
హసన్ జిల్లాలో శవమై తేలిన మనోజ్
వైభవ్ సంస్థల అధినేత గ్రంధి మనోజ్కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన కర్ణాటకలోని సకలేశ్వర్ అటవీ ప్రాంతంలో శవమై తేలాడు. మనోజ్ మృతిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు.


విశాఖ వైభవ్ జ్యూవెలర్స్ అధినేత మనోజ్ కుమార్ హత్యకేసులో మిస్టరీ వీడింది. మనోజ్ కుమార్ ను హత్య చేసింది క్యాబ్ డ్రైవరే అని పోలీసు విచారణలో తేలింది. దీంతో డ్రైవర్ తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వజ్రాల కోసమే మనోజ్ ను చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. కర్నాటక హాసన్ జిల్లా సమీపంలో లో మనోజ్ ను చంపి ఓ కొండపై నుంచి పడేశామని నిందితులు ఒప్పుకున్నారు. పోలీసులు నిందితులను సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. బంగారం వ్యాపారి అయిన మనోజ్.. జైపూర్ లో భారీగా బంగారం, వజ్రాలు కొనుగోలు చేశాడు. అనంతరం శృతి హాసన్ తో యాడ్ కోసం.. ముంబై వెళ్లేందుకు బెంగళూరు వెళ్లాడు. రెండు రోజుల క్రితం బెంగళూరు ఎయిర్ పోర్టులో మనోజ్ అదృశ్యమయ్యాడు.
మనోజ్ను ఎందుకు హత్య చేశారు?
అసలు మనోజ్ కుమార్ బెంగళూరు ఎందుకు వెళ్లారు? ఆయన్ను దుండగులు ఎందుకు అపహరించారు?. ఎందుకు హత్య చేశారు? వివరాల్లోకి వెళితే..
జ్యుయలరీ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తుండటంతో వ్యాపారాన్ని బెంగళూరుకు విస్తరింపజేయాలని మనోజ్ భావించారు. నూతనంగా షోరూం ఏర్పాటు చేసేందుకు మనోజ్ కుమార్ బెంగుళూరు వెళ్లారు. స్థల సేకరణకు ఆయన ఎంజిరోడ్డు, కోరమంగళ, బసవనగుడి, మల్లేశ్వర ప్రాంతాల్లో ఆరా తీశారు. కొందరు భూ వ్యాపారులను కలిసి వారితో చర్చించారు.
బంగారం, వజ్రాలు కొనుగోలు చేసేందుకు ఈనెల 5న మనోజ్ కుమార్ విశాఖ నుండి హైదరాబాద్ వచ్చారు. ఆరవ తేదిన జైపూర్ వెళ్లారు. అక్కడ భారీగా బంగారం, వజ్రాలు కొనుగోలు చేసి బెంగుళూరు వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి బెంగళూరులోని ఓ హోటల్ లో బసచేసి.. ముంబై వెళ్లేందుకు 7వతేది తెల్లవారుజామున ప్రైవేటు ట్యాక్సీలో బెంగళూరు విమానాశ్రయానకి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్నట్లు అక్కడి సిసి కెమెరాల్లోనూ రికార్డు అయింది. అయితే.. ఆ తరువాత నుంచి ఆయన ఆచూకి లభ్యం కాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.

No comments:
Post a Comment