Sunday, November 6, 2011

శబరిమలైకు 165 బస్సులు



విశాఖపట్నం, శబరిమలై యాత్రికు ల సౌక ర్యార్థం ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్యాకేజీలకు విశేష ఆదరణ లభిస్తుందని ఆర్టీసీ విశాఖ ప్రాం తీయ అధికారి జగదీష్‌బాబు తెలిపారు. ద్వార కా బస్‌కాంప్లెక్స్‌లో నిర్వహించిన గురుస్వాముల సదస్సులో ఆయన మాట్లాడు తూ ఇప్పటి వరకు విశాఖ రీజియన్‌లో 40 బస్సుల్ని స్వాములు బుక్ చేసుకున్నారన్నారు. ప్రయాణంలో స్వాములు గతంలో ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించి స్వాములకు ఎటువంటి ఆటంకం లేకుండా బస్సులు పంపేందు కు ఏర్పాట్లు చేశామన్నారు. 

గత సంవత్సరం 74 బస్సుల్ని శబరిమలైకు పంపగా ఈసారి 165 బస్సుల్ని నడిపేందుకు నిర్ణయించుకున్నామన్నారు. ఈ ఏడాది అన్నీ కొత్త బస్సుల్నే నడుపుతున్నామన్నారు. పంబలోయలో రిలీఫ్ టీమ్ ఏర్పాటు చేశామన్నారు. తొలుత డిప్యూటీ సీటీఎం వీరయ్య చౌదరి మాట్లాడుతూ సుశిక్షుతులైన డ్రయివర్లను ఏర్పాటు చేశామన్నారు. సదస్సులో డిప్యూటీ సీడీఎం అప్పలనాయుడు,డిఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 

విద్యుత్ తీగలే మృత్యుపాశాలు




విశాఖపట్నం: అగనంఫూడీ లొ విద్యుత్‌లైన్లు బిగిస్తున్న కార్మికుడికి కుడా విద్యుత్ తీగలే మృత్యుపాశాలయ్యాయి మునగఫాక గ్రామానికి చెందిన భేత రాజు 28 ఆర్‌ఈసీఎస్‌లో సుమారు 10 ఏళ్ల నుంచి కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు విధి నిర్వహణలో భాగంగా భేత రాజు  శనివారం ఉదయ్ం కరెంటు స్తంభం ఎక్కి పోల్ ఎక్కి వైర్లు బిగిస్తుండగా హఠాత్తుగా విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో ఆయన షాక్‌కు గురై వైర్ల మధ్య చిక్కుకుపోయాడు కిందపడే అవకాశం లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఆర్‌ఈసీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు అంటూన్నరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం కోసం కె జి హె ఛే కు తరలించారు ఆర్‌ఈసీఏస్ అధికారుల ఫిర్యాదు  గాజువాక ఎస్‌ఐ రమన కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
ఇలా ఉండగా  విద్యుత్‌లైన్లు బిగిస్తున్న కార్మికుడికి ఆ విద్యుత్ తీగలే మృత్యుపాశాలయ్యాయి. ఈ దుర్ఘటనపై మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. కశింకోట మండలం చెరకాం గ్రామానికి చెందిన రొంగలి నాయుడుబాబు (40) ఆర్‌ఈసీఎస్‌లో సుమారు 20ఏళ్ల నుంచి కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా నాయుడుబాబు శనివారం సాయంత్రం అనకాపల్లి మండలంలోని ఊడేరు జంక్షన్‌లో కరెంటు స్తంభం ఎక్కి పోల్ ఎక్కి వైర్లు బిగిస్తుండగా హఠాత్తుగా విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో ఆయన షాక్‌కు గురై వైర్ల మధ్య చిక్కుకుపోయాడు. కిందపడే అవకాశం లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్‌ఈసీఏస్ అధికారుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం కోసం తరలించారు. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా దర్జీనగర్ ప్రాంతంలో పొక్లెయిన్‌తో రోడ్డుపక్కన తుప్పలు తొలగించే పనులు చేస్తున్నారు. అనుకోకుండా పైన ఉన్న ఆర్‌ఈసీఎస్ వైర్లకు పొక్లెయిన్‌కు తగిలి ఆ వైర్లు వాటిపై ఉన్న ట్రాన్స్‌కో వైర్లకు తగిలాయని ఏఈ కోటేశ్వరరావు తెలిపారు. ఈ కారణంగా ఆర్‌ఈసీఎస్ వైర్లకు విద్యుత్ సరఫరా జరిగి, ఊడేరు జంక్షన్‌లో పోల్‌పై పనిచేస్తున్న నాయుడుబాబు విద్యుత్ షాక్‌కు గురయ్యాడని అన్నారు. కాగా ఆర్‌ఈసీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అందుకు బాధ్యతగా మృతుని కుటుంబానికి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు గంగుపాం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

Tuesday, November 1, 2011

టీనేజ్ అంటే ఒక తరంగం.


టీనేజ్ అంటే ఒక తరంగం.

టీనేజ్ అంటే ఒక తరంగం... ఒక ఆవేశం... ఒక తొందర పాటు... ఒక ఆకర్షణ.
ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, ప్రేమలో పడిపోవడం, గాడి తప్పడం, అవసరమైతే తల్లిదండ్రులను కూడా కాదనడం ఈ రోజుల్లో సహజంగా మారింది.

దీనితో నేటి ఆధునిక యువతీ యువకుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. జీవితానికి సంబంధించి అవి చిన్నవైనా కావచ్చు. అయితే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉంది.
మనం రోజూ ఎందరినో చూస్తుంటాం. ఒక్కొక్కరిదీ ఒక్కో రకం వ్యక్తిత్వం. ఎదుటి వారి మనస్తత్వం బట్టి కొన్ని చోట్ల నడుచుకోవాలి. మనశక్తి సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వాతావరణం, అర్హతలనుబట్టి మనుగడ సాగించాలి. జీవనాధారం కోసం ఒక వృత్తిని ఎంచుకోవడం తప్పనిసరి. ఉద్యోగం అంటే నూటికి నూరుపాళ్ళు పక్కాగా వృత్తిపరమైనది. దాన్ని ఎంచుకునే ముందు కడు జాగ్రత్త వహించాలి. జీవితంలో తేడాలు లేకుండా ఒకేసారి నాలుగైదు చోట్ల ఆఫర్లు వస్తుంటాయి. దేన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురి చేస్తుంది.
అలాంటప్పుడు జాబ్ గుణగణాలు, టైమింగ్స్, వాతావరణం, నివాసానికి, ఆఫీసుకి మధ్య దూరం, రాకపోకలకు అనుకూలత లాంటి అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి, మీ అభిమతానికి, అర్హతకి అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. పొరపాటున మనకు అనుకూలం కాని జాబ్‌లో చేరిన వెంటనే రిజైన్ చేయకుండా మరో జాబ్‌లో చేరేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే చేస్తున్న మొదటి ఉద్యోగానికి ముగింపు పలకాలి.
యూత్‌లో చాలామంది ఎప్పుడో ఒకసారి ‘‘నేను ప్రేమిస్తున్నాను’’ అనుకుంటారు. నిజంగానే తమ వైపునుంచి ప్రేమలో పడిపోతారు. కానీ ఎదుటివారుకూడా మనల్ని ప్రేమిస్తున్నారా? లేదా అని ఆలోచించరు. మీరు ప్రేమిస్తున్న వారు ‘నో’’ అంటే మీరు తట్టుకోగలగాలి. ఆందోళన చెందకుండా ఉండాలి. ఆ వ్యక్తికి ఎలాంటి వ్యసనాలున్నా భరించగలగాలి. ఆ తర్వాత మార్పు చేసుకోవాలి. అలాంటి గుణం మీరు కలిగినట్టయితే నిజంగా ప్రేమిస్తున్నట్టు లెక్క. సినిమాలు, షికార్లలో మనం ఏం చూస్తే వాటిల్లో సగమైన మనకూ ఉండాలనిపిస్తుంది. కానీ అది అసంభవం కావచ్చు కదా. అప్పుడే మరో ఆలోచన కూడా వస్తుంది. ఒక్కసారిగా బ్రహ్మాండం జరగాలని, అదృష్టం వరించాలని ఇది ఏ నూటికో, కోటికో ఒక్కరికే జరగొచ్చు. అందరికీ కాదుకదా. అందుకే వారానికో ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ వెళితే ఐదారు సంవత్సరాలకి పెద్ద మొత్తంగా ఉపయోగించుకోవచ్చు. మనకు ఏమేం కోరికలుంటాయో వాటిని తీర్చుకోవడానికి పొదుపు యంత్రం పాటించాలి.
ఆకలైనా, కాకపోయినా అప్పుడప్పుడు చిళ్ళు తినడం యూత్‌కు అలవాటే. ఐస్‌క్రీమ్‌లు, పానీపూరీలు ... గోబీ... లాంటివి తినడం అంటే సరదా. కానీ నిజంగా ఆకలేస్తుందా అన్నది ఆలోచించుకుంటే వాటి అవసరం ఎంతో తెలుస్తుంది. లేదనుకుంటే మీకు గిఫ్ట్ గ్యారంటీ... అదే ఊబకాయం. రెండు. మూడుసార్లు చిరుతిళ్ల విషయంలో నాలుకను నియంత్రించగలిగితే మరోసారి ఆలోచన రాదు. ఆదిలో ఆ అలవాటును అంతం చేసుకుంటే ఎప్పటికీ మీరు స్లిమ్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. మీతో అందరూ క్లోజ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే వారిలో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలో గమనించాలి. మీకు దగ్గరగా ఉండే వారందరూ ఏ సందర్భంలో సన్నిహితులయ్యారో ఒకసారి మననం చేసుకుంటే తెలుస్తుంది.
మీరు చేసేపనికి తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు అడ్డు చెప్పవచ్చు. అలాంటప్పుడు మీరు చేపట్ట్టే పని గురించి క్షుణంగా చెప్పాలి. మీరు మంచి అవగాహనతోనే వారికి అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే మీకు లైన్ క్లియర్, ఇక మీరు ఏ పనైనా... ఛాలెంజ్‌గా ... అవలీలగా చేయొచ్చు. అప్పుడే మీకు మీ వారికి... అందరికీ హ్యాపీ... కష్టే ఫలే ..
- కంచర్ల 

R E C S Anakapalle



Gajuwaka M L A


K M N