Thursday, February 28, 2013

కిడ్నాప్‌కు గురైన ఇంజనీర్‌ పైడిరాజు విడుదల


సోంలో ఈనెల 15న అపహరణకు గురైన ఇంజనీర్ పైడిరాజు విడుదలయ్యాడు. పైడిరాజును బోడో తీవ్రవాదులు క్షేమంగా విడిచిపెట్టారు. అసోంలో పవర్ గ్రీడ్ లో కో అపరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్యాలీటీ కంట్రోల్ ఇంజనీర్ గా పైడిరాజు విధులు నిర్వహిస్తున్నాడు. తీవ్రవాదుల విడుదల అనంతరం పైడిరాజు భిక్ష పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. పైడిరాజును విడుదల చేసిన బోడో తీవ్రవాదులు







12 రోజుల కిడ్నాపైన పైడిరాజు
అసోంలోని భక్త పీఎస్‌కు చేరుకున్న పైడిరాజు
తీవ్రవాదుల చెర నుంచి పైడిరాజు విడుదలయ్యారు. అసోంలో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీలో పని చేస్తున్న విశాఖకు చెందిన పైడిరాజును బోడో తీవ్రవాదులు 12రోజుల క్రితం కిడ్నాప్‌ చేశారు. ఆయన అసోంలోని భక్త పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పైడిరాజు విడుదలపై విశాఖ గాజువాకలో ఉన్న అతని తలిదండ్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే పైడిరాజు కిడ్నాప్ విషయంపై మంత్రి గంటా అసోం పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ మేరకు పైడిరాజు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మహావిశాఖ గాజువాక జోనల్ పరిధిలోని కణితికాలనీ తెలికల వీధికి చెందిన అప్పారావుఏకైక కుమారుడైన పైడిరాజును కష్టపడి చదివించారు. అనంతరం పైడిరాజు ఢిల్లీకి చెందిన బీసీ నయ్యా అనే సంస్థలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా చేరాడు. ఇటీవల ఆ సంస్థకు అసోం పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు సంబంధించి ప్రాజెక్ట్ పనులు దక్కటంతో పైడిరాజుతో పాటు మరికొంత మంది ప్రతినిధులను అసోం పంపించారు. 

No comments:

Post a Comment