తెలంగాణాపై నాన్చొద్దని హైకమాండ్ నిర్ణయం ? ఇక తేల్చుడే !
తెలంగాణాపై ఇక తేల్చేందుకే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో భేటీ జరిగింది. ఈ అంశంపై గంటన్నరపాటు చర్చ జరిగింది. T - కాంగ్రెస్ నేతల రాజీనామాల సెగను ఫ్యూచర్లో ఎదుర్కొకోకుండా ఉండేందుకే నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై అధినేత సోనియా గాంధే స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం.
అందుకే మన్మోహన్, అహ్మద్పటేల్తో గంటపాటు తెలంగాణ, దాని ప్రత్యామ్నాయాలపై చర్చించారు. ఆ తర్వాత అరగంటపాటు జరిగిన కోర్ కమిటీలో ఏం చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించారు.
No comments:
Post a Comment