Monday, September 10, 2012

ఉప్పుటేరులో గట్టును తొగించిన అధికారులు







విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెం ఉప్పుటేరుకు అడ్డంగా వేసిన గట్టును సోమవారం రెవెన్యూ,పోలీసు అధికారులు తొలగించారు.సింహాద్రి ఎన్టీపీసీలో ఉపాది కల్పించాలని కోరుతూ మత్య్సకారులు ఇరవై ఆరురోజులు క్రితం ఉప్పుటేరుకు అడ్డంగా గట్టు వేసిన సంగతి తెలిసిందే  దీంతో పంటపొలాలు చేపలు చెరువులు ముంపునకు గురయ్యాయి ఆర్డీవో  మత్య్సకారులుతో పలు దపాలు చర్చలు జరిపి నప్పటకీ పలితం లేకపోవడంతో భారీపోలీస్ బంధోబస్తుతో గట్టును తొలగించారు.అడ్డుకున్న మత్య్సకారులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆర్డీవో రంగయ్య ,ఎసిపి రవిబాబు ఆద్వర్యంలో ముత్యాలమ్మపాలెం మత్స్యకార గ్రామాన్ని పోలీస్ బలగాలు  ఆధీనంలోకి తీసుకున్నాయి. భారీగా సాయుధ బలగాలను మోహరించారు. పోలీస్ ఉన్నతాధికారులు ముత్యాలమ్మపాలెం గ్రామాన్ని  సందర్శించారు. సుమారు 25 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 50 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఏడు వందల మంది సిబ్బందిని ముత్యాలమ్మపాలెంలో మోహరించారు. నలుగురు ఎసిపిలు తో బలగాలను పర్యవేక్షిస్తున్నారు. వాటితోపాటు రైఫిల్, గ్యాస్ పార్టీలను రప్పించారు. వజ్రా 207 వాహనాన్ని సిద్ధం చేశారు. అనకాపల్లి అగ్నిమాపక కేంద్రం శకటాన్ని సిద్ధం చేశారు. ముత్యాలమ్మపాలెంలో ప్రతిచోట వైర్‌లెస్ సెట్‌లను ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తానికి వీడియో, ఫోటో గ్రాఫర్లను సిద్ధం చేసి గట్టును తొలగించారు..

No comments:

Post a Comment