Monday, April 1, 2013

కోతలతో కొట్లాటలు...!!!???


కాంగ్రెస్ లో విద్యుత్తు ఛార్జీల దుమారం: సర్కారు వైఖరిపై నేతల మండిపాటు
కరెంట్  చార్జీల పెంపు కాంగ్రెస్  పార్టీలో మంటలు రేపుతోంది. చేతికి గట్టిగా షాక్  తగిలింది. స్వపక్షమే విపక్షంలా మారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్  రెడ్డిని టార్గెట్  చేశాయి.  అటు విపక్షాలు లెఫ్ట్  అండ్  రైట్  సర్కార్ ని దుమ్మెత్తి పోస్తున్నాయి. దీంతో సీఎం వెనక్కి తగ్గారు. పేదలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఛార్జీల పెంపు అంశం అధికార పార్టీలోనూ ప్రకంపనలను సృష్టిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీ నేతలు తప్పబడుతున్నారు. ఇంటా బయ
టా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో రాష్ట్ర సర్కారు పునరాలోచనలో పడింది.  ఛార్జీల భారం సామాన్యులపై పడబోదని చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కిరణ్ ప్రకటించారు. ఈ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ లో విద్యుత్తు ఛార్జీల దుమారం
సర్కారు వైఖరిపై నేతల మండిపాటు
ఆజాద్‌కు చిరంజీవి లేఖ
పార్టీకి నష్టం కలుగుతుందన్న వీహెచ్
సామాన్యులపై భారం ఉండదన్న బొత్స
చార్జీల మోత మోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్ణయంపై స్వపక్ష నేతలూ నిరసన స్వరాలు అందుకున్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి చిరంజీవి ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు లేఖ రాయడం పార్టీలో కలకలం రేపుతోంది. విద్యుత్ సమస్య, చార్జీల పెంపు అంశంపై చర్చించేందుకు సత్వరమే 'సమన్వయ కమిటీ' సమావేశం ఏర్పాటు చేయాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఎన్నికల ఏడాదిలో ఇంత భారీ ఎత్తున చార్జీలు పెంచడం వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని చిరంజీవి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్తు ఛార్జీల పెంపు అంశం అధికార కాంగ్రెస్ పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఛార్జీలను పెంచడాన్ని ఎంపి వివేక్ తప్పుపట్టారు. అదే పనిగా విద్యుత్తు చార్జీలను పెంచడం సిగ్గుచేటన్నారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్నికలకు ముందు ఛార్జీలను పెంచితే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. పెంపును నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్కారుపై ముప్పేట దాడి కొనసాగుతున్న నేఫథ ్యంలో కాంగ్రెస్ నేతలు దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. ఛార్జీల పెంపును పున:పరిశీలిస్తామని రెవిన్యూ మంత్రి ఎన్ .రఘువీరారెడ్డి  ప్రకటించారు.

మరో వైపు పీసీసీ ఛీప్ బొత్స తన దైన శైలిలో స్పందించారు. చార్జీలు పెంచాలన్న నిర్ణయం తీసుకోక ముందే.. ఉపసంహరణ అంశం ఎలా ప్రస్తావిస్తారంటూ మీడియాతో అన్నారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడీ తీవ్రంకావడంతో చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కిర ణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఛార్జీల పెంపు భారం సామాన్యులపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విపక్షాలు ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఏప్రిల్ 4,5 తేదిల్లో ఛార్జీల పెంపుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సీఎం వ్యాఖ ్యలతో ఛార్జీల పెంపుపై సర్కారు వెనక్కి తగ్గుతున్నట్లే కనిపిస్తోంది.

విద్యుత్తు ఛార్జీల పెంపు అంశం రాష్ట్ర రాజకీయాలను అట్టుడికిస్తోంది. సర్కారు తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఐక్య పోరాటానికి సన్నధ్దమవుతున్నాయి.అటు విద్యుత్తు సమస్యపై బిజేపి చేపట్టిన దీక్షలకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. సిద్దాంత వైరుధ్యాలున్నా ప్రజాసమస్యల విషయంలో  కలిసి ఉద్యమిస్తామని నేతలు వెల్లడించారు.

No comments:

Post a Comment