Thursday, January 19, 2012

కొత్త మంత్రులుగా పీఆర్పీకి చెందిన ఇద్దరు నేతల ప్రమాణ స్వీకారం



కొత్తమంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వద్ద సందడి కనిపించడం లేదు. సాధారణ ఏర్పాట్లతో మమ అనేపించేలా ప్రమాణస్వీకారం జరిగింది. పీఆర్పీ కి చెందినవారికి మాత్రమే కేబినెట్ లో బెర్తులు ఖాయం కావడంతో కాంగ్రెస్ నేతలు ప్రమాణ స్వీకారాన్ని సీరియస్ గా తీసుకోలేదు.

కొత్త మంత్రులుగా పీఆర్పీకి చెందిన ఇద్దరు నేతల ప్రమాణ స్వీకారం
రామచంద్రయ్యకు విద్యుత్, గంటాకు కమర్షియల్ శాఖల కేటాయింపు
రాష్ట్ర కొత్త మంత్రులుగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన సి. రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11:43 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం 11:50 గంటలకు ముగిసింది. 

రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమం చాలా సాధాసీదాగా ముగిసింది. ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ నేత కృష్ణమూర్తి, మండలి చైర్మన్ చక్రపాణి, చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, అల్లు అరవింద్, నాగబాబుతో పాటు పలువురు మంత్రులు, కొద్దిమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కగా సి. రామచంద్రయ్యకు విద్యుత్, గంటా శ్రీనివాసరావుకు కమర్షియల్ టాక్స్ (వాణిజ్యపన్నులు) శాఖలను కేటాయించినట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

No comments:

Post a Comment