Thursday, March 5, 2015

మాట నిలబెట్టుకోవాలి

రాష్ర్ట విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని విశాఖపట్టణం(వైజాగ్),తిరుపతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ ఇచ్చారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని వెంకయ్య నాయుడు అప్పట్లో పార్లమెంట్‌లో ‌పోరాటం జరిపారు. ఇప్పుడు మోదీ తనమాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది.అయితే ఆంధ్రలో బాజాప పుంజుకుంటుదన్న సమయంలో తప్పులు దిర్లిస్తున్నారు. రాష్ర్ట విభజన సమయంలో వున్న పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు విభజనకే మొగ్గు చూపాయి. అయితే, రెండు రాష్ర్టాలకు సమ న్యాయం చేసిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండని అప్పట్లో చంద్రబాబునాయ్డు సూచించినప్పటికీ అందరూ తన మాటని పెడచెవిన పెట్టారు.రాష్ర్ట విభజన తో ఒక్క కాంగ్రేస్ పార్టీనే యావత్ తప్పు పడుతున్నప్పటికిని దానంతటికి కారణం బాజాప అనక తప్పదు..ఇలాగే వ్యవహరించుకు పోతుంటే వాళ్ళకి  పట్టిన గతే పడతాది.

No comments:

Post a Comment