Tuesday, April 5, 2011

సమైక్యాంధ్ర జ్యోతిష్కులు వర్సెస్ తెలంగాణా జ్యోతిష్కులు


సమైక్యాంధ్ర జ్యోతిష్కులు వర్సెస్ తెలంగాణా జ్యోతిష్కులు
ఉగాది పర్వదినం తెలంగాణా జ్యోతిష్కులు, సమైక్యాంధ్ర జ్యోతిష్కుల మధ్య చిచ్చు పెట్టింది. సోమవారం ఉగాది పండుగనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంచాంగం వినిపించిన ప్రముఖ జ్యోతిష్కులు వచ్చే ఏడాది కూడా ఉగాది సమైక్యాంధ్రలోనే జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు హరిశ్ రావు మండిపడ్డారు. 
టీడీపి పంచాంగం పచ్చి అబద్ధమని ధ్వజమెత్తింది. చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రకు అనుకూలంగా పంచాంగం చెప్పాలని జ్యోతిష్కులపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగానే అటువంటి వ్యాఖ్య చేసి ఉంటాన్నారు. తెలంగాణా ప్రాంత జ్యోతిష్యుడు దామోదర్ శర్మ మాట్లాడుతూ... సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెల్లడించిన పంచాంగం శుద్ధఅబద్దమనీ, వచ్చే మే నెల 21 తేదీ లోపు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటై తీరుతుందని చెప్పుకొచ్చారు. మరి ఎవరి జ్యోతిష్యం కరెక్టవుతుందో చూద్దాం.

No comments:

Post a Comment