Thursday, May 26, 2011

త్వరలో పంచాయితీరాజ్‌ ఎన్నికలు


త్వరలో పంచాయితీరాజ్‌ ఎన్నికలు

* జూలైతో ముగుస్తున్న కాలవ్యవధి 
* సర్కార్‌కు ఈసీ లేఖ 
* ఎన్నికలు నిర్వహించకుంటే రాజ్యాంగ సంక్షోభమే ! 
* అభ్యర్థుల కోసం పార్టీల వేట 
పంచాయితీ రాజ్‌ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. జూలైతో ప్రస్తుత పాలకవర్గాల కాలవ్యవధి ముగుస్తుండటంతో ఎలక్షన్లకు ఈసీ రెడీ అవుతోంది. ఈ విషయంలో సర్కార్‌ సత్వరమే నిర్ణయం తీసుకోవాలంటూ లేఖరాసింది. కాలయాపన చేస్తే రాజ్యాంగ సంక్షోభం తప్పదంటూ హెచ్చరించింది. పల్లెల్లో సందడి మొదలవ్వబోతోంది. త్వరలో పంచాయితీరాజ్‌ ఎన్నికల నగారా మోగబోతోంది. ఐదేళ్ళకొకసారి వచ్చే ఈ సండగ కోసం పార్టీలన్నీ రెడీ అయిపోతున్నాయి. 
జూలై 21తో కాలవ్యవధి పూర్తవుతుండటంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. అటు గవర్నర్‌కు సైతం ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలంటూ సూచించింది ఈసీ. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయాలనుకున్న ప్రభుత్వానికి మాత్రం ఇది శరాఘాతంగా తగిలింది. 
కాలపరిమితి ముగియగానే ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రిజర్వేషన్లను సైతం రెండు వారల్లో ప్రకటించాలని ఈసీ, రాష్ట్రప్రభుత్వానికి లేఖరాసింది. మునిసిపల్‌ చట్టంలోని లొసుగులను అడ్డంపెట్టుకొని ఏడాది కాలంగా పురపాలక సంఘ ఎన్నికలను వాయిదా వేసి స్పెషలాఫీర్ల పాలనలో కొనసాగిస్తుంది. పంచాయితీ రాజ్‌ చట్టంలో అలాంటి వెసులుబాటు లేకపోవడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యం కానుంది. 
ఒకవేళ సర్కార్‌ జాప్యం చేస్తే హైకోర్టుకెళ్ళేందుకు కూడా ఈసీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. జూన్‌ మొదటి వారంలోగా రిజర్వేషన్ల ప్రక్రియ ముగిస్తే జూన్‌ 11 - 13 తేదీల మధ్య నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 21 నాటికి జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు కార్యవర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం ఎన్నికలు, పరోక్షంగా అధ్యక్షులుగా ఎన్నుకోవడానికి మొత్తం 27 రోజుల సమయం పడుతుంది. 
ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అలసత్వం వహిస్తే పంచాయితీ రాజ్‌ సంస్థల్లో పాలన స్థంభించి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. సర్కార్‌ ఈ ఎన్నికల విషయంలో త్వరిత గతిన మేల్కొంటే జూలైలో రాష్ట్రమంతా ఎన్నికల సందడి కనిపించనుంది. 

రణభేరి హోరాహోరీ


Wednesday, May 25, 2011

తీరుమార్చుకో .. పార్టీ శ్రేణుల్ని ‘చే’జారనివ్వవద్దు – సిఎంకు సోనియా క్లాస్‌


తీరుమార్చుకో .. పార్టీ శ్రేణుల్ని ‘చే’జారనివ్వవద్దు – సిఎంకు సోనియా క్లాస్‌
రాష్ట్రంలో అదుపు తప్పుతున్న కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంపై కేంద్రీకరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేడిక్కడ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. అధ్యక్షురాలితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌లు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో త్వరలో తిరిగి ఉధృతమౌతుందని భావిస్తున్న తెలంగాణ ఉద్యమం, కడప ఉప ఎన్నికల ఫలితాలు, జగన్‌ వర్గం ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం, చాలాకాలంగా ఖాళీగా ఉన్న పార్టీ, ప్రభుత్వ పదవుల భర్తీ వ్యవహారంతో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యవహార శైలిపై వస్తున్న ఫిర్యాదులపై దాదాపు అరగంటకు పైగా లోతుగా చర్చ జరిగినట్లు తెలియవచ్చింది.  రాష్ట్రంలో క్రమేపీ దిగజారుతున్న కాంగ్రెస్‌ పరిస్థితిపై కొంతకాలంగా తీవ్రంగా ఆందోళన చెందుతున్న అధిష్టానం బహుశా, వచ్చే నెలలో రాజస్థాన్‌లో నిర్వహించనున్న చింతన్‌ శివిర్‌ (మేధో మథన సదస్సు)లో వివరంగా చర్చించి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ ఈలోగా పరిస్థితి పూర్తిగా చేజారిపోకుండా చూసే ఉద్దేశంతో రాష్ట్ర పర్యటన తర్వాత గులాంనబీ ఆజాద్‌ పార్టీ అధ్యక్షురాలికి సమర్పించిన నివేదిక ప్రాతిపదికగా ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకోవాలని, పార్టీ నాయకులందరినీ కలుపుకొని పోతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రికి సలహా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రులు, లెజిస్లేటర్లు, పిసిసి కార్యవర్గ సభ్యులు, సీనియర్‌ నాయకులు పలువురు ముఖ్యమంత్రి పనితీరును తీవ్రంగా దుయ్యబడుతూ ఆజాద్‌కు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని సోనియాగాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను మెరుగుపరిచే విషయంలో ముఖ్యమంత్రికి కేంద్రం నుండి అవసరమైన అన్నిరకాల సహాయ, సహకారాలుంటాయని హామీ ఇచ్చిన అధిష్టానం పార్టీ నాయకత్వం ఆశిస్తున్న ఫలితాలను తెచ్చే బాధ్యతను గుర్తించి మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించింది. పార్టీ నాయకులతో సమన్వయాన్ని మెరుగుపరిచే విషయంలో అవసరమైతే ఇప్పటికే ఏర్పాటైన పిసిసి-ప్రభుత్వ సమన్వయ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తామని కూడా వాగ్దానం చేసినట్లు తెలియవచ్చింది.
రాష్ట్రంలో అదుపు తప్పుతున్న కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంపై కేంద్రీకరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేడిక్కడ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. అధ్యక్షురాలితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌లు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో త్వరలో తిరిగి ఉధృతమౌతుందని భావిస్తున్న తెలంగాణ ఉద్యమం, కడప ఉప ఎన్నికల ఫలితాలు, జగన్‌ వర్గం ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం, చాలాకాలంగా ఖాళీగా ఉన్న పార్టీ, ప్రభుత్వ పదవుల భర్తీ వ్యవహారంతో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యవహార శైలిపై వస్తున్న ఫిర్యాదులపై దాదాపు అరగంటకు పైగా లోతుగా చర్చ జరిగినట్లు తెలియవచ్చింది.  రాష్ట్రంలో క్రమేపీ దిగజారుతున్న కాంగ్రెస్‌ పరిస్థితిపై కొంతకాలంగా తీవ్రంగా ఆందోళన చెందుతున్న అధిష్టానం బహుశా, వచ్చే నెలలో రాజస్థాన్‌లో నిర్వహించనున్న చింతన్‌ శివిర్‌ (మేధో మథన సదస్సు)లో వివరంగా చర్చించి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ ఈలోగా పరిస్థితి పూర్తిగా చేజారిపోకుండా చూసే ఉద్దేశంతో రాష్ట్ర పర్యటన తర్వాత గులాంనబీ ఆజాద్‌ పార్టీ అధ్యక్షురాలికి సమర్పించిన నివేదిక ప్రాతిపదికగా ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకోవాలని, పార్టీ నాయకులందరినీ కలుపుకొని పోతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రికి సలహా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రులు, లెజిస్లేటర్లు, పిసిసి కార్యవర్గ సభ్యులు, సీనియర్‌ నాయకులు పలువురు ముఖ్యమంత్రి పనితీరును తీవ్రంగా దుయ్యబడుతూ ఆజాద్‌కు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని సోనియాగాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను మెరుగుపరిచే విషయంలో ముఖ్యమంత్రికి కేంద్రం నుండి అవసరమైన అన్నిరకాల సహాయ, సహకారాలుంటాయని హామీ ఇచ్చిన అధిష్టానం పార్టీ నాయకత్వం ఆశిస్తున్న ఫలితాలను తెచ్చే బాధ్యతను గుర్తించి మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించింది. పార్టీ నాయకులతో సమన్వయాన్ని మెరుగుపరిచే విషయంలో అవసరమైతే ఇప్పటికే ఏర్పాటైన పిసిసి-ప్రభుత్వ సమన్వయ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తామని కూడా వాగ్దానం చేసినట్లు తెలియవచ్చింది.
కాంగ్రెస్‌ పార్టీని సంస్థాపరంగా పటిష్టం చేసి, ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేసే చర్యలలో భాగంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉంటున్న పార్టీ, ప్రభుత్వ పదవుల భర్తీ అంశం కూడా చర్చకు వచ్చినప్పటికీ శనివారంనాటి చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలియవచ్చింది. ముఖ్యంగా పిసిసి అధ్యక్ష పదవి, శాసనసభ స్పీకర్‌ పదవులకు తగిన నేతలను ఎంపిక చేసే విషయంలో ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, అధిష్టానం నేతల ఆలోచనలకు పొంతన కుదరడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన డి.శ్రీనివాస్‌ స్థానంలో కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్‌ మంత్రి, వెనుకబడిన తరగతులకు చెందిన నాయకుడు బొత్స సత్యనారాయణను ఎంపిక చేయాలన్నది అధిష్టానం ప్రతినిధుల అభిప్రాయంగా కనిపిస్తుండగా ఈ పదవిని తెలంగాణకు చెందిన షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన సీనియర్‌ నాయకుడు సంభాని చంద్రశేఖర్‌ లేదా మాజీ మంత్రి కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి పేర్లను కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రతిపాదిస్తునట్లు సమాచారం. వీరిద్దరి పేర్లతో పాటు తెలంగాణకే చెందిన మరో సీనియర్‌ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్‌ ఆలి, కోస్తాకు చెందిన మరో సీనియర్‌ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు.
అలాగే, శాసనసభ స్పీకర్‌ పదవిని కూడా తనకు సన్నిహితుడైన తెలంగాణ ప్రాంత సీనియర్‌ శాసనసభ్యుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికే కట్టబెట్టాలని ముఖ్యమంత్రి కోరుకొంటున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే, స్పీకర్‌ పదవి ఖాళీ అయినప్పటి నుంచి శాసనసభ కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ప్రమోషన్‌ ఇచ్చేందుకే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకునికే ఉపముఖ్యమంత్రి ఇవ్వనున్నట్లు అధిష్టానం గతంలోనే ప్రకటించినప్పటికీ పిసిసి సారథిగా ఎంపికయ్యే నేతను బట్టి రాష్ట్ర మంత్రి దామోదర్‌ రాజనర్సింహ స్థానంలో మరో ప్రాంత నాయకునికి ఈ పదవి దక్కే అవకాశాలు లేకపోలేదని అభిజ్ఞవర్గాల కథనం.
పదవుల భర్తీ, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ, గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో శాసనమండలి సభ్యుల ఎంపిక తదితర అంశాలన్నింటిపై మరో నెల లోపు ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేదని, శనివారంనాటి చర్చలు ఎక్కువగా రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలనను గాడిలో పెట్టడంపైనే, పార్టీ… ప్రభుత్వం మధ్య మెరుగైన సమన్వయాన్ని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే కేంద్రీకృతమైనట్లు ఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అధిష్టానం పిలుపుపై శనివారం ఉదయమే ఇక్కడికి చేరుకున్న ఆయన కేంద్ర హోం మంత్రి చిదంబరం, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలుసుకొన్న తర్వాత సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అయిన కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌ నివాసానికి వెళ్లి కొద్దిసేపు ఆయనతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అక్కడి నుండే ఆజాద్‌తో కలిసి పార్టీ అధ్యక్షురాలి నివాసం, 10-జన్‌పథ్‌ చేరుకుని సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అధ్యక్షురాలితో చర్చల అనంతరం ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడడానికి ఇష్టపడకుండా రాత్రి బసకోసం ఎపి భవన్‌కు వెళ్లిపోయారు.  ఆదివారం ఉదయం ఇక్కడ నుండి బయలుదేరి బెంగళూరు మీదుగా అనంతపురం వెళ్లనున్న ముఖ్యమంత్రి అనంతపురం పార్లమెంట్‌ సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి కుమార్తె వివాహానికి హాజరై సాయంత్రానికి ఢిల్లీ తిరిగి వస్తారని, కేంద్రంలో రెండవసారి యుపిఎ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం రాత్రి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తన అధికార నివాసంలో యుపిఎ భాగస్వామ్య పక్షాల నాయకులు, పార్లమెంట్‌ సభ్యులు, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు ఇవ్వనున్న విందుకు హాజరౌతారని అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ విందు సమావేశంలో యుపిఎ రెండేళ్ల పాలనపై ప్రభుత్వం ఒక నివేదికను విడుదల చేయనున్న విషయం విదితమే.

Tuesday, May 24, 2011

దొంగల కాల్పుల్లో ఇద్దరు మృతి






దొంగల కాల్పుల్లో ఇద్దరు మృతి
విశాఖపట్నం: దొంగతనానికి వచ్చిన దొంగలు ఇంటి యజమానులపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని అగనంపూడిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 
ప్రముఖ పారిశ్రామిక ప్రాంతం. ప్రశాంత వాతావరణానికి నిలయం. అలాంటి గాజువాక మంగళవారం రాత్రి ఉలిక్కిపడింది. శివారు ప్రాంతమైన అగనంపూడిలో తూటాల వర్షం కురిసింది. ఇద్దరు దుండగులు తుపాకులతో ఇంట్లో చొరబడ్డారు. ఒక రియల్టర్, అతని కుమారుడిని కాల్చిపారేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు గాజువాక ప్రాంతంలో జరిగిన దాఖలాల్లేవు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడటం ఈ ప్రాంతీయుల్ని కలవరపరుస్తోంది. రియల్ ఎస్టేట్ మాఫియా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలివి.


 తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన వాసర్ల సాయిబాబా (43) గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఎనిమిదేళ్ల క్రితం అగనంపూడికి కుటుంబంతో తరలివచ్చాడు. ఇక్కడి బొర్రమాంబ ఆలయ సమీపంలోని దిబ్బపాలెంలో స్థిరపడ్డాడు. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వెనుక తిరిగేవాడు. నాలుగేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు. సాయిబాబా కుమారుడు పవన్ నరేష్ (23) గాజువాక ఆటోనగర్‌లోని ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. చిన్నకుమారుడు సురేష్ (20) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. 


మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు తలుపుతట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించారు. తాము చోరీ కోసం వచ్చామని... ఇంట్లోని నగదు, ఆభరణాలన్నీ ఇచ్చేయాలని గదమాయించారు. మూడు పిస్తోళ్లతో బెదిరించారు. ఈ హఠాత్ పరిణామానికి సాయిబాబా కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోయారు. తమ వద్ద చెవిదుద్దులు మాత్రమే ఉన్నాయని చెప్పగా దుండగులు కేకలు వేస్తూ కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో సాయిబాబా అక్కడికక్కడే మృతి చెందాడు. నరేష్‌ను అగనంపూడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అక్కడే ఉన్న సాయిబాబా తోడల్లుని కుమారుడు మట్టపర్తి దినేష్ తలపై కూడా దుండగులు కుట్టుమిషన్ కత్తెరతో మోదడంతో గాయపడ్డాడు. 


ఈ దాడితో మృతుని భార్య కమలమ్మ తేరుకోలేకపోతోంది. జీవితాంతం తోడుండాల్సిన భర్త, చేతికందిన పెద్ద కొడుకు కన్నుమూయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అగనంపూడిలోనే సాయిబాబా తోడల్లుడు రసాయనాల వ్యాపారం చేస్తున్నాడు. మృతునికి స్వగ్రామంలో పాత తగాదాలున్నట్టు సమాచారం. ఈ హత్యకు కారణం భూ తగాదాలా?, పాతకక్షలా అన్నది తేలాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావు, క్రైమ్ ఏసీపీ బి.పి.తిరుపాలు, సీఐలు దేవప్రసాద్, చంద్రశేఖర్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. 



పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయితే తప్ప దీనిపై ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. అగనంపూడి టోల్‌ప్లాజావద్ద 30 మంది పోలీసు సిబ్బంది, కూర్మన్నపాలెం కూడలి వద్ద మరో 30 మందితో పికెట్లు ఏర్పాటు చేసి వాహనాలను పకడ్బందీగా తనిఖీ చేస్తున్నారు.

Monday, May 23, 2011

27 నుంచి బాబా మహా సమాధి నిర్మాణం


27 నుంచి బాబా మహా సమాధి నిర్మాణం
భగవాన్ సత్యసాయి బాబా మహా సమాధి నిర్మాణ పనులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. 6 వారాల పాటు మహా సమాధి నిర్మాణ పనులు జరుగుతాయని బాబా అనువాదకుడు అనిల్‌కుమార్ తెలిపారు. ఈ సమయంలో భక్తులకు దర్శనం నిలిపివేస్తామని చెప్పారు. ప్రశాంతి నిలయంలో యధావిధిగా భజన కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

ముగిసిన ఎంసెట్ పరీక్ష


ముగిసిన ఎంసెట్ పరీక్ష
ఎంసెట్ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.  ఎంసెట్ రాసే విద్యార్థులకు నిబంధనలు కఠినతరం చేయడంతో వారు అనేక ఇబ్బందులు పడ్డారు. నిబంధనల గురించి విస్తృతంగా ప్రచారం చేసినా పలువురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించకపోవడంతో కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు. పరీక్ష కోసం తాము పడిన శ్రమంతా నిష్ప్రయోజనమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కాకా పరిస్థితి విషమం


కాకా పరిస్థితి విషమం
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యబృందం తెలిపింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసారు.  హృదయస్పందన నెమ్మదిగానే ఉందని, షుగర్, బీపీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని, ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని పేర్కొన్నారు. వెంటిలేటర్‌తో కృత్రిమశ్వాసను అందిస్తున్నట్లు చెప్పారు.

Saturday, May 21, 2011

ఈగో సమస్య: వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నటి రోజా రాం రాం!


ఈగో సమస్య: వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నటి రోజా రాం రాం!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈగో సమస్య పతాక స్థాయికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా ఈ పార్టీలో సినీ స్టార్లు ఇమడలేక పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మొన్నటి మొన్న సినీ స్టార్లు డాక్టర్ జీవితా రాజశేఖర్‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెల్సిందే. తమకున్న ప్రజాకర్షణను వైఎస్.జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని అందువల్లే తాము పార్టీని వీడుతున్నట్టు వారు ఆరోపించారు. 
ఇపుడు ఆ పార్టీకి చెందిన మరో తార ఆర్.కే.రోజా ఇదే తరహా ఆరోపణలు చేసి, పార్టీకి దూరమైనట్టు సమాచారం. ఈ ఊహాగానాలను రుజువు చేసేలా ఇటీవల గుంటూరులో వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన 48 గంటల రైతు దీక్షలో ఆమె ఎక్కడా కనిపించలేదు. ఏ చిన్నపాటి సమావేశం, సదస్సు, ధర్నా నిర్వహించినా ముందుండే రోజా.. ఈ దీక్షలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. 
గుంటూరులో జరిగిన రైతు దీక్షా వివరాలను రోజాకు జగన్ మాటమాత్రం చెప్పలేదన్నది వినికిడి. ఈ దీక్షకు తనకు ఆహ్వానం అందక పోవడంతో తీవ్ర నిరాశకు లోనైన రోజా.. తన వ్యవహారంపై పార్టీ నేతల్లో ఆరా తీశారట. ఇందులో పార్టీ సభలు, సమావేశాలకు రోజా మేకప్ వేసుకుని రావడం జగన్‌కు నచ్చలేదట. 
అందుకే ఆమెను దూరంగా పెట్టాలని భావించిన జగన్.. రైతు దీక్షకు ఆహ్వానం పంపలేదనే విషయాన్ని రోజా తెలుసుకున్నారట. దీంతో రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తిరిగి మాతృసంస్థ తెదేపాలోకి వెళ్లాలన్న ఆలోచనలో రోజా ఉన్నట్టు తెలుస్తోంది.

గుడ్డు(జగన్)వచ్చి పిల్ల(బాబు)ను వెక్కిరించిందట: బాబు


గుడ్డు(జగన్)వచ్చి పిల్ల(బాబు)ను వెక్కిరించిందట: బాబు
రైతుల పట్ల గతంలో తమ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ విమర్శించడాన్ని చంద్రబాబు కొట్టి పారేశారు. వెనకటికి ఓ సామెత చెప్పినట్లు గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా జగన్ మాటలున్నాయన్నారు. నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ, అందునా పదవికోసమే పాకులాడే వారు రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 
రైతులకోసం తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రైతుకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని చెప్పారు. ప్రజల బాగోగులు పట్టించుకోని ఇటువంటి పనికిమాలిన, సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకూ చూడనే లేదన్నారు.
రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో రైతు తిరుగుబాటు యాత్రలు జరుగుతాయన్నారు. రైతు సమస్యలపై గురువారం నుంచి రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
తెలంగాణా అంశంపై స్పందిస్తూ... తెలంగాణపై తమ అభిప్రాయాన్ని ఎప్పుడో చెప్పామన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. కనుక సమావేశం ఏదైనా పార్టీ జెండాతోనే జరగాలని ఆయన పరోక్షంగా నాగం జనార్థన్ రెడ్డికి సూచించారు.

Wednesday, May 18, 2011

కాంగ్రెస్‌ను వదిలేయడానికి రెడీ: సబ్బం


కాంగ్రెస్‌ను వదిలేయడానికి రెడీ: సబ్బం 
ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. రైతు కన్నీటిని చూసిన ఏప్రభుత్వమూ మనుగడ సాగించలేదు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయి.
ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వై.ఎస్‌. జగన్‌ బాటలోనే మేం సాగుతామని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి గుంటూరులో స్పష్టం చేశారు. తమ నాయకుడు జగనే నని ఆయన పేర్కొన్నారు. జగన్‌ ఆదేశిస్తే తాను కాంగ్రెస్‌ పార్టీని వదిలేసి రావడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్పారు. తాను జగన్‌ వెంట నడవడా నికి ఎలాంటి ప్రలోభాలు లేవని హరి చెప్పారు.

విశాఖ ఫిష్ బిల్డింగ్ సెంటర్‌లో ప్రమాదం


విశాఖ ఫిష్ బిల్డింగ్ సెంటర్‌లో ప్రమాదం

విశాఖ : విశాఖ నేవీ డాక్‌యార్డ్‌లోని ఫిష్ బిల్డింగ్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. సబ్ మెరైన్ మరమ్మతులు చేస్తుండగా మత్స్యడ్రైడాక్‌లో గేట్లు విరిగి నీరు లోనికి ప్రవేశించింది. బిల్డింగ్ సెంటర్ గేటు ఒక్కసారిగా కూలిపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు అధికారులు, ఇద్దరు కార్మికులు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

భార్యను కరిచిన రేబిస్ వ్యాధిగ్రస్తుడు


భార్యను కరిచిన రేబిస్ వ్యాధిగ్రస్తుడు
కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కుక్క కరిచి రేబిస్ సోకిన ఓ వ్యక్తికి వ్యాధి ముదరటంతో భార్యను కరిచిన ఘటన కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన సుబ్బారావుకు కొద్దిరోజుల క్రితం కుక్క కరిచింది. అతనికి రేబిస్ వ్యాధి సోకటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. సుబ్బారావుకు వ్యాధి ముదరటంతో అతనికి సపర్యలు చేస్తున్న భార్య నాగమణిని కరిచాడు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

Monday, May 16, 2011

రైతుల సమ్యసల గురించి చర్చించటం ద్వారా ,,,వ్యూహం మార్చిన ,,,చిరు,,,


 రైతుల సమ్యసల గురించి చర్చించటం ద్వారా ,,,వ్యూహం మార్చిన ,,,చిరు,,,

 కాంగ్రెస్ అధినాయకత్వంతో విలీనం ప్రక్రియ గురించి చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పనిలో పనిగా రైతుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత చంద్రబాబునాయుడు వచ్చే వారం రైతుల సమస్యలపై చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి ప్రతిగా ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మతో రైతుల సమస్యల గురించి చర్చించటం ద్వారా తనదే పైచే అనిపించుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌తో విలీనం ప్రక్రియ గురించి చర్చలు జరిపిన అనంతరం బుధవారం సాయంత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు తిరుగుప్రయాణమైన చిరంజీవి అకస్మాత్తుగా తన పర్యటనను ఒక రోజు వాయిదా వేసుకున్నారు. చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్ రెడ్డి రైతుల సమస్యలపై వచ్చే వారం గుంటూరు తదితర ప్రాంతాల్లో ధర్నా, ఇతర కార్యక్రమాలు చేపడుతున్నందున అంతకు ముందే తాను కేంద్ర మంత్రులతో రైతుల సమ్యసల గురించి చర్చించటం ద్వారా ప్రజారాజ్యం చిత్తశుద్ధిని చాటుకోవాలని పథకం వేసారు. అందుకే చిరంజీవి, విధాన మండలి సభ్యుడు సి.రామచంద్రయ్య, శాసన సభ్యుడు గంటా శ్రీనివాస్‌లను వెంట తీసుకొని గురువారం వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్‌శర్మలను కలుసుకొని రైతుల సమస్యల గురించి వివరించనున్నారు. రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాల మూలంగా రైతులకు జరిగిన నష్టంపై శరద్‌పవార్‌కు ఒక వినతిపత్రం సమర్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయాలని కోరనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా రైతులు పండించిన ధాన్యం పెద్ద మొత్తంలో పాడైపోయిందనీ, ఈ ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చిరంజీవి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను కోరనున్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించాలనీ, ధాన్యం తదితర పంటలను నిల్వ చేసుకునేందుకు అదనపు గిడ్డంగులు నిర్మించాలని కోరనున్నారు.ఆయన ఆనంద్‌శర్మను కూడా కలుసుకుని పొగాకు రైతుల సమస్యల గురించి వివరించనున్నారు. పొగాకు బోర్డు నిర్థారించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో పొగాకు పండించిన వారిపై పెనాల్టీ విధించకూడదని కూడా చిరంజీవి కేంద్ర వాణిజ్య మంత్రిని కోరనున్నారు. కేంద్రం వద్ద ఉన్న పెనాల్టీకి సంబంధించిన నిధి నుండి పొగాకు రైతులకు రుణాలు ఇప్పించాలని చిరంజీవి డిమాండ్ చేస్తారు. పొగాకు వేలం పాటల విషయంలో కర్నాటక, ఆంధ్ర రైతుల మధ్య చూపుతున్న వివక్షను తొలగించాలని కోరనున్నారు.

Saturday, May 7, 2011

కడపలో పంచతంత్రం


కడపలో పంచతంత్రం
ఆ ఐదుగురూ ఐదుగురే. ఒక్కోరిదీ ఒక్కో స్టైల్‌. ఎవరి వ్యూహాలు వారివి. ప్రజల పల్సు పట్టేందుకు ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. వీరికి ఎన్ని సానుకూల అంశాలు న్నాయో.. అన్ని ప్రతికూలాంశాలు ఉన్నాయి. వీరికి ఈ ఎన్నికలు ఒక పరీక్ష. ఒక సవాలు. ఇప్పుడు ప్రచారంలో వాటినే ఎదుర్కొంటున్నారు.వచ్చే నెలలో జరగనున్న కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్ధులుగా మారిన ఐదుగురు నేతలు అప్రతిహతంగా, అవి శ్రాంతంగా పోరాడుతున్నారు. పులివెందులలో వదిన -మరిది మధ్య హోరాహోరీ సంగ్రామం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి తనయుడు స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేస్తున్నారు. ఆమెపై వైఎస్‌ సోద రుడు, సొంత మరిది వైఎస్‌ వివేకానందరెడ్డి బరిలో ఉన్నా రు. వారిద్దరూ వారి వారి కుటుంబసభ్యుల దన్నుతో ప్రచా రంలో ముందున్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్‌ రవి బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మధ్యనే పోటీ నెలకొంది. వారిద్దరి మధ్య చీలే ఓట్లతో బయటపడాలన్నది బీటెక్‌ రవి ఆశగా కనిపిస్తోంది. విజయ లక్ష్మి మరోసారి సానుభూతి ఓట్లపై ఆశపెట్టుకున్నారు. 
ఇక పార్లమెంటు అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ స్వయంగా అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మైసురారెడ్డి రంగంలో ఉన్నారు. ముగ్గు రూ అవిశ్రాంతంగా ప్రచారబరిలో దూసుకువెళుతున్నారు.అయితే ఈ ముగ్గురు అభ్యర్ధులకు సొంత జిల్లా కంటే బయట జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం.
అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన జగన్‌కు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ..గురునాధరెడ్డి, కొండా సురేఖ, రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శేషారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, షాజ హాన్‌, శోభానాగిరెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, జూపూడి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు, సినీ నటి రోజా వంటి ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. పులి వెందులలో విజయలక్ష్మికి మద్దతుగా కుటుంబసభ్యులం తా బరిలో నిలిచారు. ఆమె ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. కూతురు షర్మిల ఆమెతోనే ఉంటున్నారు. జగన్‌ ఎక్కువగా తన తండ్రి మృతి చెందిన సానుభూతి ఓట్లపైనే ఆధారపడుతున్నారు. 
ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి డీఎల్‌ రవీంద్రారెడ్డికి మద్దతుగా మంత్రులు ప్రచారంలో నిలుస్తున్నారు. ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో.. మంత్రి ధర్మాన ప్రసాదరావు, బొత్స, అహ్మదుల్లా, మోపిదేవి, మహీధర్‌ రెడ్డి, ఆనం, రఘువీరారెడ్డి, గల్లా, మాణిక్యవరప్రసాద్‌, బస్వరాజు సారయ్య వంటి ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే లు కూడా కడపలోనే మోహరించారు. మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలా నికి ఒక్కో ఎమ్మెల్యే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుం డగా, ఈనెల 28 నుంచి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి మూడురోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో జగన్‌ కు వచ్చిన ఓట్లలో చీలికతో జగన్‌ గట్టెక్కరని డీఎల్‌ ఆశాభావంతో ఉన్నారు. పులివెందులలో కాంగ్రెస్‌ అభ్యర్ధి వైఎస్‌ వివేకానందరెడ్డి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నా రు. ఆయనకు కుటుంబసభ్యులు దన్నుగా నిలస్తున్నారు. మంత్రులు పులివెందుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.
ఇక్కడ విజయలక్ష్మి కంటే వివేకానందరెడ్డే ఎక్కువగా ప్రజలతో ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎం.వి.మైసురారెడ్డి కూ డా అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. నామా నాగేశ్వరరావు, రమేష్‌రాథోడ్‌, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, తుమ్మల నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్‌, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్‌.రమణ, తలసాని శ్రీనివాసయాదవ్‌, రేవంత్‌రెడ్డి, శ్రీరాం తాతయ్య, పల్లె రఘునాధరెడ్డి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అబ్దుల్‌ఘనీ, రామకృష్ణ, సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు, బాబూ రాజేంద్రప్రసాద్‌, సినీ నటి కవిత, తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యే ఇన్చార్జిగా, వారికి సహాయకులుగా రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
       సానుకూలత
వైఎస్‌ మృతి సానుభూతి. కొడుకుగా వాటిని పొందే యత్నం.
గ్రామ నేతలపై పట్టు. క్రిస్టియన్లు, ముస్లిం ఓటు బ్యాంక్‌.
కాంగ్రెస్‌ ఓట్లలో భారీ చీలిక.
అంతమంది కలసి ఒక్కడిని ఓడించేందుకు యత్నిస్తున్నారన్న స్థానిక సెంటిమెంట్‌.
నాలుగు నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యేల బలం. 
ప్రతికూలత

గతంలో తనకు వచ్చిన ఓట్ల చీలికతో నష్టం. గెలిస్తే బీజేపీతో కలసిపనిచేస్తారన్న ప్రచారంతో కలవరం. దానివల్ల క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లు దూరమయ్యే ప్రమాదం.
తన వర్గీయులపై పోలీసుల కట్టడితో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గే ప్రమాదం. అది తగ్గితే మెజారిటీ ఎంతన్నది అనుమానం.
ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటారన్న కారణంతో స్థానికంగా ఉండరన్న విమర్శలు. అవినీతిపరుడన్న ప్రచారం మైనస్‌ పాయింట్‌. ఆరేళ్లలో లక్షకోట్లు అక్రమంగా సంపాదించారన్న విమర్శలు.
గతానికి భిన్నంగా కాంగ్రెస్‌-టీడీపీలను ఏకకాలంలో ఎదుర్కోవలసి రావడం.
డీఎల్‌ రవీంద్రరెడ్డి
సానుకూలత
వివాదరహిత ముద్ర.
గతంలో జగన్‌కు పడిన ఓట్ల చీలి కపై ఆశ.
ప్రభుత్వ యంత్రాంగం మద్దతు.
ఎస్సీ, మైనారిటీల ఓటు బ్యాంకుపై ఆశ.
అందుబాటులో ఉంటారన్న సానుకూలత. 

ప్రతికూలత 
ఎవరికీ పనులు చేయరని, అహంకార పూరితంగా వ్యవహరిస్తారని, ఎవరినీ కనీసం గౌరవించరన్న విమర్శలతో కొంత మైనస్‌.
సొంత నియోజకవర్గంలోనే పలుకుబడి లేని వైనం. జగన్‌కే ఎక్కువ బలం ఉండటం.
ప్రచారంలో జగన్‌ వర్గీయుల నుంచి ప్రతిరోజూ ఎదురీత. ప్రజల నుంచి నిరసనలు.
బలవంతంగా పోటీకి దిగారన్న అప్రతిష్ఠ.
పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు లేకపోవడం. 
మైసూరారెడ్డి
సానుకూలత

కడప జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతగా, పాదయాత్రలు చేసిన సీమ నేతగా సుదీర్ఘకాల గుర్తింపు.
వివాద రహిత ముద్ర.
హంగు, ఆర్భాటాలకు దూరం.
అవినీతి ముద్ర లేకపోవడం.
విశ్వసనీయత కలిగిన నేతగా గుర్తింపు.
ప్రతికూలత

కడప జిల్లాలో ఉండే సమయం తక్కువ.
రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ ఎక్కువగా తన నియోజకవర్గ, తన మండలం, తన గ్రామానికే పరిమితం కావడం.
సాధారణ నేతల మాదిరిగా జనాలతో మమేకం కాలేకపోవడం.
జిల్లా నేతలతో అంతంత మాత్రపు సంబంధాలు.
పెద్ద వక్త కాకపోవడం. ఎదుటి వారి మనోభావాలను పట్టించు కోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం. 
వైఎస్‌ విజయలక్ష్మి 
సానుకూలత

వైఎస్‌ భార్యగా సానుభూతి.
ఎప్పుడూ బయటకు రాని ఆమె ఈ ఎన్నికల్లో ప్రతి గడప ఎక్కడంతో పెరుగుతున్న సానుభూతి.
భారీ బలగం ఉన్న కుటుంబసభ్యుల అండ.
ఇతరులకు సహాయపడాలన్న తత్వం.
వివాదరహిత మనస్తత్వం. 
ప్రతికూలత 

ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉండటం.
సమస్యలపై అవగాహన లేకపోవడం. వక్త కాకపోవడం.
రాజకీయ కుటుంబంలో ఉన్నా రాజకీయాలపై అవగాహన లేకపోవడం.
స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం.
ఒకసారి అసెంబ్లీకి గెలిపించినా ఒక్కసారి కూడా సభకు రాలేదన్న అపఖ్యాతి. సానుభూతి ఈసారి ఎన్నికలో పనిచేస్తుందా లేదానన్న సంశయం. 
వైఎస్‌ వివేకానందరెడ్డి
సానుకూలత 

అందరికీ అందుబాటులో ఉండే నైజం.
మండలాలు, గ్రామాల్లో అందరినీ పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు, చనువు. విస్తృతమైన బంధుత్వాలు.
సమస్యలపై పూర్తి అవగాహన.
ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌కు ఆయనే రధసారథి కావడంతో పెద్దగా సమస్యలు లేని సానుకూలత.
అవినీతిపరుడన్న ముద్ర లేకపోవడం. 
ప్రతికూలత 

వైఎస్‌ కుటుంబంతో విబేధాల వల్ల ఆ కుటుంబ మద్దతు కోల్పోవడం.
వైఎస్‌ బంధుగణాలు మూకుమ్మడిగా దూరమవుతున్న వైనం.
ఆపదలో అన్న కొడుకుకు అండగా నిలబడలేదన్న అపవాదు.
కాంగ్రెస్‌ ఓట్లలో చీలిక.
ఇన్నాళ్లూ ‘అన్న’ బలమే తన బలమని భావించారు. ఫలితంగా ఇప్పుడు సొంత వర్గమంటూ లేకపోవడం. 
బీటెక్‌ రవి
సానుకూలత

రాజకీయాలకు కొత్త.
అవినీతి ముద్ర లేకపోవడం.
యువకుడు కావడం.
నియోజకవర్గంలో పార్టీకి శాశ్వ త ఓటు బ్యాంకు ఉండటం.
ధనబలం ఉండటం. 
ప్రతికూలత

సొంత పార్టీలోనే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత.
బలమైన వర్గం లేకపోవడం.
పార్టీ నేతలతో సంబంధాలు అంతంతమాత్రమే.
సమస్యలపై అవగాహన లేకపోవడం.
కొత్త అభ్యర్ధి కావడం, జగన్‌ కుటుంబస్థాయిలో ఆర్థి కంగా బలంగా లేకపోవడం.

చిరును కాంగ్రెస్ కొనేసింది... నేను జగన్‌కు అమ్ముడుపోలేదు


చిరును కాంగ్రెస్ కొనేసింది... నేను జగన్‌కు అమ్ముడుపోలేదు
ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎంతో ఆర్భాటంగా సామాజిక న్యాయం చేస్తానంటూ చంకలు గుద్దుకుంటూ వచ్చిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని "మెంటల్ కృష్ణ" పోసాని కృష్ణ మురళి విమర్శించాడు. ప్రజారాజ్యం పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీలో చేరాననీ, అయితే కళ్లు తెరిచి చూసేలోగా అంతా అయిపోయిందనీ, చిరు ప్రజారాజ్యం పార్టీని టోకుగా కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారని మండిపడ్డారు. తను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంపై కొంతమంది తమకు తోచిన విధంగా బురద చల్లుతున్నారన్నారు. తానేమీ డబ్బులకు అమ్ముడు పోలేదనీ, రాష్ట్రంలో ఉన్న నాయకులందరిలో జగన్ నీతిపరుడనీ, అందుకే అతడి వెంట కలిసి నడవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఒకవేళ జగన్ అవినీతిపరుడని నిరూపిస్తే తన తలను వారి నిరూపించినవారి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమని చెప్పుకొచ్చాడు.

అబ్బో..! రాజశేఖర్‌‌ని జీవిత ఎలా భరిస్తుందో..?!!


 అబ్బో..! రాజశేఖర్‌‌ని జీవిత ఎలా భరిస్తుందో..?!!
నటుడు రాజశేఖర్‌కు నిలకడ లేదని ఇండస్ట్రీలోని చాలామంది అనుకుంటున్నదే. ఇటీవల ఆయన సినిమాలు కొన్ని బాక్సుల దాకా వచ్చి ఆగిపోయాయి. దీంతో ఏకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జీవితచరిత్రపై సినిమా తీయాలనీ, జగన్‌ నుంచి సొమ్ములు వస్తాయని ఆశించి భంగపడ్డాడు. 
అప్పట్లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర తీస్తున్నట్లు పబ్లిసిటీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత జగన్‌నూ కలిశారు. తాము మాట్లాడుదామనుకున్న విషయం కొద్దిరోజులకు వాయిదా పడింది. చూసీ చూసీ ఇక లాభం లేదనుకుని తాను ఆ సినిమా చేయడం లేదని చెప్పేశాడు.
అయితే ఇదంతా రాజశేఖర్‌ ప్రవర్తన వల్లే అయిందని పూరీ తన సన్నిహితులతో అన్నాడట. అతని మనస్తత్వం నిలకడలేనిదనీ, కాసేపటికే మూడ్‌ మారిపోతుందని అన్నాడట. అబ్బో... జీవిత ఎలా భరిస్తోందని కామెంట్‌ కూడా చేశాడట. 
ఇటీవల పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. జగన్‌ దీక్షలో విజయవాడలో పాల్గొని... ఇప్పుడు వారిని తిట్టిపోశాడు. తాజాగా చంద్రబాబు పంచన చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈయన చేరితో ఒరిగేదేమీ లేకపోగా నష్టం జరుగుతుందని చంద్రబాబుకు కొందరు సూచించారట. 
ఆల్‌రెడీ మొదట్లో ఎన్‌.టి.ఆర్‌.కు సపోర్ట్ చేసినవాడే రాజశేఖర్‌. ఆయన పదవీభ్రష్టుడ్ని చేసినప్పుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ.. నల్లదుస్తులు ధరించి ఆయన ఎన్టీఆర్ వెంట ప్రచారం చేశాడు. మరి ఇప్పుడు తాజాగా చంద్రబాబుతో కలిసి పనిచేస్తానంటూ ముందుకు దూకుతున్నాడు. తెదేపాలో చేరితో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.


Monday, May 2, 2011

ఒసామా బిన్ లాడెన్ హతం


లాడెన్‌ మృతితో అమెరికాలో సంబరాలు


 ప్రపంచాన్ని గడగడలాడించిన కరుడు గట్టిన ఉగ్రవాది, అల్‌కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ మృతి చెందినట్లు సమాచారం. లాడెన్ మృతిచెందాడని అమెరికా న్యూస్‌నెట్‌వర్క్ సోమవారం వెల్లడించింది. ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. లాడెన్ మృతదేహాన్ని అమెరికా సైనికులు కనుగొన్నట్లు అల్‌జజీరా, అమెరికా మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. ఇస్లామాబాద్‌లో అమెరికా సైన్యం జరిపిన క్షిపణి దాడుల్లో లాడెన్ హతమయ్యారు. అతని మృతిని యూఎస్ ఇంటిలిజెన్స్ కూడా ధ్రువీకరించింది.

ఇస్లామిక్ ఉగ్రవాదంతో లాడెన్ ప్రపంచం వెన్నులో చలి పుట్టించాడు. 2002, సెప్టెంబర్ 11న డబ్ల్యూటీవోపై జరిగిన దాడితో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. అప్పటివరకూ ఉగ్రవాదంపై ఉదాసీనత ప్రదర్శించిన అమెరికా ఈ దాడితో మేల్కొంది. ఉగ్రవాదంపై పోరులో పెద్దన్న పాత్ర పోషించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అఫ్ఘానిస్థాన్, ఇరాక్‌లపై యుద్ధాలు చేసింది. అప్ఘాన్‌లో తలదాచుకున్న లాడెన్‌ను పట్టుకోవడం కోసం అమెరికా అణువణువు గాలించింది. 
పదేళ్లుగా దొరకకుండా ముప్పుతిప్పలు పెట్టి, తప్పించుకు తిరుగుతున్న లాడెన్ ఎట్టకేలకు అమెరికా సైన్యం చేతిలో హతమయినట్లు తెలుస్తోంది. 
లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదా ప్రపంచంలోని పలుదేశాలపై దాడులు జరిపింది. మానవబాంబు దాడులతో భారీస్థాయిలో ప్రాణనష్టం, భయోత్పాతాన్ని సృష్టించింది.


అమెరికా దాడిలో ఒసామా బిన్‌ లాడెన్‌ మృతిచెందాడన్న వార్తలు వెలువడడంతో అమెరికాలో సంబరాలు చేసుకుంటున్నారు. లాడెన్‌ మరణవార్తను ధ్రువీకరిస్తూ అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటన చేయగానే శ్వేతసౌధం వద్ద గుమిగూడిన ప్రజలు ఆనందానికి హద్దులేకపోయాయి. కేరంతలతో ఆమెరికా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

gangavaram port


Sunday, May 1, 2011

కె. బాలచందర్‌కు 2010'దాదాసాహెబ్ పాల్కే' అవార్డు


కె. బాలచందర్‌కు 2010'దాదాసాహెబ్ పాల్కే' అవార్డు
సినీ రంగంలో అత్యున్నత పురష్కారం ప్రతిష్థాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు కె.బాలచందర్ ను వరించింది.2010 ఏడాదికిగానూ  ఆయన ఈ  అవార్డుకు ఎంపికయ్యారు.వరుసగా రెండోసారీ  దక్షినాదికి చెందిన చలన చిత్ర ప్రముఖునికే ఈ అవార్డు రావడం విశేషం.ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, పది లక్షల నగదు, శాలువా బహూకరిస్తారు.బాలచందర్‌ గత 45 ఏళ్లుగా సినీ రంగంలో సేవలందించారు.దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా ఆయన పేరెన్నిక గన్నారు.అంతేకాక తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వందకు పైగా సినిమాలకు దర్శకత్వ, నిర్మాణ, రచయిత బాధ్యతలు ఆయన నిర్వహించారు. బాలచందర్ 1930 జులైలో తమిళనాడులోని తంజపూరు జిల్లాలో జన్మించారు.మొదట నాటక రచయిత అయిన బాలచందర్ 1965లో సినీరంగంలోకి ప్రవేశించారు. ఆయన సినిమాలు అపూర్వ రాగగళ్, అవర్గల్, 47 నాట్కల్ (47 రోజులు), సింధు భైరవి, ఏక్ ధూజే కే లియే వంటి చిత్రాలను తీశారు.ఆయనకు తమిళంలో ఎంత ఆదరణ ఉందో తెలుగులో కూడా అంతే ఆదరణ ఉంది.సత్తెకాలపు సత్తయ్య, అంతులేని కథ, మరో చరిత్ర, ఆకలి రాజ్యం, ఆడవాళ్లూ మీకు జోహార్లు, భలేకోడల్లు, గుప్పెడు మనసు, కోకిల, రుద్రవీణ, అందమైన అనుభవం లాంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత బాలచందర్ ది.లోతైన వ్యక్తిగత సంబంధాలను, సామాజిక అంశాలను ఆధారం చేసుకుని సినిమాలు చేయడం ఆయనలో ఉన్న విశేషం.తమిళనాడుకు చెందినవారైనప్పటికీ తెలుగువారికి ఆయన బాగా దగ్గరయ్యారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్ తదితర ఎందరో నటుల్ని వెండితెరకు పరిచయం చేసిన ఘనత బాలచందర్ కే దక్కుతుంది.బాలచందర్ కు అవార్డు రావడం పట్ల టాలీవుడ్, కోలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది.బాలచందర్‌ రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డులు, రెండుసార్లు జాతీయ సమైక్యతా అవార్డు (నర్గీస్ దత్)గెలుచుకున్నారు. 1987 లో పద్మశ్రీ అవార్డుని, 1973 తమిళనాడు అత్యుత్తమ పురస్కారం కలైమామణి అవార్డుని, 2011 ఏఎన్ఆర్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్వర్ణ నంది, రజత నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆయనకు పలు మార్లు ఉత్తమ దర్సకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.బాలచందర్ తీసిన సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందటమే కాకుండా 4 చిత్రాలు జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికయ్యాయి.

మేమంటే జగన్‌కు అసూయ: జీవిత, రాజశేఖర్‌


జగన్‌ని కడిగి పడేసిన జీవిత, రాజశేఖర్‌
మొన్నటి వరకూ వీరుడూ   అని వైఎస్ జగన్ని పొగడ్తలతో ముంచెత్తిన హీరో డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత రివర్స్‌ గేరులో జగన్‌పై నిప్పులవాన కురిపించారు. శుక్రవారం ప్రత్యేకంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ జగన్‌ని కడిగి పారేసి కన్నీళ్లపర్యంతమయ్యారు. జలదీక్షలో తమ మాటలకు వచ్చిన ప్రతిస్పందన చూసి జగన్ అసూయ పడ్డారని… అందుకే జగన్, ఆయన పార్టీ నేతలు తమని కావాలే దూరంగా ఉంచారని ఆరోపించారు. ఇతరులు ఫోకస్ కావడం జగన్‌కు అసలూ ఇష్టం ఉండదని…తండ్రి వైయస్ సింపతీతో త్వరగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని ఆరోపించారు. తండ్రి ఆశయాలు సరిగా అమలు చేయడం లేదని పదే పదే ఆరోపిస్తున్న జగన్‌ అదే నిజమైతే ఆయన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కాంగ్రెసులో ఎందుకు ఉన్నారో కూడా చెప్పాలని నిలదీసారు. పనిలో పనిగా చిరంజీవిపైనా విమర్శలు చేస్తూ… పిఆర్పీని స్థాపించి దానిని నడపలేక రెండున్నర సంవత్సరాలకే కాంగ్రెసు పార్టీలో కలిపేసిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఇప్పుడు కామెంట్ చేయడం అంటే చచ్చిన పామును కొట్టినట్లేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ సేవల్ని గురించకపోవటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసారు జీవిత.