Sunday, August 21, 2011

మెగాస్టార్‌ చిరంజీవి లాంఛనంగా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


ప్రజారాజ్యం పార్టీ అధినాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి లాంఛనంగా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజారాజ్యంపార్టీ విలీనం కూడా ఇక లాంఛనమే కానున్నది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ భవిష్యత్‌ ప్రధాన మంత్రి అని, జాతిప్రజల ఆశాకిరణమని ప్రశంసలతో ముంచెత్తారు. ''నా మిగతా జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీతోనే నడుస్తుంది. నేనొక నమ్మకస్తుడైన కార్యకర్తగా వుంటాను. రాహుల్‌కు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో ఆయనే మా ప్రధానమంత్రి'' అని చిరంజీవి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌గాంధీతోపాటు ఆరోగ్యశాఖ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌, పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ ద్వివేది, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌లు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వంకోసం చిరంజీవి ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. ఎఐసిసి కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి తన చేరిక ప్రక్రియను పరిపూర్తిచేసుకున్నారు

TV9 - Chiranjeevi formally joins congress

Friday, August 19, 2011

సి.బి.ఐ సెగ: జగన్, అనుచరులు, ఆస్తులపై ఏకకాలంలో సోదాలు


సి.బి.ఐ సెగ: జగన్, అనుచరులు, ఆస్తులపై ఏకకాలంలో సోదాలు
జగన్ కు సి.బి.ఐ సెగ గట్టిగానే తగిలింది. జగన్ అతని అనుచరులు ఊహించనంత వేగంగా సి.బి.ఐ విరుచుకుపడుతుంది. సెలవు మూడు రోజులు కూడా అధికారుల చర్యలు వేగంగానే ఉన్నాయి. దిల్ కుష్ అతిధి గృహం ఆఫీసుగా వాడుకోవాలని నిర్ణయం తీసుకోవడం, సోదాలు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవడం చక చక జరిగిపోయాయి. ఈ రోజు ఉదయం నుంచే భారీ స్థాయిలో సోదాలు చేస్తున్నారు. సాక్షి కార్యాలయంలో ఆరుగురు అధికారులు సోదా చేస్తున్నారు. లోటస్ పాండ్ వద్ద ఉన్న జగన్ నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు. జగన్నివాసంలో ఉన్న 74 గదులు పరిశీలించడానికి రెండు గంటల సమయం పట్టిందని సమాచారం. ఇంకా జగతి పబ్లికేషన్స్ లో, బెంగుళూరులోని జగన్నివాసం, ముంబై లో ఉన్న జగన్ ఆఫీస్, పెన్నా సిమెంట్స్ అధినేత విజయసాయి రెడ్డి ఇంట్లో, రాజకీయ నేత లక్ష్మి రెడ్డికి చెందిన బంజారా హిల్స్ నివాసంలో, మాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ సైనిక్ పురి నివాసంలో, హెట్రో డ్రగ్స్, హెట్రో ఫార్మా అధినేత శ్రీనివాస రెడ్డి, పార్ధసారది రెడ్డి ఇంట్లో, జగన్ సోదరి షర్మిలా నివాసంలో ,  పులివెందుల పాలిమర్స్ కంపెనీ ఆఫీసులో, జూబ్లీ మీడియా, ఆర్.ఆర్ గ్లోబల్ , ఆల్ఫా విల్లాస్, ఏ.కె దండమూడి,  ఇందు ప్రాజెక్ట్ కుకట్ పల్లి ఆఫీసు లో, ఐ.ఏ.ఎస్ అధికారి బి.పి ఆచార్య, జగన్ బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ రెడ్డి ఇంట్లో, సాక్షి వైస్ చైర్మన్ విజయ్ సాయి రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. జగతి పబ్లికేషన్స్ కు చెందిన సోదాల్లో సి.బి.ఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ స్వయంగా పాల్గొంటున్నారు. ఈ సోదాలు చేయడానికి విశాఖపట్నం, తమిళనాడు, కర్ణాటక నుంచి అధికారులను తీసుకువచ్చినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోదాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి.

అన్నా హజారే ఉద్యమానికి తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి మద్దతు .



ఆగష్టు : తెలంగాణ కోసం మేము చేస్తున్న పోరాటం దేశభక్తిలో భాగమేనని, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ఈరోజు( సోమవారం) తెలిపారు. జెఏసి కార్యాలయంలో ఆయన జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17న జరిగే మహాధర్నాకు తెలంగాణ వారంతా సహకరించాలని కోరారు. 17 నుండి ఉద్యమం విడతల వారీగా ఉధృతమవుతుందని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో అవినీతిపై పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే ఉద్యమానికి జెఏసి మద్దతు ఉంటుందని కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ పోరాటం, అవినీతిపై అన్నా హజారే చేస్తున్న పోరాటం నాణేనికి రెండు పార్శ్వాలు అన్నారు. కాగా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సీమాంధ్ర సెటిలర్స్ చైతన్య యాత్ర సోమవారం జెఏసి కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర నినాదం పాలకులది మాత్రమే అన్నారు.

Saturday, August 13, 2011

Varalakshmi devi vratanam





అన్నాహజారే


అన్నాహజారే


మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధంకావాలని దేశప్రజలకు పిలుపునిచ్చి " జన్ లోక్ పాల్ " బిల్లు కోసం ఢిల్లీలో ఆమరణ దీక్షకు పూనుకొన్న అన్నాహజారేకు అపూర్వమైన మద్దతు లభిస్తున్నది. దేశవ్యాప్తంగా విధ్యార్ధులు, యువజనులు, మేధావులు, కళాకారులు హజారేకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పరిస్థితిని గమనించిన కేంద్రప్రభుత్వం చర్యల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపధ్యంలో అన్నా హజారే గురించిన వివరాలను తెలుగు ప్రజలకు అందిస్తున్నాము.

అసలు పేరు __ కిసాన్ బాపట్ బాబూరావు హజారే
ప్రజలు పిలిచేపేరు __ అన్నా హజారే
పుట్టినతేదీ __ 15-01-1940
జన్మస్థలం __ మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లా, భింగర్ గ్రామం
తల్లిదండ్రులు _ లక్ష్మీబాయి, బాబూరావు హజారే
కుటుంబ సభ్యులు__ ఇద్దరు అక్కలు
అన్నా హజారే ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. తన తండ్రి బాబూరావ్ హజారే నైపుణ్యం లేని కార్మికుడు, తన తాత సైన్యంలో పనిచేశారు. ఇతడి తాత ఉద్యోగ రీత్యా భింగర్ ప్రాంతానికి మార్చబడ్డారు, దీంతో బాబూరావు, కుటుంబం భింగర్‌కు వెళ్లిపోయింది, ఇక్కడే అన్నా పుట్టాడు. అన్నా తాత 1945లో చనిపోయారు కాని కుటుంబం మాత్రం భింగర్‌లోనే 1952వరకు ఉండిపోయింది, తర్వాత అన్నా తండ్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాలేగాన్ సిద్ధికి వెళ్లిపోయారు. అన్నా నాలుగో తరగతి వరకు చదువు పూర్తి చేశాడు, కుటుంబం ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండేది. బాబూరావ్ చెల్లెలికి పిల్లలు లేరు, ఈమె అన్నా సంరక్షణ బాధ్యత చేపట్టి తనను ముంబై తీసుకుపోయింది. అన్నా తండ్రి సమస్యలు పెరిగిపోవడంతో తన వ్యవసాయ భూమిని విక్రయించాడు. దీంతో కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ముంబైలో ఉంటూ 7వ తరగతి పూర్తి చేసిన అన్నా ఏదో ఒక ఉద్యోగం చేయవలసి వచ్చింది. అన్నా ముంబైలోని దాదర్‌లో ఒక పూల వ్యాపారి వద్ద పనిచేస్తూ నెలకు నలభై రూపాయలు సంపాదించేవాడు. ఇతడు క్రమంగా తన స్వంత పూల షాపును ప్రారంభించాడు.

సైనిక జీవితం


కొద్ది సంవత్సరాలలో అన్నా చెడు సహవాసాలలో కూరుకుపోయి తన సమయాన్ని, డబ్బును మానసిక బలహీనతలపై వృధా చేయడం ప్రారంభించాడు. చివరకు అతడు వీధిపోరాటాలు, కుమ్ములాటలలో కూడా పాలు పంచుకోసాగాడు, ప్రత్యేకించి గూండాలు మామూలు వ్యక్తిని వేధించడం చూస్తే చాలు, అన్నా వారితో పోరుకు సిద్ధమయ్యేవాడు. తన కుటుంబానికి క్రమంగా డబ్బు పంపించడం కూడా తగ్గిపోయింది. తన వ్యక్తిత్వాన్ని తనకు తానుగా పాడు చేసుకుంటున్నాడని రాలెగాన్‌లో వార్తలు వ్యాపించాయి. అలాంటి ఒక పోరులో అన్నా ఒక వ్యక్తిని ఘోరంగా బాదేశాడు. తనను అరెస్టు చేస్తారనే భయంతో, అతడు రోజువారీ పనిలోకి సక్రమంగా రావడం, ఇంటికి రావడం కూడా మానేశాడు. ఈ కాలంలోనే (ఏప్రిల్ 1960) అతడు సైనిక రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు చివరకు భారతీయ సైన్యంలో చేరడానికి ఎంపికయ్యాడు.

తన మొదటి శిక్షణలో, అతడిని ఔరంగాబాద్ పంపించారు. శిక్షణ తర్వాత అతడు పంజాబ్‌లో ఒక ట్రక్కు డ్రైవర్‌గా నియమించబడ్డాడు. ఇంటికి చాలా దూరంలో ఉంటూ, స్నేహితులందరి నుంచి విడిపోవలసి రావడంతో అన్నా ఒంటరితనంతో బాధపడ్డాడు. అతడు నిరాశా నిస్పృహల బారిన కూడా పడ్డాడు, జీవితానికి అర్థంలేకుండా పోతోందనే అనుభూతిలో మునిగిపోయాడు. ఒక దశలో తన జీవితాన్ని ముగించుకోవాలని కూడా అతడు నిర్ణయించుకుని ఆత్మహత్య పత్రం కూడా రాశాడు. అయితే, మరింత తెలివితో అతడు తన ఆత్మహత్య, చిన్నారి చెల్లెలు వివాహ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని గుర్తించాడు. అందుచేత, తన సోదరి వివాహం పూర్తయేంతవరకు తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఈలోగా, కొన్ని సంఘటనలు తన జీవితానికి కొత్త మార్గాన్ని ఇచ్చాయి. 1965 ఇండో_పాక్ యుద్ధకాలంలో, పశ్చిమ ప్రాంతంలో ఒకచోట సైనిక వాహనాన్ని నడుపుతున్నప్పుడు తమ నెత్తిమీద పాకిస్తాన్ విమానం ఎగురుతుండటం చూశాడు. తాను, తన సహోద్యోగులు వెంటనే వాహనం మీదనుంచి దూకి సమీపంలోని పొదలలో దాక్కుని భూమికి సమాతరంగా పడుకుండిపోయారు. ట్రక్కు పేల్చివేయబడి తన స్నేహితులందరూ చంపబడ్డారు కాని అన్నా మాత్రం గాయపడకుండా తప్పించుకున్నాడు. మరొక సంఘటనలో అతడు నాగాల్యాండ్‌లో పనిచేసేటప్పుడు మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఒక రాత్రి, అజ్ఞాత నాగాలు సైనిక గస్తీ కేంద్రంపై దాడిచేసి తన సహచరులందరినీ చంపేశారు. ఆ సమయంలో ప్రకృతి పిలుపుకోసం వెళ్లిన అన్నా చివరకు తానొక్కడే బతికిబట్టకట్టాడు. ఈ రెండు ఘటనలూ అన్నా మనసుపై బలమైన ముద్ర వేశాయి. తన జీవితాన్ని వృధా పర్చుకోరాదని అతడు గుర్తించాడు, దేవుడు తన జీవితాన్ని విలువైనదిగా భావిస్తున్నాడని తను నమ్మసాగాడు. లేకుంటే, పై ఘటనలలో ఏదో ఒకదానిలో తన సహచరులతో పాటు తాను కూడా చనిపోయి ఉండేవాడినని అతడు భావించాడు. ఈ ఆలోచనలు తన మనస్సులో చెలరేగుతున్న సమయంలోనే అతడు న్యూఢిల్లీ స్టేషన్‌లోని ఒక పుస్తక విక్రయకేంద్రంలో స్వామి వివేకానంద రాసిన జాతి నిర్మాణం కోసం యువతకు పిలుపు అనే పేరుగల చిన్న బుక్‌లెట్‌ని చూశాడు. వివేకానందుడి ఆలోచనలు తన జీవితానికో అర్థం కల్పించాయి, తన శేష జీవితాన్ని సమాజం కోసం పనిచేయడానికి అంకితం చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. తర్వాత అతడు వివేకానంద, మహాత్మా గాంధీ మరియు ఆచార్య వినోబా భావే రచించిన పలు పుస్తకాలను చదివాడు. అతడిలో 1970 నుంచి ఆలోచనలు పెరగడం ప్రారంభించాయి, తాను పెళ్లి చేసుకోవడం లేదనే తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తన చిన్న తమ్ముళ్లకు వివాహాలు జరిపించమని అతడు తల్లిదండ్రులను ఒత్తిడి పెట్టసాగాడు. తన స్వార్థ ప్రయోజనానికి వెలుపల జీవితం గడపాలని తనలో కొత్తగా బయటపడిన ఆకాంక్షతో తాను సైన్యం నుంచి స్వచ్ఛంద విరమణ చేసి స్వంత గ్రామానికి సేవచేయడానికి తిరిగొచ్చాడు. తన స్వగ్రామం రాలేగాన్ సిద్ధిని మెరుగుపర్చాలని అతడు కోరుకున్నాడు కాని, ఎలా మెరుగుపర్చాలో, ఎక్కడ ప్రారంభించాలో అతడికి ఏమీ తెలీదు. సెలవుపై తన గ్రామానికి వస్తూ, గ్రామ శివార్లలోని శిలలపై కూర్చుని రోజుల తరబడి గడిపేవాడు. ముంబైలో, సైన్యంలో చాలావరకు జీవితాన్ని గడిపేసిన అన్నాకు గ్రామంలో పెద్దగా స్నేహితులు లేరు. పైగా, దాదర్ స్టేషన్‌ వెలుపల పూలమ్ముకున్న రోజులలో అతడిని ఒక ఆగ్రహావేశపరుడిగా రాలెగాన్ ప్రజలు చూశారు కాని, అన్నా హజారే మూర్తిమత్వంలో పరివర్తను వారు ఊహించలేకపోయారు.

1971లో అన్నాకు ముంబైకి బదిలీ అయ్యింది. ముంబై నుంచి అతడు గ్రామాన్ని క్రమం తప్పకుండా సందర్శించడం ప్రారంభించాడు. 1971 నుంచి 1974 మధ్య కాలంలో గ్రామీణ ప్రజలతో అతడికి సాన్నిహిత్యం పెరిగింది. పద్మావతీ ఆలయానికి నూనె పెయింట్‌తో మెరుగులు దిద్దేందుకోసం ఇతడు రూ.3000 పైగా ఖర్చుచేశాడు. గ్రామీణ యువతతో అతడు మంచి సంబంధాలు పెట్టుకున్నాడు కూడా.

1974లో, అతడిని ఉద్యోగరీత్యా జమ్మూకు మార్చారు. 1975లో, అతడు సైన్యంలో పదిహేను సంవత్సరాల సేవను పూర్తి చేశాడు ఫించన్ రావాలంటే ప్రతి సైనికుడూ 15 ఏళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. అతడు పదవీ విరమణ కోరుకున్నాడు, చివరికి 1975 ఆగస్టు నెలలో అతడు సైన్యం నుంచి బయటపడ్డాడు, మంచి పనులకోసం అతడు తిరిగి రాలెగాన్ సిద్ధికి తిరిగి వచ్చేశాడు.

గాంధేయవాదం


ప్రజలలో నైతిక బాధ్యతను పెంచడానికి వ్యక్తి కేంద్రక గాంధీవాద పద్ధతులను అన్నా ఉపయోగించాడు. రాలేగాన్ సిద్ధిలో ఉన్నత పాఠశాల ప్రారంభించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు అనుమతి మంజూరు చేయడానికి సిద్ధపడలేదు. దీంతో అన్నా, జిల్లా పరిషత్ కార్యాలయం వెలుపల నిరాహార దీక్షను ప్ర్రారంబించాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు వందలాదిగా కదిలి తన చెంత చేరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్‌కు తలొగ్గవలసి వచ్చింది. మరొక సందర్భంలో, కొన్ని కుటుంబాలు తమ పశువులను మేతకోసం ఆరుబయట వదిలేసినప్పుడు ఆ అలవాటును మానివేయడంలోని ప్రాధాన్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేసి వారితో భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం కోసం అన్నా మరికొందరు యువ సభ్యులు రెండు రోజులపాటు నిరాహార దీక్ష పూనారు, ఆరుబయట పశువులను వదలివేయకుండా ఉండటంలోని ప్రాముఖ్యతను ప్రజలకు అర్థం చేయడానికి వారు ఈ చర్యకు పూనుకున్నారు.

రాలెగాన్ సిద్ధిని ఆదర్శ గ్రామంగా మార్చడం


1975కి ముందు రాలేగాన్ సిద్ధి అత్యంత ఘోరమైన గ్రామంగా ఉంటూ నిస్సహాయ సామాజిక, ఆర్థిక పరిస్థితిని, బాధ్యతా రహిత గ్రామీణ నాయకత్వాన్ని కలిగి ఉండేది. భారతీయ సైన్యంలో సేవచేస్తూ అన్నా హజారే అని అభిమానంగా పిలుచుకున్న కిసాన్ బాబూరావ్ హజారే 1975లో స్వచ్ఛంద విరమణ చేసినంతవరకు ఇది కొనసాగింది. 1965 యుద్ధంలో చావుతో అతడు చేసిన సావాసం అతడి జీవిత గమ్యాన్నే మార్చివేసింది. ఇతరుల శ్రేయస్సుకోసం తనను తాను అంకితం చేసుకోవాలని అతడు నిర్ణయించుకుని, తన స్వంత గ్రామం ఉన్నతి కోసం అతడు తిరిగి వచ్చాడు, ఊరిలోని ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించాడు.

మతం ప్రజలపై బలంగా ప్రభావితం చూపుతుందని అన్నా హజారే విశ్వాసం. అతడు ఇలా చెప్పాడు: దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు, కాని అతన్ని నాకు మొట్టమొదటిసారి ఒక పిల్లవాడు దేవాలయంలో పరిచయం చేశాడు. ఇక్కడే అతడు ముఖ్యమైన విలువలకు సంబంధించిన విద్యను జీవితానికి సంబంధించిన నీతి సూత్రాలను గ్రహిస్తాడు. విస్తృతార్థంలో, గ్రామమే దేవాలయం, ఇక్కడ ప్రజలు సేవచేస్తారు, ప్రార్థిస్తారు మరియు జీవితార్థాన్ని నేర్చుకుంటారు.”

ఆలయంలో కలపను సారాయి డెన్లకు ఇంధనంగా ఉపయోగించిన కారణంగా రాలెగాన్ సిద్ధిలోని శిథిలావస్థలో ఉన్న అది గ్రామ దుస్థితిని అన్నాకు స్పష్టం చేసింది. ఆలయం అనేది సమాజపు సాంస్కృతిక కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందువల్ల, అన్నా తనలోని నిస్వార్థ ఉద్దేశ్యాలను ప్రదర్శించడానికి ఆలయ పునరుద్ధరణ ఉత్తమ మార్గంగా భావించాడు. తన చర్యల ద్వారా అతడు ఒక ఆసక్తిని రూపొందించాడు. తన రూ.20,000+/- భవిష్యనిధితో అన్నా, ఆలయ పునరుద్ధరణను ప్రారంభించాడు. తన నిస్వార్థ భక్తిభావంతో ప్రభావితులై, మొదట యువత తర్వాత ఇతర గ్రామస్తులు క్రమక్రమంగా అతడి చుట్టూ చేరడం ప్రారంభించారు. గ్రామస్తులు, ప్రత్యేకించి యువ బృందం తమ సమస్యలను మరియు గ్రామ సంక్షేమానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకోసం ఇక్కడ ప్రతిరోజూ సమావేశమయ్యేవారు.

వాటర్‌షెడ్ నిర్వహణ: ఆర్థిక పురోగతికి కీలకం


ఆకలిగొన్న వ్యక్తినుంచి మీరు సూత్రబద్ధ జీవితాన్ని ఆశించలేరని అన్నా హజారే చెప్పేవారు. తనకు తన కుటుంబానికి తిండి సమకూర్చుకోవడమే అతడి తొలి ప్రాధాన్యతగా ఉంటుంది. ప్రభుత్వం మరియు సైన్యంలో ఉద్యోగాల ద్వారా, జనాభాలో కొద్ది మందికి ఆర్థిక బలాన్ని కల్పించినప్పటికీ, రాలేగాన్ సిద్ధిలోని జనాభాలో అత్యధిక భాగం ఇప్పటికీ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటోంది. మంచి సాగునీటి వ్యవస్థను నిర్మించడం ద్వారానే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం వీలవుతుందని అన్నా గుర్తించాడు. కొండ దిగువ ప్రాంతంలో ఉన్న రాలెగాన్ భౌగోళిక స్థానాన్ని పరిగణనలోకి తీసుకున్న అన్నా హజారే నీటిని అడ్డగించి మళ్లీ ప్రవహించేలా చేసి భూగర్భ జలాలను పెంచడం కోసం వాటర్‌షెడ్ గట్టును నిర్మించాలని గ్రామస్తులను ఒప్పించాడు. స్వచ్ఛంద కృషి ద్వారా నిర్మించిన తొలి నీటిగట్టుకు చిల్లుపడగా ప్రభుత్వ నిధితో దాన్ని పునర్నర్మించారు.

రెండవ పెద్ద సమస్య అయిన నేల కోతను నివారించేందుకోసం కూడా అన్నా చర్యలు చేపట్టాడు. వృధాగా వెళుతున్న నీటిని తనిఖీ చేయడం ద్వారా నేల మరియు నీటిని ఆదా చేయడానికి, కొండవాగుల పొడవునా నిమ్నోన్నత కాలువలను, వాగు గసికలను నిర్మించాడు. కొండవాలు మరియు గ్రామం పొడవునా పచ్చిక, పొదలు మరియు 3 లక్షల చెట్లను నాటించాడు. ఈ ప్రక్రియకు అనుబంధంగా అటవీకరణ, నీటి మడుగులు, భూగర్భ చెక్ డ్యామ్‌లు మరియు సిమెంట్ చప్టాలను కీలక ప్రాంతాల్లో నిర్మించారు. వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమాలు భారీ విజయాన్ని సాధించాయి, గ్రామంలోని అనేకమంది రైతులకు నీరు ప్రస్తుతం నమ్మకమైన వనరుగా కావడంతో చాలామంది అవకాశాలు పెరిగాయి. రాలేగాన్ గ్రామం బిందు మరియు బైవాల్వ్ సాగులో కూడా పెద్ద ఎత్తున ప్రయోగాలు చేసింది. బిందు సేద్య పద్ధతిలో సాగు జరిగే మొత్తం ప్రాంతంలో బొప్పాయి, నిమ్మ మరియు మిరప మొక్కలు నాటించారు. చెరకు వంటి నీటిని అధికంగా ఉపయోగించే పంటల సాగును నిషేధించారు. తృణధాన్యాలు, నూనె గింజలు మరియు నీటిని తక్కువగా ఉపయోగించే కొన్ని రకాల వాణిజ్య పంటలను పెంచారు. గ్రామస్తులు అధిగ దిగుబడి పంటలను పెంచడం ప్రారంభించారు మరియు గ్రామంలో పంటల పద్ధతిలో కూడా మార్పు వచ్చింది.

ఖరీఫ్: 1975_76లో 240 ఎకరాలలో వాన నీటి ఆధారంగా సజ్జలను పండించగా, 20 ఎకరాలలో మాత్రమే సాగునీటి ద్వారా సజ్జలను పండించారు. 1985_86లో వర్షపు నీటితో పండించే సజ్జ సాగు అరవై ఎకరాలలో మాత్రమే సాగగా, ఖచ్చితమైన సాగునీటి కారణంగా 150 హెక్టార్లలో అధిగ దిగబడిని ఇచ్చే సజ్జలను పండించారు. 1975_76లో కేవలం రెండు హెక్టార్లలో మాత్రమే ఆకుకూరలు పండించారు. అదే 1985_86 కాలంలో అరవై హెక్టార్లను ఆకుకూరలు పెంచడానికి ఉపయోగించారు. ఈ ఆకుకూరలకు పూణే మరియు బాంబేలలో మార్కెట్లు సిద్ధంగా ఉండేవి. నూనె గింజల ఉత్పత్తి ప్రాంతంలో పెద్దగా తేడా కనిపించలేదు. అయితే 1985_86లో నూనె గింజలు పండించే భూమి మరో పదిహేను పైగా ఎకరాలకు పెరిగింది అందుచేత నూనెగింజల ఉత్పత్తి కూడా పెరిగింది.

రబి: 1975_76లో వర్షం ఆధారంగా పండే రాగిని 320 హెక్టార్లలో సాగుచేయగా, 50 హెక్టార్లలో రాగిని సాగునీటి సేద్యం ద్వారా పండించారు, అదే 1985_86లో సాగునీటితో పండే రాగి సాగు 250 హెక్టార్లకు పెరగగా, వాన నీటితో పండే రాగి కేవలం 90 హెక్టార్లలో మాత్రమే సాగయింది. ఇదే కాలంలో వర్షపునీటి ద్వారా గోధుమ సాగు పన్నెండు హెక్టార్ల నుండి ఏడు హెక్టార్లకు తగ్గగా, సాగునీటి ద్వారా గోధుమ సాగు ఒకటి నుంచి ఇరవై మూడు హెక్టార్లకు పెరిగింది. నూనెగింజలకు సంబంధించి సాగునీటి ప్రాంతం సున్నా నుంచి పదిహేడు హెక్టార్లకు పెరగగా, వర్షపు నీటి ఆధారంగా పెరిగే ప్రాంతం 30 హెక్టార్ల నుంచి పది హెక్టార్లకు పడిపోయింది. రబీ కాలంలో కూరగాయల ఉత్పత్తి ప్రత్యేకించి పుంజుకుంది. మూడు హెక్టార్లనుంచి ఇరవై అయిదు హెక్టార్లకు పెరిగింది.

రాలెగాన్ సిద్ధి గ్రామం ఇవ్వాళ రూ.80 లక్షల విలువైన ఉల్లిపాయలను ఎగుమతి చేస్తోంది. ఈ మార్పుల ఫలితంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 1975_76లో 294.3 టన్నుల నుంచి 1985_86లో 1386.2 టన్నులకు పెరిగింది. ప్రస్తుత ధరలలో ఇది రూ. 3.46 లక్షల నుంచి రూ. 31.73 లక్షలకు పెరిగినట్లు లెక్క అంటే పరిమాణంలో 4.7 రెట్ల పెరుగుదల మరియు విలువ పరంగా 9 రెట్లు పెరిగింది. ధాన్య బ్యాంకు: గ్రామంలోని చాలా మంది వ్యవసాయదారులు గోధుమ ఉత్పత్తిని పెంచినందువల్ల, గ్రామ సభలో ఒక నిర్ణయం తీసుకున్నారు, దీని ప్రకారం అదనపు గోధుమ పంట కలిగిన రైతులు 1983లో ప్రారంభమైన ధాన్య బ్యాంకుకు స్వచ్ఛందంగా ధాన్యం విరాళం ఇవ్వాలి. తగినంత ధాన్యం లేని గ్రామస్తులు ఈ బ్యాంకునుంచి ధాన్యాన్ని "అప్పు"గా తీసుకోవచ్చు. ఆహార అవసరాల కోసం ఏ గ్రామస్తుడూ డబ్బు అప్పుగా తీసుకోకుండా చెయ్యడమే దీని ఉద్దేశం. ధాన్య బ్యాంకు నుంచి ధాన్యాన్ని రుణరూపంలో ఇస్తారు, దీన్ని యువ బృందాలు పర్యవేక్షిస్తాయి.

హరిత ఛత్రాన్ని పునరుద్ధరించడం


మనిషి పొందవలసిన గొప్ప మిత్రులు చెట్లు, ఇవి పర్యావరణాన్ని శుభ్రపర్చి ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ఇవి గ్రామం యొక్క ఇంధన & వంటచెరకు అవసరాలను నెరవేరుస్తాయి. దీన్ని గుర్తించి, గ్రామస్తులు భారీ స్థాయిలో చెట్ల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 3_4 లక్షల చెట్లు నాటి పెంచారు. "సామాజిక ఫెన్సింగ్" ప్రవేశపెట్టారు, దీంట్లో గ్రామస్తులు పశువులను, మేకలను, గొర్రెలను ఆరు బయట స్వేచ్ఛగా తిరుగకుండా స్వచ్ఛందంగా నిరోధించారు. పశువులు బయళ్లలో మేయడాన్ని పూర్తిగా నిషేధించారు దాని స్టాల్ ఫీడింగ్ (కురాద్ బిందీ) గురించి నొక్కి చెప్పారు. రాలెగాన్ సర్పంచ్ (గ్రామ కౌన్సిల్ నేత) వర్ణిస్తున్నారు: "ఎండు కట్టెలు మరియు వంట చెరకు అదనంగా ఉంటూ వచ్చింది. పొరుగు గ్రామస్తులకు అవసరమైనప్పుడు మేం ఇప్పుడు సహాయం చేయగలం." వంటచెరకు సమృద్ధిగా అందుబాటులోకి రావటంతో, పాలిచ్చే జంతువుల ఉత్పాదకత, సంఖ్య పెరిగింది.

మద్యపానాన్ని నిర్మూలించడం


సామాజిక, ఆర్థిక మార్పు వైపుగా తదుపరి దశలో భాగంగా అన్నా హజారే, యువ బృందం మద్యపాన సమస్యను చేపట్టాలని నిర్ణయించారు. గ్రామీణుల జీవితాల్లోంచి మద్యపానాన్ని పూర్తిగా తొలగించనిదే గ్రామంలో అభివృద్ధి, సంతోషం నెలకొనవన్నది చాలా స్పష్టం. ఆలయంలో సమావేశం నిర్వహించిన తర్వాత, గ్రామంలో సారా కొట్టాలను మూసివేయాలని గ్రామంలో మద్యపాన అలవాటుపై నిషేధించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఈ తీర్మానాలన్నీ ఆలయంలో తీసుకున్నందువల్ల అవి మతపరమైన అంగీకారంగా మారిపోయాయి. దీంతో దాదాపు ముప్పై సారా తయారీ కేంద్రాలను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. సామాజిక ఒత్తిడికి తలొగ్గని వారిని తమ వ్యాపారం మూసుకునేలా ఒత్తిడి చేసి, యువ బృందం వారి సారా బట్టీలను కూల్చివేశారు. తమ వ్యాపారం కూడా అక్రమం కాబట్టి వాటి యజమానులు ఆరోపణ చేయలేకపోయారు.

సారా తయారీ కేంద్రాలను మూసివేయడంతో రాలెగాన్ సిద్ధిలో మద్యపానాన్ని తగ్గించినప్పటికీ, కొంతమంది గ్రామస్తులు మాత్రం తాగడాన్ని కొనసాగించారు. వారు సారాయిని పొరుగు గ్రామాలనుంచి సాధించేవారు. ఇలాంటి పురుషులను మూడు సార్లు హెచ్చరించాలని తర్వాత వారికి భౌతిక శిక్షలు విధించాలని గ్రామస్థులు నిర్ణయించారు. ప్రారంభ హెచ్చరికలు ముగిసిన తర్వాత కూడా తాగిన స్థితిలో కనిపించిన పన్నెండుగురు పురుషులను యువబృందం సహాయంతో స్తంభానికి కట్టి వేలాడదీశారు. దీనిపై అన్నా హజారే ఇలా అన్నారు వ్యాధిపాలయిన పిల్లాడిని మందులు కాపాడగలవని తెలిసినప్పుడు తల్లి తన పిల్లాడికి చేదుమాత్రలు ఇవ్వదా? పిల్లాడు మందులను ఇష్టపడకపోవచ్చు కాని, పిల్లలను సంరక్షించే తల్లి వాటిని పిల్లాడిచేత తినిపిస్తుంది. తాగినవారు శిక్షించబడ్డారు దీంతో వారి కుటుంబాలు నాశనం కాకుండా నిలబడ్డాయి.

మద్యపాన మత్తులో మునిగిన గ్రామాన్ని రక్షించడానికి ఇలాంటి చర్యలు మొదలు పెట్టి ఇప్పటికి పాతికేళ్ళయింది. గ్రామం నుంచి మద్యపానం తొలగించడంతో పాటు, గ్రామంలో పొగాకు, సిగరెట్లు, బీడీల అమ్మకాన్ని నిషేధించాలని కూడా నిర్ణయించారు. ఈ తీర్మానాన్ని అమలు చేయడానికి, యువ బృందం ఇరవై రెండేళ్ల క్రితమే విశిష్టరీతిలో "హోలీ"ని ప్రదర్శించారు. దుష్టత్వాన్ని తగులబెట్టడానికి సంకేతంగా హోలీ పండుగ నిర్వహించారు. యువ బృందం గ్రామంలోని అంగళ్లలో ఉండే అన్ని పొగాకు చుట్టలు, సిగరెట్లు మరియు బీడీలను తీసుకొచ్చి వాటిని హోలీ మంటల్లో కాల్చి వేశారు. ఆ రోజునుంచి రాలెగాన్ సిద్ధిలో ఏ షాపులో కూడా చుట్టలు, సిగరెట్లు, బీడీలు అమ్మడం లేదు.

పాల ఉత్పత్తి

ప్రత్యామ్నాయ వృత్తిగా రాలెగాన్‌లో పాల ఉత్పత్తిని ప్రోత్సహించారు. కొత్త పశువుల కొనుగోలు, కృత్రిమ సంతాన సాఫల్యం ద్వారా ప్రస్తుతం ఉన్న పశుసంతతిని మెరుగుపర్చడం, పశువైద్యుడి సకాల మార్గదర్శకత్వం మరియు సహాయం కారణంగా గ్రామంలో పశు సంపద పెరిగింది. పాల ఉత్పత్తి కూడా పెరిగింది. తక్కువ పాల దిగుబడిని ఇస్తున్న దేశవాళీ ఆవుల స్థానంలో సంకరజాతి ఆవులను ప్రవేశపెట్టారు. పాడియావుల సంఖ్య కూడా పెరగసాగింది. దీని ఫలితంగా వంద లీటర్ల నుంచి (1975కి ముందు) రోజుకు 2500 లీటర్ల వరకు పెరుగుదల కలిగింది. ఈ పాలను అహ్మద్ నగర్‌లోని సహకార పాల పరిశ్రమకు (మంగళ డైరీ) పంపేవారు. కొన్ని పాలను బాలవాడి (రాలెగాన్ సిద్ధిలోని పాఠశాల) పిల్లలకు మరియు పొరుగు గ్రామాల పిల్లలకు జిల్లా పరిషత్ స్పాన్సర్ చేసిన బాలల పోషకాహార పథకం కింద ఇచ్చారు.

పోగుపడిన మిగులులోంచి పాల సొసైటీ ఒక మినీ ట్రక్కును మరియు థ్రెషర్‌ను కొనుగోలు చేసింది. మినీ ట్రక్కులో అహ్మద్ నగర్‌కు పాల రవాణా చేయడంతోపాటు కూరగాయలు ఇతర ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌కి తీసుకుపోవడానికి ఉపయోగించేవారు, ఆవిధంగా మధ్య దళారీలను తొలగించారు. పంటకోతల కాలంలో థ్రెషర్‌ను రైతులకు అద్దెకిచ్చేవారు. ఈరోజు రాలెగాన్ సిద్ధి పాల వ్యాపారంలో సంవత్సరానికి దాదాపు కోటి రూపాయలు సంపాదిస్తోంది.

విద్య


1932 సంవత్సరంలో రాలెగాన్ సిద్ధిలో తొలి నియత పాఠశాల అంటే ఒకే తరగతి గది ఉన్న ప్రాధమిక పాఠశాల ఏర్పడింది. 1962లో కమ్యూనిటీ స్వచ్ఛంద కృషితో గ్రామస్తులు మరిన్ని తరగతి గదులను చేర్చుకున్నారు. 1971 నాటికి 1209మందిగా అంచనా వేసిన జనాభాలో కేవలం 30.43% మంది మాత్రమే అక్షరాస్యులు (72 మంది మహిళలు, 290 మంది పురుషులు) బాలురు ఉన్నత విద్య కోసం సమీప పట్టణాలైన షిరూర్ మరియు పార్నర్‌కు వెళ్లేవారు. అయితే సామాజిక-ఆర్థిక పరిస్థితుల కారణంగా బాలికలు బయటి ఊర్లకు వెళ్లలేక ప్రాధమిక విద్యతోటే సరిపెట్టుకునేవారు. అన్నా హజారే రాలెగాన్ యువతతో కలిసి అక్షరాస్యతా రేటు, విద్యా స్థాయిలను పెంచడానికి కృషి చేశారు. 1976లో వారు ప్రాధమిక స్కూలుకు ముందటి ప్రీ స్కూల్‌ను ప్రారంభించారు, 1979లో ఉన్నత పాఠశాలను కూడా ప్రారంభించారు. గ్రామస్తులు గ్రామ పాఠశాలపై క్రియాశీలక ఆసక్తి ప్రదర్శించడం ప్రారంభించి సంత్ యాదవ్ బాబా శిక్షణ్ ప్రచారక్ మండల్ (ట్రస్ట్)‌ని నెలకొల్పారు. ఈ ట్రస్టు ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు టీచర్లలో ఆసక్తి కొరవడిన కారణంగా దుస్థితిలో ఉన్న గ్రామ పాఠశాల పనిని చేపట్టాలని నిర్ణయించింది.

NREPని ఉపయోగించడం ద్వారా పాఠశాల భవంతి నిర్మాణంకోసం నాలుగు లక్షల రూపాయల ప్రభుత్వ గ్రాంటును ట్రస్టు పొందింది. సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన 200 మంది విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ కూడా నిర్మించబడింది. గ్రామంలో పాఠశాలను ప్రారంభించిన తర్వాత, రాలెగాన్ సిద్ధి నుంచి తొలిసారిగా ఒక విద్యార్థిని 1982లో తన S.S.Cని పూర్తిచేసింది. అప్పటినుంచి పాఠశాల గ్రామంలో అనేక మార్పులకు ఉపకరణంలాగా నిలుస్తూ వచ్చింది.

అంటరానితనం తొలగింపు


కులవ్యవస్థ కారణంగా ఉనికిలో ఉన్న సామాజిక అడ్డంకులను రాలెగాన్ సిద్ధి గ్రామస్థులు బద్దలుగొట్టారు, అన్ని కులాల ప్రజలు కలిసి సామాజిక ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. కుల వ్యవస్థ ప్రాతిపదికన అమలవుతున్న సాంఘిక వివక్షతను నిర్మూలించడంలో రాలెగాన్ ప్రజలు బాగానే విజయం సాధించారు. గ్రామ సామాజిక, ఆర్థిక జీవితంలో దళితులు కూడా భాగమయ్యారు. గ్రామస్థులు హరిజనుల కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చారు రుణభారం నుంచి వారిని తప్పించడానికి వారి రుణాల చెల్లింపులో కూడా సాయపడ్డారు.

సామూహిక వివాహాలు


గ్రామీణ పేదలు తమ కొడుకులు, కూతుళ్ల పెళ్లి సందర్భంగా భారీ ఖర్చులు పెట్టడం వల్ల రుణ ఊబిలో కూరుకుపోయేవారు. ఇది అవాంఛనీయ అలవాటే అయినప్పటికీ ఇది తప్పనిసరి సామాజిక విధిగా ఉండేది. రాలెగాన్ ప్రజలు వివాహాలను కూడా సామూహికంగా జరుపుకోవడం ప్రారంభించారు. పెళ్లి విందు ఉమ్మడిగా జరిగేది తరుణ్ మండలి పెళ్లి వంటలు, వడ్డన బాధ్యత తీసుకోవడంతో ఖర్చులు మరింత తగ్గాయి. వంటపాత్రలు, లౌడ్ స్పీకర్ సిస్టమ్, కల్యాణ మండపం, అలంకరణలను కూడా పీడిత కులాలకు చెందిన తరుణ్ మండల్ సభ్యులే తీసుకువచ్చేవారు. 1976 నుంచి 1986 వరకు ఈ వ్యవస్థ కింద నూట ఇరవై నాలుగు వివాహాలు జరిగాయి.

గ్రామ సభ


గ్రామాల్లో సామూహికంగా నిర్ణయాలు తీసుకోవడానికి గ్రామ సభ కీలకమైన వేదిక. ప్రణాళిక, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో గ్రామస్థులు పాలుపంచుకున్నట్లయితే, గ్రామంలో జరిగే ఏ మార్పునైనా వారు మరింత బాహాటంగా స్వీకరిస్తారు. రాలెగాన్ సిద్ధిలో గ్రామ శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి గ్రామ సభా సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమాల వంటి ప్రాజెక్టులను గ్రామ సభలో చర్చించన తర్వాతే చేపట్టేవారు. నస్బంది, నసబంది, కుర్హద్‌బంది, చారై బంది, శ్రమదాన్ వంటి అన్ని నిర్ణయాలు గ్రామసభలోనే తీసుకునేవారు. సాధారణ మెజారిటీ అభిప్రాయం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు. అభిప్రాయభేదాలు నెలకొన్న పక్షంలో అత్యధికులు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునేవారు. గ్రామ సభ నిర్ణయంమే తుదినిర్ణయంగా ఉండేది.

పంచాయత్‌కు అదనంగా గ్రామంలో పలు చట్టబద్దంగా నమోదైన సొసైటీలు ఉండి గ్రామానికి చెందిన పలు ప్రాజెక్టులు, కార్యకలాపాలను చేపట్టేవి. ప్రతి సొసైటీ ప్రతి సంవత్సరమూ గ్రామ సభలో తమ వార్షిక నివేదక, లెక్కల ప్రకటనను సమర్పించేవి. సంత్ యాదవ్ బాబా శిక్షణ ప్రకాశక్ మండలి విద్యా కార్యక్రమాలను పర్యవేక్షించేది. వివిధ్ కార్యకారి సొసైటి, రైతులకు ఎరువులు, విత్తనాలు, సేంద్రియ వ్యవసాయం, ఆర్థిక సహాయం వంటి వాటిలో సలహాలు ఇచ్చి సహకరించేది. శ్రీ సంత్ యాదవ్‌బాబా దూద్ ఉత్పాదక్ సహకారి సంస్థ పాల వ్యాపారానికి సంబంధించి సలహాలు ఇచ్చేది. ఏడు సహకార వ్యవసాయ సొసైటీలు సహకార బావుల నుంచి రైతులకు నీటిని అందించేవి. మహిళా సర్వగే ఉత్కర్ష్ మండల్ మహిళల సంక్షేమ అవసరాలను తీర్చేది.

గ్రామంలో ఐక్యతను ప్రతిబింబించడానికి గాను, రాలెగనా సిద్ధి కుటుంబాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న వార్షిక జన్మదినాన్ని జరుపుకునేవి. ఆ రోజు: గ్రామంలోని అత్యంత వయో వృద్ధుడిని గ్రామ పితగా గౌరవించేవారు. అత్యంత వయో వృద్ధురాలిని గ్రామ మాతగా గౌరవించేవారు. పిల్లల కుల మతాలతో నిమిత్తం లేకుండా గత సంవత్సరం గ్రామంలో జన్మించిన ప్రతి కొత్త శిశువుకు దుస్తులు కుట్టించి ఇచ్చేవారు. గత సంవత్సరం గ్రామ కోడళ్లుగా గ్రామంలోకి అడుగుపెట్టిన నూతన వధువులకు కొబ్బరి కాయ ఇచ్చి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికేవారు. విద్యలో విజయం సాధించిన విద్యార్థులను కూడా సత్కరించేవారు. ఏదో ఒక అంశంలో ప్రత్యేకత సాధించిన యువతను కూడా సత్కరించేవారు. ఈ కార్యక్రమం జరిగే రోజు సాయంత్రం వేళ గ్రామస్థులందరూ ఒక చోటికి చేరి కలిసి భుజించేవారు.

ఈరోజు అన్నా ఒక మహర్షి స్థాయిని పొందారు. గ్రామంలోని తన భూమిని ఆయన హాస్టల్ భవంతికి విరాళంగా ఇచ్చారు. తన ఫించన్ డబ్బులను గ్రామ నిధికి ఇచ్చేవారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన అన్నా కొద్దిపాటి వ్యక్తిగత వస్తువులతో గ్రామ ఆలయంలో నివసిస్తున్నారు. ఆయన హాస్టల్ అబ్బాయిలకు వండిపెట్టే సాధారణ భోజనాన్ని స్వీకరిస్తుంటారు. ఆయన తల్లిదండ్రులు, సోదరులు కూడా గ్రామంలోనే నివసిస్తుంటారు కాని గ్రామంలోని ఏ ఇతర కుటుంబం కంటే వారు భిన్నంగా ఉండరు. పరమ నిస్వార్థ జీవితం నుంచి పెంపొందుతూ వచ్చిన నైతిక అధికారం ఆయన్ను గ్రామంలో తిరుగులేని నేతగా మార్చింది.

అన్నా నైతిక నియమావళి కూడా చాలా కఠినంగా ఉంటుంది. సామాజిక నీతిని నిలబెట్టడానికి శిక్ష అనేది తప్పనిసరైన ప్రక్రియా భాగంగా అన్నా విశ్వసిస్తుంటారు. ఊరుమ్మడి భూములనుంచి పిల్లవాడు పండును దొంగలించినప్పుడు, అతడిని స్తంభానికి కట్టివేసి అతడికి నీతి నేర్పడానికి పళ్లను అతడి ముందే ఉంచేవారు. గ్రామంలో పళ్లు కాసే చెట్లు కాపలాదారు పరిరక్షణలో ఉండేవి కాదు. ఏ ఒక్క పండు కూడా తస్కరించబడేది కాదు, పండిన పళ్లను బాలవాడి పిల్లలు, పాఠశాల పిల్లలకు పంచి పెట్టేవారు. తప్పుచేసిన వారిని బహిరంగంగా దండించేవారు, అయితే భయం పుట్టించడానికి కాకుండా తప్పుచేసిన వాడు పదిమందిలో సిగ్గుపడాలని, ఆలాగయితేనే వారు మరింత స్వయం నియంత్రణలో ఉంటారని విశ్వసించేవారు. రాలెగాన్ సాధించిన విజయాల పట్ల ప్రజలు పొంగిపోయేవారు. ఆ ఉజ్వల చరిత్రలో వారికి కూడా భాగముంది మరి. అందుకనే వారు అన్నాను నొప్పించే పని కాని గ్రామానికి చెడ్డపేరు తెచ్చే పని కాని దేన్నీ చేయరు.

అరెస్టులు


మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి బాబన్‌రావ్ గోలాప్ పరువు నష్టం దాఖలు చేసిన సందర్భంగా అన్నా హజారేని 1998లో అరెస్ట్ చేశారు. ప్రజా నిరసనతో ఆయనను విడుదల చేశారు.

అవార్డులు


1990 సంవత్సరంలో భారత్ ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు
1986 నవంబర్ 19న భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేతుల మీదుగా భారత ప్రభుత్వం వారి ఇందిరా ప్రియదర్శినీ వృక్షమిత్ర అవార్డు.
1989లో మహారాష్ట్ర ప్రభుత్వంచే కృషి భూషణ అవార్డు.
1987 జనవరి 15న అహ్మద్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌చే సన్మానం
పుణే మునిసిపల్ కార్పొరేషన్‌చే సన్మానం
కిసాన్ బాబూరావ్ హజారే అసాధారణ ప్రజాసేవకు గాను 2008 ఏప్రిల్ 15న, ప్రపంచ బ్యాక్ యొక్క 2008 జిత్ గిల్ స్మారక అవార్డును అందుకున్నారు: "మహారాష్ట్రలోని వెనుకబడిన అహ్మద్‌నగర్ ప్రాంతంలోని రాలెగాన్ సిద్ధిని హజారే ఒక అధ్భుతమైన ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దారు, సమాచార హక్కుకోసం మరియు అవినీతికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు."

ఉల్లేఖనాలు


అన్నా తత్వశాస్త్రం హిందూ ఆధ్యాత్మికవాదం మరియు స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు వినోబా భావే వంటి ఆధునిక హిందూ చింతనాపరుల సమ్మేళనంగా ఉంటుంది. ఈ తత్వశాస్త్రానికి సంబంధించి అన్నా ఉపన్యాసాలనుంచి, మరియు తన ఆదర్శ గ్రామ భావన యొక్క పునాదికి సంబంధించిన పలు ఉల్లేఖనలు తీసుకోబడ్డాయి.
* నేలమీద మనం చూసే ప్రతి పెద్ద చెట్టు వెనకాల, నేల లోపల కలిసిపోయి ఉన్న గింజ తప్పక కనిపిస్తూంటుంది.
* గ్రామీణాభివృద్ధి అనేది సారాయి వినియోగం, అమ్మకాల తగ్గింపు మీదే అధారపడి ఉంటుంది .
* వ్యక్తిని మార్చకుండా గ్రామాన్ని మార్చడం అసాధ్యం. అదేవిధంగా గ్రామాలను మార్చకుండా దేశాన్ని మార్చడం కూడా అసాధ్యం .
* గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, రాజకీయాలను పక్కన బెట్టాలి .
* ఆధ్యాత్మికత లేని విద్య అభివృద్ధికి సహకరించదు .
* డబ్బు మాత్రమే అభివృద్ధిని తీసుకురాలేదు కాని, అది అవినీతిని కొనితెస్తుంది .
* గ్రామీణాభివృద్ధి ప్రక్రియలో, సామాజిక, ఆర్థికాభివృద్ధి పక్కపక్కనే కొనసాగాలి .
* సామాజిక పరవర్తనా కృషి ఏమంత సులభం కాదు అలాగని అసాధ్యమూ కాదు .
* అన్ని రాజకీయాలు మరియు సామాజిక కృషి యొక్క అంతిమ లక్ష్యం సమాజం మరియు జాతిని అభివృద్ధి పర్చే విధంగా ఉండాలి .
* కేవలం పుస్తకాలు మాత్రమే భావి పౌరులను రూపొందించలేదు, దానికి సాంస్కృతిక పెట్టుబడులు అవసరం .
* మంచి పౌరులను తయారు చేయడానికి విద్యాసంస్థలు మాత్రమే సరిపోవు, ప్రతి ఇల్లూ ఒక విద్యా కేంద్రంగా మారాలి .
* లోలత్వం వ్యాధికారకం కాగా త్యాగం విజయసాధనవైపు పయనిస్తుంది .
* అన్నీ ఉచితంగా కావాలని ఎవరూ కోరుకోకూడదు; ధర్మనిధులను ఆశించడం అనేది మనుషుల్ని సోమరిపోతులుగా, పరాధీనులుగా మారుస్తుంది .
* స్వార్థ ప్రయోజనాన్ని పక్కనబెట్టి వ్యక్తి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే, అతడు మానసిక శాంతిని పొందడం ప్రారంభిస్తాడు
* ప్రపంచానికి సంబంధించిన అన్ని పనులనూ చేస్తూనే ప్రపంచ విషయాలనుంచి దూరంగా ఉంటున్నవాడే నిజమైన రుషి .
* స్వార్థం నుంచి విముక్తి అనేది ప్రజల విముక్తిలో భాగంగా ఉంటుంది .
* అనుభవమే మార్గాన్ని బోధిస్తుంది కాని, ప్రతి పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి 

Monday, August 8, 2011

విశాఖ పట్నం జిల్లా వివరణ


విశాఖ పట్నం జిల్లా వివరణ
మండలాలు ( 42 )
జిల్లా కేంద్రం : విశాఖ పట్నం
వైశాల్యము : 11,161 చ.కి.మీ
రాష్ట్ర వైశాల్యములో ఈ జిల్లా వైశాల్యము : 4:06 శాతం
జనాభా (2001 ) : 38,16,820
పురుషులు : 19,23,999
స్త్రీలు : 18,92,821
జనసాంద్రత : 339 ( 9వ స్థానం)
జనాభా నిష్పత్తి ( స్త్రీ ,పురుష ) : 984 :1000
జనాభా పెరుగుదల : 27 శాతం
అక్షరాశ్యత : : 60.59శాతం
పట్టణ ప్రాంత అక్షరాశ్యత : : 70.38 శాతం
గ్రామాల్లో అక్షరాశ్యత : : 28.54 శాతం
పురుషులలో అక్షరాశ్యత : : 69.81 శాతం
స్త్రీలలో అక్షరాశ్యత : : 51.23 శాతం
ఓటర్లు పురుషులు (1998 ) : 12,01,822
ఓటర్లు స్త్రీలు : 12,12,331
షెడ్యూల్ద్ కులాలు : 2,56,936
షెడ్యూల్ద్ తెగలు : 4,68,886
పార్లమెంటు నియోజక వర్గాలు : 2 ( విశాఖ పట్నం, అనకాపల్లి )
అసెంబ్లీ నియోజక వర్గాలు : 13
మున్సిపాలిటీలు : 13
ప్రాధమిక ఉన్నత పాఠశాలల సంఖ్య : 3806
సెకండరి పాఠశాలల సంఖ్య : 421
బ్యాంకులు : 235
కార్పోరేషన్ : 1) విశాఖపట్నం
వర్షపాతం : 1085 మి.మీ
అడవులు : 4,77,791 హెక్టారులు
ఆసుపత్రులు : 48
వైద్యుల సంఖ్య : 502
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 48
డిస్పెన్సరీలు : 31
పోస్టాఫీసులు : 700
మండలాలు : 39
జిల్లా పరిషత్ ( జడ్పీటీసీ )లు : 39
మండల పరిషత్ ( ఎంపీటీసీ ) లు : 596
ప్రధాన పట్టణాలు : 9
గ్రామాలు : 3,692
గ్రామ పంచాయితీలు : 1,064
చిన్న తరహా పరిశ్రమలు : 7080
భారీ మద్య తరహా పరిశ్రమలు : 61
సాగు భూమి : 4.73 లక్షల హెక్టార్లు
రెవెన్యూ డివిజన్లు : 3. (1. విశాఖ పట్నం 2.నర్సీపట్నం, 3.పాడేరు )
రవాణా :
కలకత్తా నుంచి మద్రాసు పోయే 5వ నంబరు జాతీయ రహదారి 109 కి.మీ ప్రయాణం చేస్తుంది. జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో 1357 కి.మీ రోడ్లు వున్నాయి.
ముఖ్య నదులు :
గోస్తనీ, వరాహ, మాచ్ ఖండ్, శారద, తాండవ, వర్ష, చంపావతి, నెల్లిమర్ల, గంభీరాల గడ్డ, నరవగడ్డ
ముఖ్యపంటలు : వరి, రాగులు, పెసలు, ఉలవలు, వేరుశనగ,నువ్వులు, చెరకు, జనుము, నీరుల్లి
ఖనిజములు: మాంగనీసు, గ్రాఫైటు, ఇనుము, మాగ్నటైట్, బాక్సైట్
ముఖ్య పరిశ్రమలు :
బెల్లం, చెక్కెర, జనపనార, ఎరువులు, సిమెంటు, ఓడల నిర్మాణము, పెట్రోలు శుద్ది కర్మాగారము, ఉక్కు కర్మాగారము మొదలగునవి.
ప్రధాన పట్టణాలు : విశాఖపట్నం, భీమునిపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, యలమంచిలి
శాసన సభ నియోజక వర్గాలు :
  • 1. భీమునిపట్నం,
  • 2. విశాఖపట్నం - I,
  • 3.విశాఖపట్నం - II,
  • 4. పెందుర్తి,
  • 5. మాడుగుల,
  • 6. ఛోడవరం,
  • 7. అనకాపల్లి,
  • 8. పరవాడ,
  • 9.యలమంచిలి,
  • 10. పాయకరావు పేట,
  • 11. నర్సీపట్నం,
  • 12. పాడేరు,
  • 13. చింతపల్లి.
చూడదగ్గ ప్రదేశాలు :
బి.హెచ్.పి.వి, ఓడరేవు, హిందూస్తాన్ షిప్ యార్డ్, కోరమాండల్ ఎరువుల కర్మాగారము, అరకులోయ, బొర్రాగుహలు, అనంతగిరి, భీమునిపట్నం, కశింకోట, ఆర్.కె. బీచ్, ఋషికొండ, విశాఖపట్నం నౌకాశ్రయం, సింహాచలం (వరహ నరసింహ స్వామి దేవాలయం)
జిల్లా సరిహద్దులు :
ఉత్తరాన విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన ఒరిస్సారాష్ట్రం.
జిల్లా చరిత్ర :
స్వాతంత్రానికి పూర్వం ఈ జిల్లా దేశంలోనే అతి పెద్ద జిల్లాగా ఉండేది. ఈప్రాంతాన్నిపూర్వం మౌర్యులు, శాతవాహనులు ,విష్ణుకుండినులు, చాళుక్యులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు పరిపాలించారు. చివరగా ఇది బ్రిటీషువారి పాలనలోనికి వచ్చింది. 1879లో వీరయ్య దొర ఆధ్వర్యంలో రంప తిరుగుబాటు, 1922లో కొండజాతివారైన సవరల విప్లవం జరిగాయి. అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో రంప చోడవరం, అడ్దతీగెల, నర్సీపట్నం ప్రాంతాలలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మన్యం తిరుగుబాటు వంటి ఉద్యమాలు మొత్తందేశ ప్రజలను ఉత్తేజపరిచాయి. బ్రిటీషు ప్రభుత్యం ఉద్యమ నాయకులను పాశవికంగా కాల్ఛివేసింది. స్వాతంత్ర్యం తరువాత ఈ జిల్లా రెండుసార్లు విభజింపబడి కొన్ని ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు బదిలీ చేయబడినాయి.
జిల్లాలో 42% అడవులు విస్తరించి వున్నాయి. అనంతగిరి, చింతపల్లి, సీలేరు, మినుమలూరు, అరకులోయ, భీమునిపట్నం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఏటికొప్పాక గ్రామం ఆట బొమ్మల తయారీకి ప్రసిద్ది వహించింది. కాశీపట్నం ప్రాంతంలో 86,364 మెట్రిక్ టన్నుల అపెటైట్ ఖనిజం ఉన్నట్లు కనుగొనబడింది. చింతపల్లి వద్ద బాక్సైట్, కాశీపట్నం వద్ద వెర్మిక్యులేట్, నక్కపల్లి వద్ద బంకమట్టి లభిస్తున్నాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లా తరచుగా తుఫాన్ తాకిడికి గురవుతూ ఉంటుంది. మొత్తం భూమిలో 30% సాగుచేయబడుతుంది. 40% భూములకు నీటి సౌకర్యం ఉంది.
1933లో విశాఖపట్నంలో ఓడరేవు నిర్మించబడింది. విశాఖపట్నంలో ఎన్నో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించబదినాయి. దేశంలోకెల్లా అత్యంత సహజమైన ఓడరేవుగా విశాఖపట్నం ప్రసిద్దిగాంచింది. సింహాచలం పుణ్యక్షేత్రం ఈ జిల్లాలోనే ఉంది. నౌకా, విమాన, రక్షణ యంత్ర పరికరాలు, చమురు శుద్ధికి సంభందించిన రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించబడినాయి.