తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ. రామారావు విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ శిల్పాన్ని హైదరాబాద్కు చెందిన మహాచార్య అనే శిల్పి చెక్కనున్నారు. విగ్రహాన్ని తామే సమర్పిస్తామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పోటీపడినా, చివరకు ఆ అవకాశం మాత్రం పురందశ్వరికే దక్కింది. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని సమర్పించాలని లోక్ సభ సెక్రటరీ జనరల్ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి సూచించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం రాజ్యసభ ఆరో నంబర్ విశ్రాంతి మందిరం పక్కన, తమిళ నేత మురసోలి మారన్ విగ్రహం ఎదురుగా ప్రతిష్టించనున్నారు.
No comments:
Post a Comment