Tuesday, November 20, 2012

ఐపీఎస్ ల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


పీఎస్ బదిలీల జీవోను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఉత్కంఠతో కొనసాగిన ఐపీఎస్ ల జీవోల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ల బదిలీల జీవోపై సంతకం  చేశారు. రాష్ట్రంలో 43మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఏసీబీ మాజీ డీజీ భూపతిబాబుకు అప్రాధాన్యత పోస్టు లభించింది.
విశాఖ పోలీస్ కమీషనర్ గా శివధర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీగా టి.కృష్టంరాజు, ఏసీబీ డైరెక్టర్ గా విశ్వజిత్, వెస్ట్ జోన్ డీసీపీ స్టీఫెన్ రవీంద్రా గ్రేహౌండ్స్ కు బదిలీ చేసింది. రైల్వే శాఖ అదనపు డీజీగా భూపతిబాబు, సీబీఐ అదనపు డైరెక్టర్ గా కృష్ణప్రసాద్, సీఐడీ డీఎస్పీ రమణమూర్తి ఫైర్ సర్వీస్ కు బదిలీ చేసింది.
విజిలెన్స్ ఐజీగా కె.సత్యనారాయణ ఎల్బీనగర్ డీసీపీగా రవివర్మ, హైదరాబాద్ క్రైమ్ అదనపు కమీషనర్ గా సందీప్ శాండిల్య, గుంటూరు రేంజ్ ఐజీగా రవిగుప్త, పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ గా ఈ.దామోదర్ ఏపీఎస్సీ బెటాలియన్ ఐజీగా కే.ఆర్ .ఎం.కిషోర్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా టీ.పీ.దాస్, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా శివశంకర్ రెడ్డిని,విశాఖ పోలీస్ కమీషనర్ గా పని చేసిన పూర్ణచంద్రరావును  శాంతిభద్రతల విభాగం ఐజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

No comments:

Post a Comment