Thursday, January 26, 2012

రెప్పవాల్చని భద్రత

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉందన్న ఇంటెలిజన్స్ వర్గాల హెచ్చరికలతో దేశ రాజధాని ఢిల్లీ నగరం భద్రతాబలగాల కాపలా మధ్య దుర్భేద్యమైన కోటలాగా మారిపోయింది. ఎన్‌ఎస్‌జికి చెందిన షార్ప్ షూటర్లు, పారా మిలటరీ బలగాలతో పాటుగా సుమారు 25 వేల మంది పోలీసులను ప్రధాన కార్యక్రమం అయిన రిపబ్లిక్ డే పరేడ్ జరిగే ప్రాంతంలో మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా గురువారం ఉదయం 11 గంటల 15 నిమిషాలనుంచి గంట సేపుఢిల్లీ గగన తలాన్ని విమానాల రాకపోకలకు మూసివేసారు. ఎత్తయిన భవానలపైన గురి చూసి కాల్చగల నిపుణులను మోహరించడంతో పాటుగా పరేడ్ సాగే రాజ్‌పథ్‌నుంచి ఎరక్రోట వరకు ఉన్న మార్గంలో జనం కదలికలపై నిఘా పెట్టి ఉంచడానికి 160కి పైగా క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలను ఏర్పాటు చేసారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో మొబైల్ హిట్ టీమ్‌లు, విమాన విధ్వంసక తుపాకులు, ఎన్‌ఎస్‌జికి చెందిన షార్ప్ షూటర్ల నిఘాను ఏర్పాటు చేసారు. కాగా, రైసానా సిల్స్‌నుంచి ఎర్రకోట వరకు రిపబ్లిక్ పరేడ్ సాగే ఎనిమిది కిలోమీటర్ల మార్గం పొడవునా ఢిల్లీ పోలీసు కమాండోలు గట్టి నిఘా పెట్టి ఉంచనున్నారు. రాష్టప్రతి ప్రతిభా పాటిల్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పరేడ్‌లో పాల్గొనే వారినుంచి వందనాన్ని స్వీకరించే రాజ్‌పథ్ వద్ద వివిధ అంచెల భద్రతా వలయాలను ఏర్పాటు చేసారు. రాష్టప్రతితో పాటుగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన థాయిలాండ్ తొలి మహిళా ప్రధాని ఇంగ్లుక్ షినవత్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లోను భధ్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసారు. కాగా, తీవ్రవాదులనుంచి ముప్పు పొంచి ఉన్న జమ్మూ, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా మహారాష్టల్రోని గణతంత్ర దినోత్సవాలకోసం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసారు.

No comments:

Post a Comment