Monday, January 30, 2012

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌


* ఇకపై ట్రాఫిక్‌ జామ్‌లు ఉండవు 
* గంటల కొద్దీ ప్రయాణం ఉండదు 
* నో పొల్యూషన్‌.. నో హారన్స్‌ 
* గాల్లో ఎగిరిపోవచ్చు 
* ఏసీ ప్రయాణం 
* ఫ్టైట్‌ జర్నీని తలపించే మెట్రో 
* గంటల కొద్దీ ప్రయాణానికి ముగింపు
* సగం సమయం ఆదా 
* తక్కువ ధరలో లగ్జరీ జర్నీ 
* కిలోమీటర్‌కు ఒక స్టాప్‌ 
* మూడు నిమిషాలకు ఒక ట్రైన్‌ 
* సిటీ మొత్తం కవర్‌ అయ్యేలా రూట్‌మ్యాప్‌ 
* ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ 
* ఆటోమేటిక్‌ ట్రైన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 
* అడ్వాన్స్‌ టెక్నాలజీ 
* ఫైర్‌ ప్రూఫ్‌ కంపార్ట్‌మెంట్స్‌ 
* సీసీ కెమెరాలు 
* 100మంది అంతర్జాతీయ ఇంజనీర్లు 

హైదరాబాదీలు సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమ చిరకాల వాంఛ అయిన మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌కు ఫిబ్రవరిలో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతోంది. మెట్రోతో రాజధాని వాసుల జీవన శైలి అమాంతం మారనుంది. ప్రపంచంలో ఏ మెట్రోకు తీసుపోనంత గొప్పగా మన మెట్రో ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుంటోంది. అతి తక్కువ ధరలో- విలాసవంతమైన, సురక్షితమైన ప్రయాణం సొంతం కానుంది. 

దేశంలోకే విభిన్నమైన మన మెట్రో రైల్‌ ప్రత్యేకతలెన్నో. ఒక్క ప్రాజెక్ట్- ఒకే ఒక్క ప్రాజెక్ట్‌- రాజధాని రూపురేకలను మార్చబోతోంది. నరక ప్రాయమైన నగర ప్రయాణం సుఖమయం అవనుంది. మెట్రో రాకతో... గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్స్‌... పొల్యూషన్‌... రణగొణ ధ్వనుల... రణరంగం నుంచి బయటపడినట్టే. సిగ్నల్స్‌లో గంటల తరబడి వెయిట్‌ చేసే సగటు పౌరుడికి... అమాంతం గాల్లో ఎగిరిపోయి ఈ ట్రాఫిక్‌ నుంచి బయటపడితే ఎంత బాగుండునని ఒక్కసారైనా అనిపించి ఉంటుంది. 

మెట్రో రైల్‌తో ఈ కల నిజం కాబోతోంది. హైదరాబాదీని గాల్లో గమ్య స్థానానికి చేర్చడానికి మెట్రో వస్తోంది. అదీ మరింత వేగంగా.. సౌకర్యంగా. హాయిగా ఏసీ రైల్లో కూర్చొని మీకు నచ్చిన బుక్‌ చదువుకోవచ్చు. లాప్‌టాప్‌ ఆపరేట్‌ చేయొచ్చు. ఇలాంటి ఎన్నో సౌకర్యాలు మెట్రో సొంతం. ఇప్పుడున్న ట్రాఫిక్‌లో మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌కు ప్రయాణించాలంటే ఎంత లేదన్నా గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. 

అదే మెట్రో అయితే జస్ట్‌ 45మినిట్స్‌లో చేరుకోవచ్చు. అంటే సగం సమయం ఆదా అన్నమాట. అదీ ఎలాంటి అలసట లేకుండా.. హాయిగా.. చల్లగా. అలాగని మెట్రో ప్రయాణం.. ఖరీదైనదేమో అనుకుంటే పొరబాటే. 8 నుంచి 19 రూపాయల మధ్య టికెట్‌ రేట్లను ఫిక్స్‌ చేశారు. ప్రతీ కిలో మీటర్‌కు ఒక స్టాప్‌ ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్‌లో అర నిమిషం పాటు రైల్‌ ఆగుతుంది. రైలు ఆగినప్పుడు మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. 

ప్రతీ మూడు నుంచి ఐదు నిమిషాలకు ఒక ట్రైన్‌ అందుబాటులో ఉంటుంది. అందుకోసం మొత్తం 72 రైళ్లను నడపనున్నారు. దిల్‌సుఖ్‌నగర్, కోఠి, ఇమ్లిబన్‌, ఛార్మినార్‌, ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌, జూబ్లీ బస్‌ స్టేషన్‌, బేగం పేట్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణ గూడా, ఖైరతాబాద్‌, అమీర్‌ పేట్‌, బాలానగర్‌, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, మియాపూర్‌... ఇలా నగరంలోని అన్ని ప్రాంతాలు కవర్‌ అయ్యేలా రూట్‌ మ్యాప్‌ రూపొందించారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ డిజైన్‌, టెక్నాలజీలో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ మెయింటెన్‌ చేస్తున్నారు. 

ఆటోమేటిక్‌ ట్రైన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, పట్టాలు తప్పకుండా అడ్వాన్స్‌ టెక్నాలజీ, అగ్ని ప్రమాదాలను తట్టుకునే బోగీలు, సీసీ కెమెరాల నిఘా... ఇలా ఎన్నో ఫీచర్స్‌ అండ్‌ సెక్యూరిటీ మెజర్స్‌... ఫాలో అవుతున్నారు. మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100మంది ప్రముఖ ఇంజనీర్లతో పాటు మూడు కారిడార్లలో నిర్మించే స్టేషన్ల డిజైన్‌ కోసం మూడు దేశాలకు చెందిన టాప్‌ ఆర్కిటెక్ట్స్‌ ను ఇప్పటికే ఎల్‌ అండ్‌ టీ నియమించుకుంది. 

దేశంలోకే కాదు.. ప్రపంచంలోని ఏ మెట్రో రైల్‌కు తీసిపోని విధంగా రూపొందబొతున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ‌... 2014కల్లా భాగ్యనగరం మెడలో మెరవనుంది. 

No comments:

Post a Comment