Tuesday, October 9, 2012

ఫార్మాసిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం


విశాఖ : పరవాడ ఫార్మాసిటీ వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం అర్థరాత్రి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం జరగటంతో తాడి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఫార్మా కంపెనీలను జనావాసాల నుంచి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విధులకు వెళుతున్న అయిదు కంపెనీల కార్మికులను అడ్డుకున్నారు. అంతే కాకుండా రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్తులు ఆందోళనను కొనసాగిస్తున్నారు.








No comments:

Post a Comment