూడా చర్చించేందుకు మంత్రుల ఉన్నతాధికార కమిటీ శుక్రవారం ఇక్కడ భేటీ కానున్నది. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ భేటీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు జరిగే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థలో సరఫరా చేసే కిరోసిన్‌ ధర పెంపుదల అంశాన్ని కూడా మంత్రుల కమిటీ ఈ భేటీలో పరిశీలించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. అదే విధంగా క్రూడాయిల్‌ దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న ఐదు శాతం దిగుమతి సుంకాన్ని, డిజెల్‌పై విధిస్తున్న 7.5 శాతం దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించే అంశాన్ని కూడా మంత్రుల కమిటీ పరిశీలించనున్నది. ప్రధానితోను, ప్రణబ్‌ ముఖర్జీతోనూ పలుమార్లు భేటీ అయిన చమురు శాఖ మంత్రి జైపాల్‌ రెడ్డి పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచే అంశంపై సత్వరమే ఒక నిర్ణయం తీసుకునేందుకు వీలుగా మంత్రుల కమిటీ భేటీని ఏర్పాటు చేయాలని వత్తిడి తెచ్చారు. యుపిఎ భాగస్వామ్య పక్షాల ప్రతినిధులతో ఏర్పడిన ఈ మంత్రుల ఉన్నతాధికార కమిటీ ఏర్పడింది,

No comments:

Post a Comment