Wednesday, April 24, 2013

విశాఖపట్నంలో వస్తున్నా మీకోసం పాదయాత్ర ......


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. కశింకోట మండలం పిసినికాడ నుంచి ప్రారంభమైన యాత్ర కొత్తూరు కూడలి,ఎన్జీవో కాలనీ సుంకరమెట్ట,శంకరం గ్రామాల మీదుగా కొనసాగింది. పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను చంద్రబాబు ఆవిష్కరించారు. దారివెంట రైతులు, యువకులతో ముచ్చటించారు.
 ప్రభుత్వం అనవసర వివాదాలు సృష్టించకుండా విశాఖ ప్లాంటుకు ఓబులాపురం గనులను కేటాయించి, బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దళితులకు ద్రోహం చేస్తున్న సీఎం కిరణ్ దళిత బంధు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై తమ పార్టీకి స్పష్టత ఉందని,ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. సినీనటుడు నందమూరి తారకరత్న బాబుతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. 
అటు చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి.  ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా సమావేశంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని భవిష్యత్ తెలుగుదేశం పార్టీదేనని తుమ్మల అన్నారు.
మనిషిని నడిపించేది మైండ్‌సెట్
నిషిని నడిపించేది మైండ్‌సెట్. మైండ్ సెట్ ఎలా ఉంటే మనిషి అటే నడుస్తాడు. అది మంచి మార్గంలో కావచ్చు లేదంటే దుర్మార్గపు ధోరణిలో కావచ్చంటూ తన అనుభవాలను, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను చంద్రబాబు కార్యకర్తల వద్ద వెల్లడించారు. నియోజకవర్గ సమీక్షలో





భాగంగా గాజువాకకు చెందిన యువశ్రీ అనే మహిళా కార్యకర్త మీరు తినరు ఎవరినీ తిననీయరంటూ చేసిన వాఖ్యలపై చంద్రబాబు సుదీర్ఘంగానే స్పందించారు. ఒక ఉన్నతమైన ధ్యేయంతో రాజకీయాల్లోకి వచ్చాను. క్రమశిక్షణకు, నిబద్ధతకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నాను. నేను అవినీతి పరుణ్ణయినా, నాఅనుచరులు అవినీతిపరులైనా తెలుగుదేశం పార్టీ ఇప్పుడీ పరిస్థితిలో ఉండేది కాదు. తొమ్మిదేళ్ళు అధికారంలో లేకపోయినా పార్టీకోసం ఊరూరా తిరుగుతున్నాను. ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. నేను అవినీతిపరుణ్ణయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రాజశేఖర రెడ్డి తన విశ్వరూపాన్ని చూపించేవాడు. ఎన్నో కమిషన్లు వేయించాడు. కోర్టుల్లో కేసులు వేయించి వేధించాడు. ఒక్క కేసులో కూడా వారికి సరైన ఆధారం దొరకలేదు. అందుకే ఇప్పుడు మనం ప్రజల దగ్గరకు ధైర్యంగా పోగలుగుతున్నాం. లేదంటే జగన్మోహన రెడ్డి మాదిరి జైల్లో ఉండాల్సి వచ్చేది. ఇక ఒకే మైండ్‌సెట్ ఉన్నవారు ఒకే గూటికి చేరుతారని, అందులో భాగంగానే కొంతమంది పార్టీ లీడర్లు వైకాపాలో చేరుతున్నారని వాఖ్యానించారు. అటువంటి వారు కేవలం 4 నుంచి 5 శాతం మాత్రమే ఉన్నారన్నారు. టెక్నాలజీ, మోటివేషన్ వంటి అంశాల్లో తాను నిష్ణాతుణ్ణని, తనకు ఎవరూ మభ్యపెట్టలేరని పేర్కొన్నారు.

No comments:

Post a Comment