Friday, August 24, 2018

ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్‌నయ్యర్ కన్నుమూత....

 ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్ట్ కులదీప్‌నయ్యర్ కన్నుమూశారు. 1923 ఆగస్టు 14న జన్మించిన ఆయన ఉర్దూ పత్రిక అంజుమ్‌లో జర్నలిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. ఇందిరాగాందీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో అరెస్టు అయి జైలుకు వెళ్లారు. బ్రిటన్ రాయబారిగా పనిచేశారు. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు.
కులదీప్ నయ్యర్ (జ. ఆగస్టు 14 1923, మ. ఆగష్టు 23 2018 ) భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు మరియు రచయిత. తన జీవితకాలంలో చాలాకాలం వామపక్ష రాజకీయ విశ్లేషకులుగా ఉన్నాడు. ఆయన 1997లో భారత పార్లమెంటు లోని రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు.
ఆయన బ్రిటిష్ ఇండియా లోని పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోట్ లో 1923 ఆగస్టు 14న జన్మించాడు. ఆయన తల్లిదంద్రులు పూరన్‌దేవి మరియు గుర్బక్ష్ సింగ్. లాహోర్ లోని ఫోర్మన్ క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ. ఆనర్స్ పూర్తిచేసాడు. తరువాత లాహోర్ లోని లా కళాశాలలో ఎల్.ఎల్.బి పూర్తి చేసాడు,1952 లో ఆయన నార్త్‌వెస్ట్ విశ్వవిద్యాలయం లోని మెడిల్ల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుండి జర్నలిజం చదివాడు,
నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టరుగా పనిచేసాడు. 1975-77 లలో భారత ఎమర్జన్సీలో అరెస్టు అయ్యాడు.ఆయన మానవహక్కుల ఉద్యమకారుడు మరియు శాంతి ఉద్యమకారుడు. 1996లో ఐక్యరాజ్యసమితికి వెళ్ళిన భారతీయ సభ్యులలో ఒకడు. ఆయన 1990లో గ్రేట్ బ్రిటన్ హై కమీషనరుగా నియమింపబడ్డాడు. 1997 ఆగస్టులో భారత పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభకు నామినేట్ చేయబడ్డాడు.

ఆయన 14 భాషలలోని 80 వార్తాపత్రికలలో "ఆప్-ఎడ్" (ఆపోజిట్ టు ద ఎడిటోరియల్) లో రచనలు చేసాడు, అనేక కాలమ్స్ రాసాడు. ఆయన వ్రాసిన పత్రికలలో "ద డైలీ స్టార్", "ద సండే గార్డియన్,"ద న్యూస్ పాకిస్తాన్,"ద స్టేట్స్‌మన్(ఇండియా)",ఎక్స్‌ప్రెస్ ట్రిబూన్(పాకిస్తాన్)" "డాన్ (పాకిస్తాన్)",అనేవి ముఖ్యమైనవి. తెలుగు దినపత్రిక ఈనాడులో లోగుట్టు శీర్షికన ఆయన వ్యాసాలు ప్రచురితమౌతూంటాయి.
2000 సంవత్సరం నుండి ప్రతీ యేటా ఆయన భారత, పాకిస్తాన్‌ల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అమృత్ సర్ లోని ఆట్టారి- వాగా ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నాడు.
శిక్షాకాలం పూర్తయ్యాక కూడా విడుదల కాని భారతదేశ జైళ్ళలో ఉన్న పాకిస్తానీ ఖైదీలు, పాకిస్తాన్ లో ఉన్న భారత ఖైదీలను విడిపించడం కోసం నయ్యర్ పనిచేస్తున్నాడు.నయ్యర్ రాజకీయ వ్యాఖ్యాతగా ప్రస్తుత రాజకీయ సమస్యలపై తన అభిప్రాయాలను వ్రాస్తున్నాడు. ఆయన అన్నా హజారే చేసిన ఉద్యమానికి మద్దతు తెలిపాడు. 1971లో తూర్పు పాకిస్తాన్ లో పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలపై పాకిస్తాన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పకపోవటాన్ని నిరసించాడు. పాకిస్తాన్ దురాగతాలే చివరికి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసాయి. భారతదేశానికి పాకిస్తాన్ నుండి స్మగుల్ అవుతున్న మాదకద్రవ్యాల పట్ల కూడా పాకిస్తాన్‌ను నిరసించాడు.





No comments:

Post a Comment