Wednesday, February 18, 2015

దగ్గుపాటి రామానాయుడు ఇకలేరు

రామానాయ్డు గారితో ఎడిటర్ ఎమ్ ఎ రాజు(బాబు) పైల్ పొటో...
ప్రముఖ నిర్మాత,మాజీ ఎంపి దాదాసాహెబ్ ఫాల్కె, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామానాయుడు ఇక లేరు. కొంత
కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం కన్నుముశారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి రాముడు భీముడు, ప్రేమ్‌నగర్, జీవన తరంగాలు, ఇంద్రుడు చంద్రుడు, సర్పయాగం, దేవత, సంఘర్షణ, కలియుగ పాండవులు, ఆహనా పెళ్లంట, గణేష్, బొబ్బిలిరాజా, తాజ్ మహల్, కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా వంటివి ఆయన హిట్ సినిమాల జాబితాలో కొన్ని మాత్రమే.రామానాయుడు 1999లో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి తేదేపా తరపున ఎంపీగా గెలుపొందారు.మూవీమోఘల్‌గా ప్రఖ్యాతి గాంచిన రామానాయుడకు భారత ప్రభుత్వం 2010 సెప్టెంబర్ 9న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి గౌరవించింది. రామానాయుడు మృతి పట్ల చిత్ర, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం పరుస్తున్నారు.. 1936 జూన్ 6న గుంటూరు జిల్లా కారంచేడులో జన్మించిన రామానాయుడు భారతీయ భాషలన్నింటిలో చిత్రాలు నిర్మించిన ఘనతని సొంతం చేసుకున్నారు. 50 ఏళ్ల కెరీర్ లో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ అన్ని తరాల హీరోలతో సినిమాలు చేసిన అనుభవజ్ఞుడు రామానాయుడు. అంతేకాకుండా.. 100కుపైగా సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న ఏకైక నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం.అయితే రామానాయ్డుగారికి దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్ ప్రకటించిన సమయంలో. విశాఖపట్నంలోనే ఉన్నారు అదేరోజు సాయింత్రం స్పేస్ జెట్ విమాణం కోసం ఎయిర్ పోర్ట్ లో విఐపి లాంజ్ లో ఉన్న సమయంలో...సక్సెస్ న్యూస్ ఎడిటర్ ఎమ్ ఎ రాజు(బాబు) రామానాయ్డు గారితో ఇంటర్యూ చేసిన తరువాత ఆయనతో పొటోస్ తీసుకున్నాం.

No comments:

Post a Comment