Monday, August 13, 2012

నేటి నుంచి ఏలూరులో 48 గంటలు విజయమ్మ దీక్ష...


ర్హులైన పేద విద్యార్ధులకు ఉన్నత విథ్య అందాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేటి నుంచి రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఎగ్జిబిషణ్ గ్రౌండ్స్ లో దీక్ష చేయనున్నారు. ఫీజులకు సంబంధఇంచి మంత్రి పితాని చేసిన ప్రకటనలో ఏ స్పష్టతా లేనందున ప్రకటించిన ప్రకారమే దీక్ష యధావిధిగా కొనసాగుతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. వేదికపై విజయమ్మతో పాటు 200 మంది కూర్చునేలా తీర్చిదిద్దారు. దీక్షలో పాలు పంచుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఫీజు దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతుందని ఆపార్టీ తెలిపింది. ప్రత్యేకంగా విద్యార్ధి సంఘాలు, విద్యార్ధులు, తల్లిదండ్రులు సంఘీభావం తెలుపుతున్నారని ఆపార్టీ వెల్లడించింది. దీక్షకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

No comments:

Post a Comment