Tuesday, April 5, 2011

ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు?


తరచుగా ఒక ప్రశ్న వేస్తుంటారు - అది, బాబావారు తామే అద్భుత రీతిలో రోగాలకు చికిత్స చేసి మాన్చుతున్నప్పుడు, పుట్టపర్తిలో డాక్టర్లతోను, ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు? అని ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నవాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రాలనేకాక విజ్ఞాన శాస్త్రాలనుకూడా దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని ఆర్జించుకోవాలి. రష్యాలో అధిమనో విజ్ఞాన శాస్త్రాన్ని (శసశూా-ఠుుగా) ఎంతగానో అభివృద్ధి పరుస్తున్నారు. అక్కడ అతిమానుషమయిన (కార్య కారణ సంబంధం లేకుండా దైవశక్తితో కూడిన) కొన్ని విషయాలమీద ఆకట్టుకొనే ప్రయోగాలను జరిపారు. వాటిని గురించి ఇటీవల అమెరికాలో ఒక తక్కువ వెల పుస్తకం ప్రచురింపబడింది. ప్రశాంతి నిలయంవంటి ఆశ్రమాలలోని డాక్టర్లు ఆధ్యాత్మిక నేపథ్యంతో వైద్య చికిత్సలు చేయాలి. డాక్టర్లు ఒక జబ్బును నిర్ధారించి దానికి చికిత్స ఎట్లా చేయాలో నిర్ణయించటానికి మందు ఆ జబ్బుమీద అంతర్‌ బుద్ధిని ప్రయోగించాలి. అప్పుడే ఆ జబ్బు వివరాలను, దానికి సంబంధించిన సూక్ష్మాంశాలను గుర్తించడంలో అతని విజ్ఞానశాస్త్రం సంపూర్ణంగా సహకరిస్తుంది. అనుగ్రహంయొక్క పరిధిలో విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధిపరచాలి.
డా|| సామ్యుయెల్‌ హెచ్‌. సాండ్‌వైస్‌, ఎం.డి., అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కేలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్‌డీగో విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రొఫెసరేకాక, మనో వైజ్ఞానిక (సైకియాట్రిస్ట్‌) డాక్టర్‌గా కూడా వృత్తిని నిర్వహిస్తున్న వాడు. ఆయన రాసిన 'సాయిబాబా, ది హోలీ మ్యాన్‌ అన్‌డ్‌ ది సైకియాట్రిస్ట్‌' అన్న గ్రంథం ఎంతో ఆకట్టుకొంటున్న గ్రంథం. మనో విజ్ఞాన మూలాల్ని తెలుపుతూ ఒక ఆకర్షకమైన కథనం అందులో ఉన్నది. మనో విజ్ఞాన శాస్త్రం అని చెప్పబడ్తున్న శాస్త్రం ఒక అసమగ్రమైన శాస్త్రమనీ, దాన్ని నిజంగా ప్రభావవంతం చేయాలంటే, ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి ఎన్నో విషయాలను అందులో చేర్చాల్సి ఉంటుందని ఆయన నిశ్చితంగా చెప్పాడు. ఈ గ్రంథంలో డా|| సాండ్‌వైస్‌ తనకు బాబాతో కలిగిన అనుభవాలనుకూడా వివరించారు. మొట్టమొదట తను 'అనిశ్చితి', 'అనిర్ణయత' ఉన్నవాడిననీ, అధ్యాత్మక వెలుగులో తాను మారానన్నారు. తన నాస్తికపు సంశయాత్మక బుద్ధిని ఎంతమేరకు వెళ్ళగలదో అంతమేరకు వెళ్ళనిచ్చాననీ, ఐతే అట్లా సంశయించడంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నప్పటికీ, అది ఆత్మయొక్క ఉనికినీ, ఆధ్యాత్మిక సత్యాన్నీ అంగీకరిస్తుందన్నారు. తన వృత్తిమీదకూడా తనకున్న దృష్టిలో మార్పు వచ్చిందంటారు, సాండ్‌వైస్‌.
మతపరమైన మనో విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా ఒక పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా అధ్యయనం చేయటానికి ఆయన భారత దేశానికి వచ్చారు. చిత్‌శక్తి శాస్త్ర పునాదిమీద ఆధారపడి, మనోవిజ్ఞాన చికిత్సా విధాన శాస్త్రమే తన రోగ చికిత్సా పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చి ఆయన తన దేశానికి వెళ్ళిపోయాడు.
నిపుణుల కమిటీ ఒకటి బాబావారి మిరకిల్స్‌ (అద్భుతాల)ను గురించి ప్రత్యక్షంగా అధ్యయనం చేయడంకోసం పుట్టపర్తికి వచ్చిందని నాల్గవ అధ్యాయనంలో రాశాను ('ది ఎడ్వెంట్‌ ఆఫ్‌ సత్యసాయి' -అన్న గ్రంథంలో) వారు అమెరికాలోని చెస్టర్‌ ఎఫ్‌. కార్ల్‌సన్‌ రీసెర్చి లేబొరేటరీకి చెందినవారు. ఇందులోని ఇద్దరు మనో విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులు. ఊాతో పాటు ాఒ కి చెందిన అంశాలను అధ్యయనం చేయడానికే ఈ లేబొరేటరీ (ప్రయోగశాల)ని వ్యవస్థాపించారు. (ఊా మరియు ాఒ లు అతీంద్రియ జ్ఞానాన్ని శాస్త్రీయంగా పరిశోధించి తెలిపే శాస్త్రాంశాలు). ఇద్దరు శాస్త్రవేత్తలు - ఒకరు డాక్టర్‌ కార్లిస్‌ ఇసిస్‌. వీరు అమెరికన్‌ సొసైటీ ఫర్‌ సైకిక్‌ రీసెర్చికి డైరెక్టరు. మరొకరు ఎర్‌టెన్‌డుర్‌ హరాల్డ్‌సన్‌ - ఐస్‌ల్యాండ్‌ యూనివర్శిటీకి చెందినవారు. బాబాను అధ్యయనం చేశాక వీరిద్దరూ వైదుష్యంతో కూడిన కొన్ని అంశాలతోఒక పరిశోధన పత్రాన్ని 'శ్రీ సత్యసాయిబాబావారికి సంబంధించిన ఐదు దేహాంతర కేసులు' అన్నదాన్ని రాశారు. (వీటిని క్షఇఊ అంటారు. అంటే క్షషష ుౌ ఇుdా ఊూ|స|n-| అని అర్థం. దేహం నుంచి తాను బైటకు వెళ్ళి జరిపే పనులని అర్థం). వీరి ఈ అధ్యయనాన్ని గమనిస్తే వీరికి చురుకయిన, సంకుచితం కాని మనస్సే కాక, తాము అధ్యయనం చేయదలచుకొన్న ఆధ్యాత్మికమైన మిరకిల్స్‌ మీద గౌరవం ఉన్న విషయాన్నిచూడ గల్గుతాము. అలాంటి అనుభవాలవద్దకు అవి దొంగవనో, అబద్ధమనో (ముందే ఏర్పరచుకొన్న) నిర్ణయాలతో వీరు వెళ్ళలేదు. ఈ అసాధారణ విషయాలను తమ పత్రంలో వీళ్ళు చర్చిస్తున్నప్పుడు వీటిని తెలుపడానికి తగిన పరిభాషా శబ్దాలనుకూడా వీరు సిద్ధం చేసికొన్నారు. ఇది విశేషమయిన ప్రత్యేక శాస్త్రం. సాహిత్యాన్నో, సాంఘిక, భౌతిక విజ్ఞాన శాస్త్రాలనో అధ్యయనం చేస్తే ఈ జ్ఞానాన్ని పొందలేము. ఈ పరిశోధక పత్రంలో వీరు ఆధారపడిన గ్రంథ, వ్యాస సూచికల పట్టికను పరిశీలిస్తే, వీరికి అద్యతన అధిమనో విజ్ఞాన శాస్త్రంతోనూ (పేరాసైకాలజీ), భారతీ యులూ, అమెరికన్‌, ఆస్ట్రేలియన్‌ రచయితలూ బాబావారిని గురించి రాసిన రచనలతోనూ ఎంతటి గాడమైన విద్వత్తూ పరిచయమూ ఉన్నవో తెలస్తుంది. ాఒ పరిశోధనలకు ఆ శాస్త్రానికే పరిమితమైన సొంత పరిశోధన పద్ధతులున్నాయి. అధిమనో విజ్ఞాన శాస్త్ర అధ్యయనం లేకుండా, కనీసం ఆ పద్ధతులను గురించి దిఙ్మాత్ర పరిచయమైనా లేకుండా ఎవరయినా ఇలాంటి పరిశోధనలకు పూనుకుంటే, అది సాహసమే అవుతుంది.
తమ పత్రాన్ని గురించి ఈ ఇద్దరు శాస్త్రజ్ఞులు ఇట్లా అన్నారు ''ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అంగీకరించి, తమ అనుచరులు ఈ (మా) పరిశోధనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరించినందుకు శ్రీ సత్యసాయికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా ఇంటర్వ్యూల నిర్వహణలో తోడ్పడిన సాక్షులకూ, ఇతరులకూ హృదయపూర్వకమయిన కృతజ్ఞతలు''.
ఈ పరిశోధన పత్రం నుంచి కొన్ని ఉదాహరణలు:
''కేవలం ప్రఖ్యాతులయిన వ్యక్తులూ, శాస్త్రజ్ఞులూ, పారిశ్రామికవేత్తలూ, రాజకీయనాయకుల కోసం కాకుండా, వీరి క్షఇఊ (దేహాంతర అనుభవం) పొందాల్సిన వ్యక్తికి కల్గిన ఆత్యయిక పరిస్థితి (జబ్బూ, నిస్పృహా మొదలైనవి) వల్లనే కలిగింది. కేవలం అవసరం వల్లనే బాబావారి క్షఇఊ (దేహాంతర అనుభవం) అగుపించినందువల్ల మా పరిశోధనల్లో వారిని పాల్గొనేటట్లు చేయడానికి మాకు అత్యల్ప అవకాశమే ఉన్నదని గ్రహించాము. ఐతే, వారు మాకోసంగాను అనేక సందర్భాలలో వస్తువులు అగుపించడం, మాయమవడం వంటివాటిని చూపించారు....''
ఈ నిపుణులు ఆకర్షకమైన కేసులను అన్వేషించే కార్యక్రమంలో, మూడుసార్లు భారతదేశానికి వచ్చి అనేక ఆశ్రమాలను చూశారు. 1973లో వారు చేసిన మూడవ పర్యటనలో వారికి బాబా విషయం తెలిసి వారిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలనిపించినట్లుగా క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ అయిన ఒక వృద్ధురాలైన భక్తురాలికి బాబావారు ప్రత్యక్షం కావడాన్ని గురించి వీరీ పత్రంలో తెలిపారు: మద్రాసు సమీపంలో ఉన్న వెంకటగిరిలో ఉంటూనే శైలజ అన్న ఒక చిన్నపిల్ల ప్రార్థనవల్ల కాలికట్‌ సమాపంలోని మంజేరీలో శరీరంతో అగుపించి కొన్ని గంటలు భజన, సంభాషణ చేయడంగురించి ఇందులో వీళ్ళు తెలిపారు.
(వారి మాటల్లో ''మంజేరీ విషయంగా మేము బాబావారిని ప్రశ్నించాము. రెండు సందర్భాలలో 'తాను' దేహం విడిచి రావు కుటుంబంతో ఉన్నట్లుగా ధృవీకరించడం చాలా క్లుప్తంగా చేశారు.'')
ముగ్గురు దుబాసీల సహాయంతో వీళ్ళు 21 మంది సాక్షులను పరీక్షించినట్లుగా ఈ పత్రంలో పేర్కొన్నారు. ఏయే అంశాలను పరీక్షించాలో ఆరు పట్టికల్లో రాసికొన్నారు. ఈ నిపుణులు ఇంకా వివరిస్తూ -''దేశ దిమ్మరి సన్న్యాసులవలె సాయిబాబా భిక్షమడగరు. ఏమీ కోరరు. పోగా వారే ఇతరులకు సాయం చేస్తుంటారు'' అని తెలిపారు. బావిలో పడి మునిగిపోతున్న ఒక మనిషిని సాయమం దించేవాళ్ళు వచ్చేదాకా తానే సూక్ష్మ శరీరంతో ఎత్తి ఉంచిన కుప్పం సంఘటనను గురించి చర్చిస్తూ ఈ నిపుణులు ''ఇది క్షఇఊ అంశం. ఊా (ఊషసశ ా|nుసా |స-|ూషుn -అంతీంద్రియ గ్రమణం) కన్నా విశేషమైనది'' అని అంటూ ''బాబా తమని అవతారంగా భావించే - వారి అనుయాయులకు అనేకానేక ఊా శక్తులను ఖచ్చితంగా ప్రదర్శించారు. వారి ఊా శక్తిని మేము కూడా స్వయంగా చూశాము. ఊఐ కు (అతని స్వదేశమయిన) ఐస్‌ల్యాండ్‌లోని కొన్ని ప్రత్యేక సందర్భాలను సరిగ్గా పేర్కొన్నారు'' అని అన్నారు. ఆ విషయాన్ని గురించి వీళ్ళు ''బాబా చెప్పినవి క్షఇఊ లక్షణాలకు అనుగుణంగా ఉన్నాయి'' అని పేర్కొన్నారు.
తమ పరిశోధన పత్రం ముగింపుగా వీరు ''అరవై లక్షల భారతీయ భక్తులు శ్రీ సత్యసాయిబాబా ఒక విశేష లక్షణ వ్యక్తిగా, అవతారంగా భావించడం విషయంలో మనం దాని సంభావ్యతనుగురించి సానుకూల మనస్కతతో ఉండాలి. పోగా, ఈ కేసులు ఆయనను గురించి ప్రత్యేకంగా తెలియపరిచేవేగాని భారతీయ సంస్కృతినిగురించి తెలిపేవి కావు. వీరికి సంబంధించిన ఈ కేసులు పాశ్చాత్య దేశాల కేసుల కన్నాకూడా ఖచ్చితంగా విల క్షణమయినవి. అసా ధారణమైనవాటిని గురించి తెలిసికోవడానికి ఇవి ఎక్కువ వీలు కల్గిస్తున్నట్లుగా అగుపిస్తున్నది'' అని రాశారు. వీటన్నిటివల్ల శరీరంతోనూ, క్షఇఊ పద్ధతుల ద్వారానూ బాబావారు సామాన్య మానవునికి ఎట్లా సాయం చేస్తున్నారన్న విషయం పాఠకులకు తేటతెల్లమవుతుంది.
ాఒ శాస్త్రాన్ని (క్షఇఊ, ఊా మొదలైనవి) అధ్యయనం చేయాలని కోరుకొనే వ్యక్తులు ఇది అత్యంత నూతన విజ్ఞానశాస్త్రమనీ, ప్రపంచంలో ఎంతో అభివృద్ధి పొందిన దేశాల్లో దీనికి సంబంధించి పరిశోధించడానికి ప్రయోగశాలలూ, యూనివర్శిటీలూ స్థాపించారనీ గమనించాలి.పైన పేర్కొన్న పత్రం నుంచి అక్కడక్కడ ఉటంకించిన కొన్ని కొటేషన్లుకూడా ఈ విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకమైందనీ, దీని పద్ధతులు వేరనీ, వీటిని అనుసరించి పరిశోధనలు జరిపినప్పుడే సత్యం ఆవిష్కారమవుతందనీ తెలుపుతాయి. ఏదో ఒక అంశంలోనైనా అనుభవాలను గురించిన ఈ ప్రయోగశాలల్లోకూడా తప్పులు జరుగవచ్చు. ఈ క్షేత్రంలో పని చేయడానికి భారతదేశంలో ఎందరికి శిక్షణ ఉన్నది? ఎందరు యోగ్యతా, అర్హతా సంపాదించుకొన్నారు? అన్నది సందేహాస్పదమే!

No comments:

Post a Comment