Monday, August 13, 2012

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే ను అరెస్టు చేసిన పోలీసులు


శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం(తెలుగుదేశం) ఎమ్మెల్యే సాయిరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్టు యంత్రాల కాల్చివేత ఘటనలో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. 2010 ఏప్రిల్ 30న జరిగిన ఈ ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

2010 ఏప్రిల్ 30వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజక వర్గంలోని సోంపేటలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. సోంపేటలో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించేదుకు ఎన్ సీసీ కంపెనీ ముందుకు వచ్చింది. ఆ రోజున భూమి పూజ మొదలు పెట్టింది. అయితే మొదట్నించీ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న స్తానికులు తిరగబడ్డారు. పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో నీరు కలుషితం అవుతుందనీ....పంటలు నాశనం అవుతాయంటూ భూమి పూజను అడ్డుకున్నారు.

ఇక గ్రామస్తులపై పోలీసులు ఎదురు దాడి చేశారు. రెండు వర్గాల దాడులతో సోంపేట అల్లాడిపోయింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్తితులు రేపిన సోంపేట ఘటనలో 114 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో పది మందిని అరెస్ట్ చేశారు. ఇక అప్పటి ఆందోళనలో పాల్గొన్న ఇచ్చాపురం ఎంఎల్ఎ సాయిరాజ్ పై కేసు పెట్టారు. రెండేళ్ల విచారణ తర్వాత సాయిరాజ్ పై అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడంతో ఎంఎల్ఏను అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరు పర్చటంతో ఈ నెల 24వ తేదీ వరకూ రిమాండ్ విధించారు.

No comments:

Post a Comment