Thursday, June 20, 2013

ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం


రదలతో విలవిలలాడిన ఉత్తరాఖండ్ లో సహాయ చర్యలు చేపడుతున్నారు. వాన తెరిపి ఇవ్వడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఇదో జలవిలయం కనీవినీ ఎరుగని జల ప్రళయం కుండపోతగా వర్షం కురిసింది. భాగిరథీ, మందాకిని, అలకనంద పేరేదైనా గంగమ్మ ఉగ్రరూపందాల్చింది. గంగ యమున దాని ఉపనదులు ఏకమైపోయాయి. ఉత్తరాఖండ్ లో ఊళ్లకు ఊళ్లనే ముంచేశాయి. 

ముందస్తుగా వచ్చిన రుతుపవనాలు ఉత్తరాఖండ్ ను ఊహించని దెబ్బ తీశాయి. ఈ స్థాయిలో రాష్ట్రాన్ని ముంచెత్తడం 90ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అందుకే దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఉత్తరాఖండ్ సర్కార్ కేంద్రాన్ని కోరింది.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తరాఖండ్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్రం నుంచి 145 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

రెండు రోజులుగా వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి 22ఆర్మీ హెలికాప్టర్లు దిగాయి. ఉత్తరాఖండ్ లో చిక్కుకుపోయిన 10వేల మందిని కాపాడి సహాయ శిబిరాలకు తరలించారు. మరో 60వేల మంది ఇంకా వరదల్లోనే చిక్కుకున్నారు. కేవలం కేదార్ నాథ్  కొండపైనే 50 మరణించారు. రెండు వారాల క్రితం ఓం నమశ్శివాయ మంత్రాలతో మార్మోగిన కేదార్ నాథ్  కొండ ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. కొండపైకి అనునిత్యం ప్రయాణికుల్ని తీసుకువెళ్లే మూగజీవాలు కూడా గల్లంతయ్యాయి. మొత్తం 5వేల గుర్రాలు, వాటి మాలీల ఆచూకీ తెలియడం లేదు. కేవలం కేదార్ నాథ్ కు వెళ్లే మార్గంలోనే 5 వేల మంది టూరిస్టులు చిక్కుకున్నారు. బద్రీనాథ్ కొండపైన 5 వేల మంది యాత్రికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

చార్ ధామ్ యాత్రలో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్  షిండే తెలిపారు. రాకపోకల పునరుద్ధరణకు సైన్యం, ఇండో టిబెటిన్  సరిహద్దు భద్రతా సిబ్బంది శ్రమిస్తున్నారు

ఉత్తరా ఖండ్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. యాత్రకని వెళ్లి వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్ల పరిస్థితి  దయనీయంగా ఉంది. కొందరి క్షేమ సమాచారం తెలిసినా మరికొందరి జాడే లేదు. వారి వివరాలు తెలీక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాదాపు మూడు వేల మంది తెలుగువారు చార్ ధామ్ యాత్రకు వెళ్లి ఉంటారని అంటున్నా అనధికారికంగా ఈ లెక్క పదివేలకు పైనే ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు తెలుగువారి సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ని ఉత్తరాఖండ్ పంపించింది

No comments:

Post a Comment