Friday, March 11, 2011

కేకే, మధుయాష్కీలకు చేదు అనుభవం .....!!!


కేకే, మధుయాష్కీలకు చేదు అనుభవం .....!!!
మిలియన్ మార్చ్‌కు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన ఎంపీలు కేకే, మధుయాష్కీలకు చేదు అనుభవం ఎదురైంది. రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలంటూ తెలంగాణా వాదులు డిమాండ్‌ చేశారు. ఒకదశలో మధుయాష్కీని ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే కేకేపై పలువురు నిరసన కారులు చెప్పులు, వాటర్‌బాటిళ్ళు విసిరారు. ఆయను కారును స్వల్పంగా ధ్వంసం చేశారు.

ఓయూలో విద్యార్థులు VS పోలీసులు...!!


ఓయూలో విద్యార్థులు VS పోలీసులు...!!
* క్యాంపస్‌ గేట్ల మూసివేత 
* రాళ్లదాడులు ..అడ్డుకున్న పోలీసులు 
మిలియన్‌ మార్చ్‌తో ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉడికిపోయింది. ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపస్‌ గేట్లు మూసేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్టూడెంట్స్‌ను అదుపుచేసేందుకు లాఠీఛార్జ్‌తోపాటు బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు ఖాకీలు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది. ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ టెన్షన్‌..టెన్షన్‌. 
మిలియన్‌ మార్చ్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు ట్యాంక్‌బండ్‌ వైపు కదలడంతో పోలీసులు అలర్టయ్యారు. NCC గేట్‌ వద్ద వాళ్లను అడ్డుకున్నారు. ముందుకు కదలనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. పోలీసుల వలయం దాటేందుకు స్టూడెంట్స్‌ ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లాఠీఛార్జ్‌ చేయడంతో రెచ్చిపోయిన స్టూడెంట్స్‌... ఖాకీలపై రాళ్లు విసిరారు. అంతే..విద్యార్థులపై బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు పోలీసులు. 
పోలీసులు అదుపుచేసినా విద్యార్థులు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆవేశంతో NCC గేటు విరగ్గొట్టి మరీ బయటకు వచ్చారు. దీంతో మరోసారి విద్యార్థులపైకి రబ్బర్‌ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించారు ఖాకీలు. ఖాకీల తీరుపై మండిపడ్డారు విద్యార్థులు. అరెస్ట్‌ చేసిన స్టూడెంట్స్‌ను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. మిలియన్‌ మార్చ్‌ ముగిసినా..ఓయూలో మాత్రం పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

Tuesday, March 8, 2011

నాగం జనార్ధన్‌రెడ్డి కొత్త పార్టీ పెడతారా..!

* బాబు చాణక్యం బెడిసి కొట్టిందా! * నాగం వెనుక షాడో లీడర్‌ ఎవరు * సడెన్‌గా టోన్‌ మార్పు దేనికి సంకేతం * జనార్ధన్‌రెడ్డి వెంట ఎంతమంది వెళ్తారు 

చంద్రబాబుతో నాగంకి సయోధ్య కుదిరినా.. భవిష్యత్‌లో ఆయన మౌనంగా ఉంటారని చెప్పడానికి లేదు. పార్టీలో ఉండే పోరాడతానని నాగం చెప్తున్నా.. మిగతా నేతల్లో ఎక్కడో సందేహం. ఇంతకీ నాగం కొత్త పార్టీ పెడతారా. అసలు ఆయన వ్యూహం ఏంటి. గత కొంత కాలం నుంచి ప్రత్యేక తెలంగాణం విన్పిస్తున్న నాగం జనార్ధన్‌రెడ్డి సెపరేట్‌ శాఖ కోసం పట్టుబడుతున్నారు. ససేమిరా అన్న అధినేతపై అప్పటి నుంచే రగిలిపోతున్నారు. 
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల తర్వాత ప్రత్యేక కాంక్ష నాగంలో మరింత పెరిగిపోయింది. TDPకి చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయని సాకుగా చూపారు నాగం. అయినా బాబు నో చెప్పారు. పొలిటికల్‌ JAC, TRS అధినేత KCR డైరెక్షన్‌లో జరిగిన పలు ప్రొగ్రామ్స్‌లో వారితో క్లోజ్‌గా కలిసి నడుస్తున్న నాగంలో అనూహ్యంగా మార్పొచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షపై తమను అధినేత కట్టడి చేస్తున్నారని జనార్ధన్‌రెడ్డి బహిరంగంగానే తప్పుబట్టేంత ధైర్యాన్ని ఇచ్చింది. 
2004 వరకు సమైక్య వాదిగా ఉన్న నాగం స్వరంలో ఛేంజ్‌ వచ్చింది. YS మరణం తర్వాత KCR దీక్షకు మైలేజ్‌ రావడం... కేంద్రం ప్రత్యేక ప్రకటన తర్వాత ఈ మాజీ మంత్రి వ్యవహార శైలీ బాగా మారింది. OU క్యాంపస్‌లో దెబ్బలు తిన్న తర్వాత పక్కా తెలంగాణ వాదయ్యారు నాగం. TDPని ఇరుకున పెట్టాలన్న సింగిల్‌ పాయింట్‌ ఏజెండాను అమలు చేసేందుకు నాగంను KCR, కోదండరాం పావుగా వాడుకున్నారన్న వాదనా ఉంది. అయితే ఈ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన అధినేత వారి పాచికలు పారకుండా చిత్తు చేస్తూ వస్తున్నారు. 
ప్రతి విషయంలో ఓ విజన్‌తో ముందుకెళ్లే చంద్రబాబు... ఈసారి లెక్క తప్పారా. నాగం అసెంబ్లీలో రగడ విషయంపై ముందస్తు సమాచారం లేకపోవడం చూస్తుంటే నిజమేననిపిస్తోంది. నాగం సడెన్‌గా టోన్‌ మార్పు వెనుక ఎవరున్నారన్న దానిపై బాబు ఆరా తీస్తున్నారు. తెలంగాణ విషయంలో TDPని కౌంటర్‌ చేస్తున్న TRS, పొలిటికల్‌ JAC మెగా ప్లాన్‌గా అనుమానిస్తున్నారు. అయితే నాగంను ఆడిస్తున్న షాడో లీడర్‌ ఎవరన్న దానిపై కూపీ లాగే పనిలో నిమగ్నమయ్యారు బాబు. నాగం మరో దేవేందర్‌ గౌడ్‌ అవుతారా!, చెన్నమనేని రమేష్‌ను ఫాలోవర్‌గా మారుతారా....ఇవే ఇప్పుడు తేలాల్సి ఉంది. 
అధినేతను కాదని అది కూడా అసెంబ్లీ సాక్షిగా నాగం ప్రత్యేక తెలంగాణం విన్పించడమంటే భారీ సాహసానికి ఒడిగట్టడమే. క్రమశిక్షణకు మారు పేరున్న TDPలో ఇలాంటివి చేయాలంటే అన్నింటికి తెగించాలి. ముఖ్యంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారన్న భయం ఉంటుంది. ఇవన్నింటిని నాగం ఎక్స్‌పెక్ట్‌ చేయరనడానికి లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటున్న జనార్ధన్‌రెడ్డి కొత్త ప్లాన్‌ ఉండడంవల్లే ఇంతటి డేరింగ్‌ స్టెప్‌ వేశారంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. దేవేందర్‌గౌడ్‌ పార్టీని వీడిన తర్వాత దాదాపు నెంబర్‌ టుగా ఉంటూ వస్తున్న నాగం... ఇప్పుడు ఆయన్నే ఫాలోఅవుతారా అన్న డౌట్స్‌ వస్తున్నాయి. 
లేదంటే ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీని వీడిన మాజీ MLA చెన్నమనేని రమేష్‌లా ఏదో ఒక పార్టీ పంచన చేరుతారా అన్నది కూడా ఆసక్తి రేకేత్తిస్తోంది. దేవేందర్‌ గౌడ్‌ పార్టీని వీడేముందు సీనియర్లు కొందరు వెళ్తారననుకున్నారు. తీరా అసలు వ్యూహం బెడిసి కొట్టడంతో పెద్దిరెడ్డి ఒక్కరే మాజీ హోంమంత్రిని అనుసరించారు. మరి ఈసారి నాగం విషయంలో కూడా సేం సీన్‌ రిపీటవుతుందా. లేదంటే కొందరైనా MLAలు కలిసి వచ్చే ఛాన్స్‌ ఉందన్న వాదన బలంగా విన్పిస్తోంది. 
తెలంగాణ MLAల రాజీనామా పత్రాలన్ని తన జేబులోనే ఉన్నాయన్న నాగం కామెంట్స్‌కు బలం చేకూరుస్తూ సీనియర్‌ నేత మండవ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. నాగంతో వెళ్లేంత సీన్ గానీ... ఆయన చెప్పినట్లు చేసే అగత్యం తమకు లేదంటూ కొందరు నేతలంటున్నారు. నాగం ఒంటరయ్యారంటూ చేసిన ప్రచారం కూడా వట్టిదేనన్న సీన్‌ కన్పిస్తోంది. మోత్కుపల్లి, మండవ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు తెలంగాణ MLAలంతా హాజరు కాలేదు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. నాగం తీరుపై సీమాంధ్ర నేతల్లోనూ చర్చ జరుగుతోంది. 
అధినేత వద్దన్నా... సభలో జనార్ధన్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై పార్టీ పరంగా రియాక్షన్‌ ఎలా ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఫ్యూచర్‌లో తమకూ ఇలాంటి పరిస్థితే వస్తే ఎలా వ్యవహరించాలన్న దానిపై డిస్కస్‌ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అధినేత చంద్రబాబుకు మళ్లీ సంకట పరిస్థితి తప్పదంటున్నారు విశ్లేషకులు. ఉద్యమాలతో అటు లోక్‌సభలో... ఇటు అసెంబ్లీలో... ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్‌కు TDPలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలు కాస్త ఊరట నిచ్చాయి. 

Wednesday, March 2, 2011

 శివోహం.. శివోహం..!
వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళ మని అర్థం.పరమ మంగళకరమైనది శివ స్వరూపం.ఆ పరమ శివుని అనుగ్రహం పొందటా నికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. పురాణాల లో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘ మాసం కృష్ణ పక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.
లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు, జ్యోతి రూపంలో, లింగా కారం గా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అం టారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ము ఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురా ణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుం డా మేల్కొని ఉపవాసముండి, మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు, పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్త్యా త్మనమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యమున్నదం టారు.
ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరు విధాలు ఇలా ఒక్కొక్క వి ధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్ప టికీ, శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివు డు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శు ద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండ వది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాల భాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.
మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేని వారు శివ నామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు.త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమ యంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటకీి తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వ రుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడిం టిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చే ది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిధి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిధి నెలలో రెండుసార్లు వస్తుంది.
ప్రతిమాసము ఏకాదశినాడు, శివుడు ఉపవాసాలతో వుండేవాడని, వేద పురాణాలలో చెప్పడం జరిగింది.అలాంటి ఏకాదశినాడు ప్రతి మానవుడు ఉపవాసము ఉండుటం వలన మహాశివరాత్రి రోజున కలిగేటటువంటి ఫలితాన్ని పొందు తారని, విభూతి, రుద్రాక్ష మహిమవలన మనకు సకల కోరికలు నెరవేరుతాయని పార్వతీదేశి కఠోరమైన తపస్సు ద్వారా తెలిపింది.ఆసమయంలోనే రాజమందిరంలో ిహమవంతుని కల్పిన సప్తఋషూలు పార్వతీపరమేశ్వరుల వివాహం లోక శుభకరమవుతుంద ని, వారి దాంపత్యం ముల్లోకాలకు ఆదర్శప్రాయమవుతుందని పలికి సం బంధం నిశ్చయించిన హిమవంతుని ప్రార్థన మేరకు వివాహ ముహూ ర్తాన్ని కూడా నిర్ణయించారు. ఆ సమయములో మొదటి మఘమాసంలో బహుళ చతుర్థశినాడు తొలిసారిగా లింగోద్భవం జరిగింది.
దానినే మహా శివరాత్రిగా లోకులు భావించారు.ఆపుణ్య తిధినాడే పార్వతీపరమేశ్వరుల కల్యాణము జరిపించుటకు శుభముహుర్తంగా నిర్ణయించారు. ఈ జగత్తు దేనిలో సంచరించ దేనిలో లయం చెందుతుందో అదే లింగము. దీని మొదలు ఏదో చెప్పడానికి వీలుకాదు. కనుక అద్యంతాలు లేనిదే లింగము.లింగతత్వమే…. ఆత్మ…కనుక ప్రతిదేహమందు ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు. ఆ సత్యమును చాటడానికే ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉదర్భవించి బ్రహ్మ విష్ణువులుకు దర్శనవిచ్చాడు… ఆనంత లింగాకారుడై ముల్లోకాలలోను వెలసి నిత్యాభిషేక అర్చనలు అందుకున్నారు.
అలంకార రహితంగా ఉండడంలోని నిగూఢత్వం
ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. పుష్ప స్వర్ణాభరణాలంకారాలతో పరమే శునికి పని లేదు. ఈ అనంతవిశ్వంలో ఏ అలంకరణలు, ఏ అభరణాలు శాశ్వతం కావు. బాహ్య సౌందర్యం పరమావధి కానేకాదు. జీర్ణించుకు పోయే బాహ్య దేహానికి ముఖ్యత్వం ఇవ్వడం అవివేకం. శాశ్వతంగా ఏ మార్పులేకుండా చిరస్థాయిగా నిలిచివుండేది. ఆత్మ ఒక్కటే. అలాంటి మ హోన్నత ఆత్మను మనం సదా గౌరవించి నిర్మలంగా ఉంచుకోవడమే ముక్తిని పొందే మార్గం. ఈ నిగూఢ నిర్మల తత్త్వాన్ని మనకు అవగతం చేసేందుకు అద్యంతరహితుడైన పార్వతీశుడు ఏ అలంకరణలూ లేకుం డా అతి నిరాడంబరంగా దిగంబరుడుగా లోకాన నిలిచాడు.
శివశక్తుల మహిమను ప్రభావితం చేసే నామం..
శైవనామాన్ని ధరించేవారు మధ్య రేఖ మద్యలో చందనమూ, కుంకుమ మిశ్రమంలో కూడిన వృత్తాకార రూపాన్ని తప్పక ధరించాలి. వర్థి విభూతి రేఖలవలన శైవ కృపకు మాత్రమే పాత్రులు అవుతారు.అలాకాక మధ్య లో వృత్తాన్ని ధరించడం వల్ల ఆ శివుని పత్నియైన పార్వతీమాత కటాక్షాన్ని కూడా పొందవచ్చు.దేహంలోని మిగిలిన అంగాలపైన మూడు విభూతి రేఖలు మాత్రమే దిద్దుకొవాలి. జప తప ధ్యానాదుల ద్వారా మూలాధార చక్రంలో మేల్కొన్న కుండలిని శక్తి ‘ఇలాపింగళ’ నాడులు (సుషూమ్నా) కలయిక ప్రదేశంలో చేరుకొన్నపడు దానిలోని శక్తిప్రసారం ‘భృకుటి’ (రెండు కనుబొమ్మలు బయటకు రావడానికి ప్రయత్నించే ప్రదేశంలో శివుని త్రిశూలమైన రక్షిణిని తెల్లని వర్ణంలో దిద్దుకుంటారు.
ఈ త్రిశూ లంలోని మధ్యమొనను (గీతను) ఎరుపులో దిద్దుకోవడం వెనుక ఒక రహస్యమున్నది. శక్తిని (ఇది తపము, జపము, ధ్యానముల వల్ల కల్గినది) ఎరుపు వర్ణముతో సూచిస్తారు. కుండలిని శక్తి వర్ణం కూడా ఎరుపే అవ్వడంవలన మధ్య రేఖను తప్పనిసరిగా ఎరుపు రంగులో దిద్దుకుం టారు. నిగూఢంలో పరిశీలిస్తే వైష్ణవనామం, శైవనామం ఈశ్వరుని ఆ యుధాల కలయిక అని సుస్పష్టమౌతుంది. అందువల్లనే ‘శివాయ విష్ణూ రూపాయ! విష్ణూ రూపాయ శివహే’ అన్నారు.
ప్రదక్షణ విధులు…
శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.
గంగను భరించడంలో అంతరార్థం
ఈ భూమండలంలో గంగానదికి ఎంతో ప్రత్యేకత ఉంది. పలు కార్యాలు దిగ్విజయం చేసిన గంగానది యుగాలందు కలిగిన మార్పులలో ఒకసారి గౌతమమహర్షి పాపనివృత్తికై గోభస్మం నుండి ప్రవహించి గోదావరిగా మానవాళికి ఉపయోగకారిగా, వునీతులను చేస్తోంది. ఇలా గోదావరిగా భూలోకానికి వచ్చింది.ఆ సమయంలోనే ఆమె ప్రవాహం ఆపడానికి తన జటాఝాటంలో ముడివేసాడు గౌరీశుడు.అనేకానేక కార్యాలను నిర్వ హించిన ఘనత నదులలో గంగానదికి తప్ప మరే ఇతర నదులకు లేదు.
అనేక అంశరూపాంశాలను పొంది ఒకదానికొకటి పొంతన లేని అనేక కా ర్యాలను సాగించిన గంగ, సరాసరి మానవాళి విషయంలో చంచలమైన మనసు వంటిది.. మనస్సు అడ్డూ ఆపు మరచి నియమం హద్దు దాటి ప్ర వహించే గంగా ప్రవాహంతో పోల్చుకుంటే, వేగాన్ని కట్టడి చేసేందుకే పరమేశుడు తన జటాఝాటంలో బంధించి వేగాన్ని నియంత్రించి లోకా లను హద్దులేని గంగా ప్రవాహం నుండి సంరక్షించాడు.అంటే మనస్సు వేగాన్ని మనం కూడా సరైన రీతిలో సంరక్షించకపోతే అదుపు లేక గతి తప్పి మనస్సు మనలను ముంచేస్తుందన్న నిగూడార్థం.
చంద్రుని పొందడంలో అంతర్యం 
ఈశ్వరుడు చంద్రశేఖరుడుగా మారిన కారణం మనకు విదితమే. తనకు కలిగిన పాప ప్రక్షాళన నిమిత్తం చంద్రుడు చేసిన తప: ప్రభావాన పరమేశుడు చంద్రుడిని ధరించి చంధ్రశేఖరుడయ్యాడు. పార్వతీశుని త్రినేత్రం అగ్నితో సమానం. సూర్య తేజస్సు కంటే అమిత తేజోమయం. సూర్యచంద్రులే ప్రపంచ ఉనికికి మూలం.మానవ జీవనాధారం. అలా ప్రగతికి, మనుగడకు, విశ్వానికి మూలాధారమైన సూర్య చంద్రులను తాను పొందడం ద్వారా ఈ సృష్టి తనలోనే నిక్షిప్తమై ఉన్నదనీ, ఈ సృష్టికి తానే మూలమనీ, అద్యంతాలు, మూలాధారం తానే అనీ సుస్పష్టం చేస్తున్నాడు శంకరుడు.
బిల్వ దళం ప్రాముఖ్యత: 
బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శి వప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణం లోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.

నంది దర్శనం
నందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే శివ దర్శనానికి వేళ్ళాలి.నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం శూన్యం. ‘‘నందీశ్వర సమస్తుభ్యం శాంతా నంద ప్రదాయకం! మహాదేవసేవార్థం అనుజ్ఞాందాతుమర్హసి’’ అని ప్రార్థించి ఆయన కొమ్ముల మధ్యనుండి శివలింగాన్ని చూస్తూ ‘‘ఓంహర, ఓంహర’’ అంటూ ప్రార్థిస్తే ఏడుకోట్ల మహామంత్రాలను జపించిన ఫలాన్ని పొందుతారు. యువతులు అపస వ్యంగా, బ్రహ్మచారులు సవ్యంగాను, గృహస్థులు సవ్యాపసవ్యములుగాను శివప్రదక్షిణం, ‘‘చండీ’’ ప్రదక్షిణం చేయాలి. శివునికి ప్రదిణం చేసేటప్పుడు సోమసూత్రం దాటరాదు. చండి ప్రదక్షిణము ఒకసారి చేస్తే 30 వేల సార్లు ప్రదక్షణ చేసిన ఫలము వచ్చును.
ద్వాదశ జోతిర్లింగాలు…
శ్రీ సోమనాధేశ్వర జ్యోతిర్లింగం….
లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీపూ. 200 సం.రాల నాటిది. 20వ శాతాబ్దం వరకు ఎన్నో యుద్ధబీభత్సాలకు గురైనా 1957లో పున:ప్రాణ ప్రతిష్ఠను పొందింది.
శ్రీశైలమల్లిఖార్జున జ్యోతిర్లింగం ….
ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖర మీదే తపస్సు చేస్తున ఒక్కానొక భక్తురాలుకు శివసాక్షాత్కరం కలిగిన ఆచోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్లన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. మూడో శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది.
శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ….
ఉజ్జయినిలో ఈ లింగంవుంది. చైనా యాత్రికుడయిన హ్యుయాన్‌ త్సాంగ్‌ తన పర్యటన గ్రంధంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు.
శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం …..
చారిత్రక ఆధారమంటూ ఈక్షేత్రం గూర్చి ఏమీ లేదు. ‘మాంధాత’ చేసిన తపస్సు ఫలి తంగా ఓంకారేశ్వడు అవిర్భవించాడు.
శ్రీ వైద్యనాథేశ్వరలింగం ….
మహా బలేశ్వరలింగమే వైద్యనాధేశ్వర లింగంగా ప్రసిద్ది చెందింది లంకేశ్వరుడైన రావణునికోరిక మేరకు సాంబ శివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు.
శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం ….
భీముడు వల్ల వివత్తును తొలిగించి నందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధిచెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం.
శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ….
తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసి పోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము.
శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ….
వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆలింగమే విశ్వేశ్వర లింగం.
శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం ….
శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధచేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీత్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.
శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం …
ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణూవు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీ వనంలో ఈ లింగరూపంలో వెలిసాడు.
శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ….
శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది.
శ్రీ ఘృశ్నేశ్వర జ్యోతిర్లింగం …
ఘ్నశ్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెపుతారు.
శివరాత్రులు ఎన్ని?
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొ త్తం అయిదు. అవి : నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి మాస శివరాత్రి, మ హాశివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహా శివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది.శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్త ముడవుతాడని పురాణాల మాట.ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంతో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొ ద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవా రంతో కూ డి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.
భస్మధారణలోని అంతరార్థం: 
ఎంతో నిగూఢత్వం నిండివున్న భస్మా న్ని మరే ఇతర దేవుడుగాక పరమశివుడే ధరించడంలో అంతరార్థం ఏమి టో, మరే ఇతర దైవాలు ఎందుక భస్మాన్ని ధరించరో, శంకరుడే ధరించడానకి గల కారణం ఏమిటో చెప్పే కథ ఒకటుంది. మహర్షి ఆశ్ర మానికి సద్బ్రాహ్మణుడి వేషంలో తరలి వచ్చాడు పార్వతీశుడు. సాటి బ్రహ్మణుడిని చూడగానే ఘనంగా స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేసాడు మహర్షి. మర్యాదలన్నీ పొందిన పిదప బ్రహ్మణ వేషధారియైన గంగేశుడు మహర్షిని ఉద్దేశించి ‘‘మహర్షి ! అతిథి సత్కారాలు సంపూ ర్ణం గా తెలిసిన నీకు విజయోస్తు ! నీవంటి జ్ఞానసంపన్నుడు, తపోధీరుడు సుఖదు:ఖాలకు అతీతుడైన ఉండాలి. సంతోషాలను ఆవేకావేశాలను అదుపులో ఉంచుకోవాలి.
కానీ నీవు ఏ విషయమో పదేపదే స్మరించు కుంటూ మహా సంబర పడుతున్నావు. నీ అంతటి అమిత తపోధీరుడిని సైతం మాయ చేసి ఇంతగా సంతోషపెట్టి ఉబ్బితబ్బిబ్బు చేస్తున్న సంగతే మిటోనే తెలుసుకోవచ్చునా?’’ అని అడిగాడు. అంతవరకు తనలోనే దాచుకున్న సంతోషాన్ని పంచుకునేందుకు ఒకరు వచ్చినందుకు మహర్షి ఎంతగానో సంబరపడుతూ ‘‘ఓ సాధుపుంగవా! నా అమితానందానికి కారణం నువ్వు తెలుసుకుంటే ఎంతటి తప: స్సంపన్నుడైనా దైవాంశ సంఘటనలకు సంతోష పడడం సహజమేనని తెలుసుకుంటావు. నా చేతి వ్రేలు గాయపడినపుడు గాయం నుండి రక్తానికి బదులు,పరిమళ భరిత ద్రావకం వెలువడుతోంది.
అంటే నా తపస్సుకు పరంథాముడు అంగీక రించినట్లే కదా! ఇంతకంటే ఆనందకారకం ఏం కావాలి’’ అంటూ వివ రించాడు. పరమశివుడు మహర్షి అజ్ఞానానికి నవ్వుతూ ‘‘మహర్షీ ! నీ అ మాయకత్వానికి ఎంతో దిగులుగా ఉంది. ఈ శరీరం, సకల జీవరాశు లు, సమస్త ప్రకృతి, ఈ అనంతవిశ్వమంతా ఏదో ఒక సమయంలో ల యం కావలసినవే. అలా లయమైనపుడు సహజ ధర్మాలకు ఆధారమైన ఆకృతి కాలి మసి కావలసిందే. అలాంటి సంపూర్ణ లయత్వంలో సృష్టిలో మిగిలేది బూడిదే. శాశ్వతమైన బూడిదను పొందడమే అద్భుతమైనది.
నా వ్రేలి నుండి అటువంటి శాశ్వతానందం నీవు చూడగలవు’’ అంటూ తన వ్రేలిని సున్నితంగా గాయపరచుకున్నాడు.ఆ వెంటనే స్వామి వ్రేలి నుండి బూడిద రాలసాగింది. వచ్చినది ఈశ్వరుడని గ్రహించి ‘స్వామీ ! నా అజ్ఞానం తెలియవచ్చింది. ఎంతో అద్భుతాన్ని నాకు చూపించి, నా అజ్ఞా నం పొగొట్టిన నీవు ఎవరో నీ దివ్యరూపమేటి టో నాకు చూసి నన్ను ధ న్యుడిని, పునీతుడిని గావించు’’ అని మహర్షి వేడుకున్నాడు.విశ్వనాథుడు తన అమిత మహోన్నత సుందర దివ్య నమ్మోహన రూపంతో దర్శనమిచ్చాడు.
*****************************************– డా వి.జి.శర్మ, 9440944132
Surya Telugu Daily 



Monday, February 28, 2011

తన పై జోక్స్ వేసిన సైట్ పై కేసు :baalayya


తన పై జోక్స్ వేసిన సైట్ పై కేసు :baalayya
ఈ మధ్య కాలంలో ఎవరు సెల్ ఫోన్ చూసినా బాలకృష్ణ మీదో లేదా జూ.ఎన్టీఆర్ మీదో జోక్ వస్తోంది. సర్దార్జీల జోక్ లను బాలకృష్ణకు అనువర్తించి ఈ జోక్ లను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ పై ఇలాంటి జోక్ లు వికృతమైన ఫోటోలతో http://www.ihatebalayya.com/ అనే వెబ్ సైట్ రన్ అవుతోంది. ఈ విషయం తన అభిమానుల ద్వారా బాలకృష్ణ స్వయంగా సైబర్ క్రైం డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్ఎంఎస్‌ల వెనక ఉన్నవారితో పాటు వెబ్‌సైట్ నిర్వాహకుల ను పట్టుకుని కేసు పెట్టడానకి వెతుకుతున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

దీక్షావివేకి


ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రాజకీయనాయకులు ఎంచుకునే మార్గం దీక్ష. ఏదైనా డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గనప్పుడు దీక్షలకు దిగడం సాధారణం. ఎంతోమంది ఇలా చేసే ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టారు. కానీ, ఇప్పుడో దీక్షాదక్షుడు వచ్చాడు. అతడే జగన్. ఆయన చేస్తున్న దీక్షలే ఇప్పుడు హాట్ టాపిక్..ఫీజు చెల్లింపుల కోసం వారం రోజుల పాటు దీక్షకు దిగిన జగన్.. చివరకు నిమ్మరసం తాగి విరమించారు. కానీ, విరమిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన దీక్షను పట్టించుకోలేదన్నారు. జగన్ వర్గం కూడా ఈ వారంరోజుల్లో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ దుమ్మెత్తిపోశారు. కానీ, అక్కడే అసలు విషయాన్ని వారు గుర్తించలేరు. ఒక్కరోజు, రెండు రోజుల దీక్షలు చేస్తూ వచ్చిన జగన్ .. ఫీజు కోసమూ ముందు ఒక్కరోజే దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇలా దీక్ష ఎన్నిరోజులు చేస్తామన్నది ప్రకటించి చేయడం సమకాలీన రాజకీయాల్లో ఒక్కజగన్‌కే చెల్లింది. ఎంత వివేకం లేని రాజకీయనాయకుడైనా ముందుగానే ముగింపు రోజును ముందుగానే ప్రకటించి దీక్షకు దిగలేదు. కానీ, జగన్‌కు బహుశా వివేకం ఎక్కువనుకుంటా.. అందుకే ముందుగానే తాను విరమించే రోజునూ ప్రకటించేశారు. ఎలాగూ వారంరోజుల్లో ముగిసిపోతుందని తెలిసినప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందా..? సరిగ్గా అదే జరిగింది. అనుకున్నట్లే జగన్ దీక్షా శిబిరాన్ని ఎత్తేశారు. అయితే, ఈ వారం రోజుల్లో ఎలాగైనా ప్రభుత్వం తనతో దీక్షను విరమింపజేస్తుందని ఆయన భావించారు. అది జరగలేదు. ఇక 24వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామంటూ జగన్ వర్గం ప్రకటించింది. కానీ, బడ్జెట్ తర్వాత రోజు అసెంబ్లీకి సెలవన్న విషయం మర్చిపోయింది. మొత్తంమీద రాజకీయంగా జగన్ ఇంకా ఎదగలేదన్న విషయం ఈ దీక్షతో మరోసారి తేలిపోయింది.... 

కాంగ్రెస్ పార్టీ మద్యానికి వ్యతిరేకము ???


రాజు
ప్రజల ఆదాయం బాగా పెరిగింది కాబట్టే మద్యం దుకాణాలకు ఇంతగా గిరాకీ పెరిగిందనీ,కాంగ్రెస్ పార్టీ మద్యానికి వ్యతిరేకమనీ మంత్రిగారుచెబుతున్నారు. దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలుకు ఆదేశాలివ్వాలని, ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందని,1995నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ చట్టానికి సవరణలు తీసుకొస్తూ 1997లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన ఎం.నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.వాదనలు: " 1995లో మహిళలు ఉద్యమించడంతో నిషేధం విధించారు.అనంతరం సడలించారు.నిషేధం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో సడలించామన్నారు.మద్య నియంత్రణను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు మద్యం వినియోగం వల్ల భంగం వాటిల్లుతుంది.మద్యం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించే విషయాన్ని ప్రజల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.అలాగే మద్య నిషధంలోనూ ఉండాలి.మద్యంతో సంపాదించే లాభాలు వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్దమొత్తంలో సొమ్ము సంపాదించి పెట్టవచ్చును కానీ, సమాజాన్ని నష్టపరుస్తాయి.ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. ఎంతో విలువైన మానవ వనరులను బలహీనపరుస్తాయి.కష్టజీవుల శ్రమఫలితంలో అత్యధిక మొత్తాన్ని అపహరించి జాతికి తీరని అపకారం చేస్తుంది.మరింత ఎక్కువ మందిని మద్య వినియోగదారులుగా మార్చడం, మద్యవ్యాపారం పరిమాణాన్ని విపరీతంగా పెంచడం- లక్ష్యంగానే ఎక్సైజ్ విధానం కొనసాగుతున్నది. నడికుడి వంటి చిన్న కేంద్రంలో ఒక మద్యం దుకాణం ఐదుకోట్ల రూపాయలకుపైగా రేటు పలికింది. హైవేల పక్కనా, విద్యాలయాలకు సమీపంలో, చివరకు దేవాలయాల కు చేరువలో మంచినీరు కూడా దుర్లభమైన మారుమూల దుర్బిక్ష గ్రామాలలో కూడా మద్యాన్నిప్రవహింపజేస్తున్నారు.మద్యవ్యాపారంతో పాటే సంచరించే గూండాల దండు, దానితో పాటే పెరిగే రాజకీయ ప్రాపకం- మొత్తం వ్యవస్థనే దుర్గంధ భరితం చేస్తున్నాయి.మద్యాన్ని వ్యాప్తి చేయడం వల్ల నష్టమవుతున్న ఆరోగ్యాలు, కోల్పోతున్న పనిదినాలు, తరిగిపోతున్న ఉత్పాదకత లెక్కవేస్తే, వేలం పాటల్లో వచ్చే వేల కోట్లు ఏ మూలకు?సంపూర్ణ మద్యనిషేధం వల్ల తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలు తగ్గిపోతాయి" .