Monday, September 12, 2011

12 వ పంచవర్ష ప్రణాళిక చివరికి 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్



విశాఖపట్నం;12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి దేశంలో 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ 500 మెగా వాట్ల పూర్తిస్థాయి వాణిజ్య ప్రక్రియను మంత్రి షిండే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను విద్యుత్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికి 1,22,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దాన్ని 1,80,000 మెగావాట్లకు పెంచగలిగామని తెలిపారు. 10వ ప్రణాళిక వరకు విద్యుత్ కొరత తీవ్రంగానే ఉందని, 11వ ప్రణాళికలో దీన్ని తగ్గించగలిగామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్ కొరత 12వ పంచవర్ష ప్రణాళికాంతం వరకూ ఉండదని, 13వ పంచవర్ష ప్రణాళిక నాటికి ఈ సమస్య మొదలవుతుందని మంత్రి షిండే తెలిపారు. ఇండొనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయని విలేఖరులు ప్రశ్నించగా, అక్కడ చవకగా బొగ్గు లభిస్తుంది. అయితే ఇక్కడికి దిగుమతి చేసుకోవడం కష్టతరంగా ఉందని అన్నారు. శ్రీలంకలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయు చేసుకోవలసి ఉందని, దీనిపై ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా పవర్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన ఉందని చెప్పారు. ఎన్‌టిపిసి సిం హాద్రి ద్వారా విద్యుత్‌లో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్‌కు ఇస్తారా? అని అడిగిన ప్రశ్నకు విద్యుత్ కొరత అనేక రాష్ట్రాల్లో ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై ఎన్‌టిపిసి ఏర్పా టు చేయనున్న కొత్త ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆయా రాష్ట్రాలకు 50 శాతం ఇవ్వాలని నిర్ణయించామని షిండే తెలిపారు.
అంతకు ముందు సింహాద్రి పవర్ ప్లాంట్‌లో జరిగిన సభలో షిండే మాట్లాడుతూ ఎన్‌టిపిసి ఏటా 9,200 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోందని అపంచవర్ష ప్రణాళిక చివరికి 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్
విశాఖపట్నం;12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి దేశంలో 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ 500 మెగా వాట్ల పూర్తిస్థాయి వాణిజ్య ప్రక్రియను మంత్రి షిండే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను విద్యుత్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికి 1,22,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దాన్ని 1,80,000 మెగావాట్లకు పెంచగలిగామని తెలిపారు. 10వ ప్రణాళిక వరకు విద్యుత్ కొరత తీవ్రంగానే ఉందని, 11వ ప్రణాళికలో దీన్ని తగ్గించగలిగామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్ కొరత 12వ పంచవర్ష ప్రణాళికాంతం వరకూ ఉండదని, 13వ పంచవర్ష ప్రణాళిక నాటికి ఈ సమస్య మొదలవుతుందని మంత్రి షిండే తెలిపారు. ఇండొనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయని విలేఖరులు ప్రశ్నించగా, అక్కడ చవకగా బొగ్గు లభిస్తుంది. అయితే ఇక్కడికి దిగుమతి చేసుకోవడం కష్టతరంగా ఉందని అన్నారు. శ్రీలంకలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయు చేసుకోవలసి ఉందని, దీనిపై ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా పవర్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన ఉందని చెప్పారు. ఎన్‌టిపిసి సిం హాద్రి ద్వారా విద్యుత్‌లో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్‌కు ఇస్తారా? అని అడిగిన ప్రశ్నకు విద్యుత్ కొరత అనేక రాష్ట్రాల్లో ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై ఎన్‌టిపిసి ఏర్పా టు చేయనున్న కొత్త ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆయా రాష్ట్రాలకు 50 శాతం ఇవ్వాలని నిర్ణయించామని షిండే తెలిపారు.
అంతకు ముందు సింహాద్రి పవర్ ప్లాంట్‌లో జరిగిన సభలో షిండే మాట్లాడుతూ ఎన్‌టిపిసి ఏటా 9,200 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోందని అన్నారు. పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు భూమిని సేకరించడం వలన చాలా మంది నిరాశ్రయులవుతున్నారని అన్నారు. ఇకపై కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడు ముందుగానే నిర్వాసితుల్లో అర్హత కలిగిన యువకులకు ఆయా ప్లాంట్లలో పనిచేయడానికి కావల్సిన శిక్షణను ముందుగానే ఇప్పించాలని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్‌టిపిసి దేశంలోనే తలమానికమైన సంస్థగా అభివర్ణించారు. ఇందులో పనిచేసే ఉద్యోగులకు అంకితభావం ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎన్‌టిపిసి ఆరు లక్షల మొక్కలు నాటాలనుకోవడం శుభపరిణామమని అన్నారు. ఎన్‌టిపిసి సిఎండి అరూప్‌రాయ్ చౌదరి మాట్లాడుతూ దేశానికి అవసరమైన విద్యుత్‌లో 1/3 విద్యుత్‌ను ఎన్‌టిపిసి అందిస్తోందని అన్నారు. మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతూ ఎన్‌టిపిసి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ మొత్తాన్ని మన రాష్ట్రానికే చెందేటట్టు చూడాలని కోరారు.






























1 comment:

  1. బాబు గారు... ఫోటోలు భాగా సేకరిస్తున్నారు...గోఫీనాద్

    ReplyDelete