Friday, February 10, 2012

వైభవ్‌ సంస్థల అధినేత గ్రంధి మనోజ్‌కుమార్‌ దారుణహత్య !


మూడ్రోజుల క్రితం అదృశ్యమైన మనోజ్‌ 

 హసన్‌ జిల్లాలో శవమై తేలిన మనోజ్‌

వైభవ్‌ సంస్థల అధినేత గ్రంధి మనోజ్‌కుమార్‌ దారుణ హత్యకు గురయ్యాడు. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన కర్ణాటకలోని సకలేశ్వర్‌ అటవీ ప్రాంతంలో శవమై తేలాడు. మనోజ్‌ మృతిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 


ప్రస్తుత తమిళనాడు గవర్నర్‌ రోశయ్యకు సమీప బంధువు. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన వైభవ్‌ జువెల్లర్స్‌ అధినేత హతమవడంతో విశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు వ్యాపారి మనోజ్‌ హత్యకు నిరసనగా విశాఖలో వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసేయాలని నిర్ణయించారు. 

మనోజ్ హత్య కేసులో వీడిన మిస్టరీ: కారు డ్రైవరే హంతకుడు.. పోలీసుల విచారణలో వెల్లడి



 విశాఖ వైభవ్ జ్యూవెలర్స్ అధినేత మనోజ్ కుమార్ హత్యకేసులో మిస్టరీ వీడింది. మనోజ్ కుమార్ ను హత్య చేసింది క్యాబ్ డ్రైవరే అని పోలీసు విచారణలో తేలింది. దీంతో డ్రైవర్ తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వజ్రాల కోసమే మనోజ్ ను చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. కర్నాటక హాసన్ జిల్లా సమీపంలో లో మనోజ్ ను చంపి ఓ కొండపై నుంచి పడేశామని నిందితులు ఒప్పుకున్నారు. పోలీసులు నిందితులను సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. బంగారం వ్యాపారి అయిన మనోజ్.. జైపూర్ లో భారీగా బంగారం, వజ్రాలు కొనుగోలు చేశాడు. అనంతరం శృతి హాసన్ తో యాడ్ కోసం.. ముంబై వెళ్లేందుకు బెంగళూరు వెళ్లాడు. రెండు రోజుల క్రితం బెంగళూరు ఎయిర్ పోర్టులో మనోజ్ అదృశ్యమయ్యాడు.

మనోజ్‌ను ఎందుకు హత్య చేశారు? 
అసలు మనోజ్ కుమార్ బెంగళూరు ఎందుకు వెళ్లారు? ఆయన్ను దుండగులు ఎందుకు అపహరించారు?. ఎందుకు హత్య చేశారు? వివరాల్లోకి వెళితే..


జ్యుయలరీ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తుండటంతో వ్యాపారాన్ని బెంగళూరుకు విస్తరింపజేయాలని మనోజ్ భావించారు. నూతనంగా షోరూం ఏర్పాటు చేసేందుకు మనోజ్ కుమార్ బెంగుళూరు వెళ్లారు. స్థల సేకరణకు ఆయన ఎంజిరోడ్డు, కోరమంగళ, బసవనగుడి, మల్లేశ్వర ప్రాంతాల్లో ఆరా తీశారు. కొందరు భూ వ్యాపారులను కలిసి వారితో చర్చించారు.

బంగారం, వజ్రాలు కొనుగోలు చేసేందుకు ఈనెల 5న మనోజ్ కుమార్ విశాఖ నుండి హైదరాబాద్ వచ్చారు. ఆరవ తేదిన జైపూర్ వెళ్లారు. అక్కడ భారీగా బంగారం, వజ్రాలు కొనుగోలు చేసి బెంగుళూరు వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి బెంగళూరులోని ఓ హోటల్ లో బసచేసి.. ముంబై వెళ్లేందుకు 7వతేది తెల్లవారుజామున ప్రైవేటు ట్యాక్సీలో బెంగళూరు విమానాశ్రయానకి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్నట్లు అక్కడి సిసి కెమెరాల్లోనూ రికార్డు అయింది. అయితే.. ఆ తరువాత నుంచి ఆయన ఆచూకి లభ్యం కాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 

స్థలంపై ఆరా తీసే సమయంలో.. జైపూర్ లో కొనుగోలు చేసిన బంగారం, వజ్రాలు మనోజ్ తోపాటే వున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే.. మూడు గ్యాంగులు ఆయన్ను అనుసరించినట్లు సమాచారం. డబ్బు, ఆభరణాలకోసమే మనోజ్ ను హత్య చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. బెంగుళూరు హోటల్ లో వున్నప్పుడు ఎవరెవరితో మాట్లాడారు అనే దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బెంగళూరులో మనోజ్ ప్రయాణించిన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ మనోజ్ పై రెండు సార్లు హత్యాయత్నం జరగడంతో.. ఆ దిశగా కూడా కర్ణాటక పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖ పోలీసులతో చర్చించి ఆ వివరాలను సేకరిస్తున్నారు.

No comments:

Post a Comment