Saturday, April 13, 2013

దాడి / గంటా శ్రీనివాస్‌ భేటీని రాజకీయం చేస్తున్న మీడియా...!!?


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒకవైపు కాలినొప్పి.. మరోవైపు దాడితో తలనొప్పి తప్పట్లేదు. తెదేపా నేత దాడి వీరభద్రరావు గంటా శ్రీనివాసరావుతో భేటీ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే వీరభద్రరావు మాత్రం తాను పార్టీకి విధేయుడిగానే ఉంటా
నని చెప్తున్నారు. అంతేగాకుండా గంటాతో భేటీ కావడం వెనుక రాజకీయం లేదని వీరభద్రరావు స్పష్టం చేస్తున్నారు. అనకాపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంపైనే మంత్రిని కలిశానని చెప్తున్నారు. అయితే రాజకీయ పండితులు మాత్రం చంద్రబాబు బీసీలపై చిన్నచూపు చూడటం ద్వారా దాడి తప్పకుండా అసంతృప్తితోనే ఉన్నారని అందుకే చంద్రబాబు పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో అడుగిడుతున్న వేళ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుతో శుక్రవారం టీడీపీనేత దాడి వీరభద్రరావు సమావేశమై పార్టీకి చిన్నపాటి షాక్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. దాడి ఎదురుదాడిని చంద్రబాబు ఏమేరకు పరిష్కరిస్తారో వేచి చూడాలి.

No comments:

Post a Comment