కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్కు శుక్రవారం చిరంజీవి అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులను కూడా ఆయన ఆహ్వానించారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్తోపాటు ఆజాద్ వెంట పీపీసీ చీఫ్ బొత్స, ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, కేవీపీ, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, షబ్బీర్అలీతోపాటు పీఆర్పీ నుంచి కాంగ్రెస్లో చేరిన పలువురు నేతలు హాజరయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆజాద్ను మర్యాద పూర్వకంగా చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించినట్లు పీఆర్పీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పీఆర్పీకి ఇస్తామన్న మంత్రి, ఇతర పదవుల విషయంలో ఓ స్పష్టత రావడానికి ఈ అల్పాహార విందు ఉపయోగపడుతుందనేది వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment