Friday, April 1, 2011

పార్టీ పదవులకు దేవినేని, వంశీ రాజీనామాలు



పార్టీ పదవులకు దేవినేని, వంశీ రాజీనామాలు
విజయవాడ : కృష్ణాజిల్లాలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు తారాస్థాయికి చేరాయి. తెలుగుతమ్ముళ్ల
 మద్య కుమ్ములాటలు పోటాపోటీ రాజీనామాలకు దారి తీశాయి. కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి
 దేవినేని ఉమ శుక్రవారం రాజీనామా చేశారు. 
ఈ సందర్భంగా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ తనపై వల్లభనేని వంశీ, నాని చేస్తున్న
 ఆరోపణలకు మనస్తాపం చెందే రాజీనామా చేసినట్లు తెలిపారు. నందమూరి హరికృష్ణ అంటే
 తనకు గౌరవం అని దేవినేని చెప్పారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను
 ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్న తనపై
 ఆరోపణలు చేయటం సరికాదన్నారు.
ఇటు విజయవాడ నగర టీడీపీ అధ్యక్ష పదవికి వల్లభనేని వంశీ కూడా రాజీనామా
 చేశారు. ఆయన తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపించారు.
 ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
 హరికృష్ణ పర్యటన సందర్భంగా దేవినేని ఉమ వైఖరికి నిరసనగా తాను రాజీనామా 
చేస్తున్నట్లు వంశీ చెప్పుకొచ్చారు. 

No comments:

Post a Comment