Monday, February 13, 2012

రాజయోగ ద్వారా వ్యవసాయం అభివృద్ధి



వ్యవసాయంలో శాశ్వత యోగిక విధానం అవసరమని పలువురు వక్తలు అభి ప్రాయపడ్డారు. అనేకమంది రైతులు రాజ యోగ ద్వారా వ్యవసాయంపై ప్రయోగాలు చేసి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని వారు వివ రించారు.
బ్రహ్మకుమారీల ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లంకెలపాలెం జంక్షన్‌లో 13/02/2012 తేది ఆదివారం జరిగన రైతు చైతన్య సదస్సు లో రాష్ట్ర ఓడ రేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖల మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, రుణాల మాఫీ మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయన్నారు.
యోగిక విధా నం ద్వారా వ్యవసాయంలో దిగుబడి పెరిగితే రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాజయోగి, తపస్వి రాజు భాయీజీ మాట్లాడుతూ రాజయోగ ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఇప్పటికే పలు పరిశోధనలు, ప్రయోగాలు జరిగాయన్నారు. సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ రైతు ప్రయోజనాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 
రైతులు అడుగుతున్నవి చాలా చిన్నచిన్న విషయాలని, వాటిని నెరవేర్చాలని కోరారు. ఒత్తిడిని అధిగమించడానికి యోగ చాలా ముఖ్యమని ఇది మనకు బలాన్ని, కొత్త శక్తిని ఇస్తుందని అంటూ రైతులకు ఆ విధమైన శక్తి అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, మళ్ల విజయప్రసాద్, కార్పొరేటర్ దుల్ల లక్ష్మి, ప్రముఖులు పైలా జగన్నాథరావు, తోట విజయలక్ష్మి, బొడ్డేడ ప్రసాద్, రౌతు శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ, వీవీఎన్‌ఎం రాజా జీ.బి. నాయుడు,  తిప్పల చిన అప్పారావు, వై.వి.నరసింహం, చలపరెడ్డి రామారావు, పైలా శ్రీనువాసురావు, బొండా అప్పారావు,దుల్ల రామునాయుడు,బలిరెడ్డినాగేశ్వరరావు,కరణంరెడ్డి నరసింగరావు,బొబ్బరి నారాయణరావు,కరణం కనకారావు,విందుల చిరురాజు,ఆప్పికొండ మహలక్శ్మినాయుడు,సాలాపు వెంకటఆఫ్ఫారావు బ్రహ్మకుమారీలు బి కె సునీత,బి కె కొండలరావు, బి కె సుధ, బి కె వేణి, రేవతి,బి కె బాలకృష్ణ,బి కె సీత,బి కె శివలీల, బి కె శశికళ,బి కె త్రివేణి,బి కె సోమేశ్వరి,బి కె రమ,బి కె సత్యవతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులకు పదివేల మొక్కలు పం పిణీ చేశారు. 

ఆకట్టుకున్న స్టాళ్లు











రైతు చైతన్య సదస్సులో ఏర్పాటు చేసిన స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు స్టాళ్లను తిలకించి ఆద్యంతం అనుభూతిని పొందారు. 



No comments:

Post a Comment