Tuesday, January 31, 2012

విపక్షనేతకు సారీ చెప్పిన సిఏం కిరణ్


* మండలిలో విపక్షనేత దాడి వీరభద్రరావుకు సీఎం ఫోన్ కాల్
* ఉదయం జరిగిన ఘటనకు సారీ చెప్పిన కిరణ్‌కుమార్‌
* జూడాల సమస్యలపై సీఎంను కలిసేందుకు వచ్చిన దాడి
* క్యాంపు ఆఫీసు లోపలికి అనుమతించని భద్రతా సిబ్బంది
* అవమానంపై విచారం వ్యక్తం చేసిన సీఎం
* సీఎం స్పందనతో దీక్ష విరమించే యోచనలో దాడి


శాసనమండలిలో విపక్షనేత దాడి వీరభద్రరావుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సారీ చెప్పారు. ఈ ఉదయం సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చిన వీరభద్రరావును లోపలికి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. జూడాల సమస్యలపై సీఎంను కలిసేందుకు క్యాంపు ఆఫీస్‌కు వెళ్తే... తన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడాన్ని వీరభద్రరావు తప్పుపట్టారు. ఇది మండలిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఎం కిరణ్‌ కొద్దిసేపటి క్రితం దాడికి ఫోన్‌ చేసి క్షమాపణలు కోరారు.

No comments:

Post a Comment