టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ
సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం మీద ఇంతెత్తున
ఎగిరిపడ్డారు. నాపై కొందరు కరపత్రాలు వేసి, గతంలో తనెప్పుడో కొందరితో దిగిన ఫొటోలను
హైలైట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసునని ఆయన అన్నాడు. నేను
నాన్నకు, (చంద్రబాబు), తాత (ఎన్టీఆర్) కు చెడ్డపేరు తెస్తానని, మా కుటుంబంలో నాకు,
నాన్నకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఈ కరపత్రాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని, కానీ
అలాంటిదేమీ లేదని ఆయన పేర్కొన్నాడు. నేను కులమతాలకు అతీతంగా పని చేస్తున్నా అన్నారు.
గతంలో విదేశాల్లో చదువుకుంటూ ఇండియాకు
వచ్చినప్పుడు చాలా మంది ప్రముఖులను కలిశాను.. ఆ సందర్భంగా వేల ఫొటో లు దిగాను. వాటిలో
ఓ రెండు మూడు ఫోటోలు తీసుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని లోకేష్ వాపోయారు.
చెయ్యి నొప్పి కారణంగా ఓ రెండు రోజులు పార్టీ నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు తాను
హాజరు కాలేదని, అయితే ఈ విషయంలో తనకు, చంద్రబాబుకు మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయంటూ చిచ్చు
పెట్టే యత్నం చేస్తున్నారని ఆయన అన్నాడు. ఆ
మధ్య ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్పతో తాను చేతులు తిప్పుతూ మాట్లాడినంత మాత్రాన..
ఆయనను దుర్భాషలాడానని ఆ ఘటనను తప్పుడుగా చిత్రీకరించారని లోకేష్ విమర్శించారు. రాష్ట్ర
రాజధానికి 32 వేల ఎకరాలెందుకని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు.. అయితే బెంగుళూరులో
ఆయనకు 32 ఎకరాల ఇల్లుండవచ్చుగానీ రాష్ట్ర రాజధానికి 32 వేల ఎకరాలుండకూడదా అని లోకేష్
ప్రశ్నించారు.
No comments:
Post a Comment