Wednesday, December 21, 2016

బట్టలు లేకుండా డ్యాన్స్ చేయండి..

బ్లిసిటి కావాలంటే చాలా మార్గాలున్నాయి. ఒంటిపై బట్టలు లేకుండా డ్యాన్స్ చేయండి. కావలసినంత పబ్లిసిటీ వస్తుంది  అంటూ మీడియా‌పై ఘాటు విమర్శలు చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పరిక్కర్. సదరు మంత్రి అలా నోరు ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ పారేసుకున్నారంటే.. గోవాలోని సత్తారి సబ్‌ జిల్లాలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన పారిక్కర్.. మీడియా తన హద్దులను గుర్తుపెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. 
ఎప్పుడో 1970ల్లో వాటర్‌గేట్‌ కుంభకోణం సందర్భంగా ఒక ఎడిటర్‌… రిచర్డ్‌ నిక్సన్‌కే సలహాలు ఇస్తూ, పెద్ద సంపాదకీయం రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మళ్లీ ఇప్పుడు అదే నిక్సన్‌ కోసం మరాఠీలో ఎడిటోరియల్ రాస్తామంటే ఎలా అని నిప్పులు చెరిగారు.  మీడియాలో ఉన్న కొందరు వ్యక్తులు తమ పరిధిని గుర్తించకుండా పదేపదే గోల చేస్తున్నారన్నారు మంత్రి. ఇటువంటి గొడవలన్నీ పబ్లిసిటీ స్టంట్ కోసమేననీ, దీనికి ఇంత కష్టపడాల్సిన అవసరంలేదని డ్రస్ లేకుండా  డ్యాన్సులు వేయాలని సలహా ఇచ్చేశారు. వెయ్యి కాపీలు కూడా అమ్ముడుపోని పత్రికలు కూడా అంతర్జాతీయ స్థాయిలో సంపాదకీయాలు రాసి పబ్లిసిటీ తెచ్చుకునేందుకు వెంపర్లాడుతున్నాయంటూ ఒక లోకల్‌ పత్రికపైన ఇలా విరుచుకుపడ్డారు మంత్రి మనోహర్ పరిక్కర్.

Thursday, November 24, 2016

నోట్లరద్దు విమర్శల పాలవుతుందా...!!?


ప్రజల సొమ్ము జాతీయం చేస్తారా? టైమ్స్‌ ప్రశ్న, విజయం సాధించామంటున్నారా? చీప్‌ జస్టిస్‌ ఠాగూర్‌ పార్లమెంటులో ప్రతిపక్షాల సమిష్టి సమరం సంగతి అటుంచితే మోడీ ప్రభుత్వం నోట్లరద్దు నిర్ణయంపై విపరీతమైన విమర్శల పాలవుతున్నది. ఇందాకటి పోస్టులో వ్యాఖ్యానించినట్టు అగ్ర తెలుగు పత్రిక మినహాయిస్తే మిగిలినవన్నీ విమర్శనాత్మక వైఖరినే తీసుకున్నాయి. బుధవారం(23వ తేదీ) టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సంపాదకీయం చాలా సూటిగా ప్రభుత్వ చర్యను తప్పు పట్టింది. నల్లడబ్బును అంటుకునే చర్యలు తీసుకున్నది లేదు గాని ప్రజల సొమ్మును జాతీయం చేసినట్టు కనిపిస్తుందని ఆ పత్రిక రాసింది. తన రాజకీయ స్వభావాన్ని బట్టి ఇది 1990లకు ముందున్న సరళీకరణ పూర్వపు దశలోకి తీసుకువెళ్లినట్టు కనిపిస్తుందని కూడా రాసింది. ప్రజాపక్ష ఆర్థిక వేత్త ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ కూడా మరో కోణంలో ఇలాటి ప్రశ్నే వేశారు. మీరు ఇంతకాలం చెప్పిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఓపెనింగ్‌ లన్నీ ఏమైపోయాయి?సామాన్యులపై సర్జికల్‌ స్ట్రయిక్‌ ఎందుకు? హిందూస్తాన్‌ టైమ్స్‌ కూడా నోట్లరద్దు వల్ల అనుకున్న ఫలితాలు కలిగే అవకాశం లేదని స్పష్టం చేసే చాలా అధ్యయనాలను ఇచ్చింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ, గూగుల్‌ ఇండియా కన్సల్టెన్సీ, మూడీ సంస్థతో సమానమైన ఫిచ్‌, హెచ్‌ఎస్‌బిసి వంటివన్నీ వివరాలతో సహా ఇదే చెబుతున్నాయి. చిన్న వ్యాపారాలకు కరెన్సీ అందుబాటులో లేకపోవడం వల్ల దీర్థకాలిక నష్టం వుంటుందని వీరంతా హెచ్చరిస్తున్నారు. 
ఇక ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కెసి చక్రవర్తి మరింత స్పష్టంగా సోదాహరణంగా ఈ నిర్ణయం దుష్పలితాలు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులకు రుణాలు ఇచ్చేశక్తి తగ్గి డిపాజిట్లపై ఇవ్వాల్సిన వడ్డీ భారం పెరుగుతుందని ఆయన తెలిపారు. 17 లక్షల కోట్టు నల్లధనం కాదు. అది పన్ను చెల్లింపుదారుల చేతుల్లోకి పోతే తెల్లదే అవుతుంది. అక్రమధనాధిపతులు తమ సొమ్ము చాలా త్వరితంగా ప్రజల చేతుల్లోకి వచ్చేట్టు చేయగలరు. రిజర్వు బ్యాంకు దగ్గరకు ధనం చేరినా అది చెత్తకాగితమే. దాన్ని తిరిగి ముద్రించడానికి చాలా సమయం పడుతుంది. ఇక భారీ రుణ ఎగవేతల విషయంలో ఇప్పటికీ సమాచారం బయిటపెట్టడం లేదు. ఇప్పటికే 4 లక్షల కోట్లు రద్దు చేశారు. మరో 5 లక్షల కోట్టు ఎన్‌పిఎలు అంటున్నారు. ఇంకా రెండు లక్షల కోట్టు రద్దు చేసే అవకాశముంది. ఈ జాబితాలు సక్రమంగా వెల్లడించకుండా మనం నోట్లపై యుద్ధంచేస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక అంచనా ప్రకారం వినిమయ దారీ సరుకులు(ఎఫ్‌ఎంసిజి)వ్యాపారం 30 నుంచి 70శాతం పడిపోయే అవకాశముంది.. హైకోర్టులలో కేసుల నిలిపివేయాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీం కోర్టు ఈరోజు తోసిపుచ్చింది. ప్రజలు ఇన్ని సమస్యల్లో వుంటే తలుపులు ఎలా మూసేయగలననిప్రశ్నించింది.ఇప్పటికే విజయం సాధించామని అటార్జీ జనరల్‌ ముకుల్‌ రోహ్తగి చెప్పగా విజయం సాధించారా అని ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాగూర్‌ ఆక్షేపణగా అడిగారు. సహకార బ్యాంకుల సమస్యలపై గాని ఇతరత్రా అంశాలపై గాని ఎవరైనా దిగువ కోర్టులకు వెళ్లవచ్చని అనుమతినిచ్చింది.

Thursday, November 17, 2016

క్యూలైన్లో అమ్మను సామాన్యప్రజలని నిలబెట్టాడు... అంబానీని వదిలేశాడు!?


మ్మను లైన్ లో నిలబెట్టాడు..కానీ అంబానీని నిలబెట్ట లేకపోయాడు'. ఇదే స్లోగన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పెద్దకరెన్సీ నోట్ల రద్దుతో సామాన్యప్రజలంతా బ్యాంకులకు క్యూకడుతుంటే, నల్లకుబేరులు, బిగ్ షాట్స్ మాత్రం బ్యాంకుల మొఖం కూడా చూడకుండా పనులు కానిచ్చేసు కుంటున్నారు.మోదీ ఝుళిపించిన నల్లకుబేరులపై కొరడా సరాసరి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు తాకుతోందితప్ప, అపర కుబేరులు దగ్గరకి కూడా వెళ్లలేక పోతోందన్నది ఈ స్లోగన్ లోని సారాంశమంటూ కొందరు అంటుంటే, మోదీ తల్లిని బ్యాంక్ క్యూలైన్లో నిలబెట్టాడు గాని, అంబానీని నిలబెట్టలేక పోయాడంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.  

తనకు 32ఎకరాల ఇల్లుండవచ్చట! రాష్ట్ర రాజధానికి మాత్రం 32 వేల ఎకరాలు ఎందుకట!?


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం మీద ఇంతెత్తున ఎగిరిపడ్డారు. నాపై కొందరు కరపత్రాలు వేసి, గతంలో తనెప్పుడో కొందరితో దిగిన ఫొటోలను హైలైట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ఎవరు  చేస్తున్నారో తనకు తెలుసునని ఆయన అన్నాడు. నేను నాన్నకు, (చంద్రబాబు), తాత (ఎన్టీఆర్) కు చెడ్డపేరు తెస్తానని, మా కుటుంబంలో నాకు, నాన్నకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఈ కరపత్రాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని, కానీ అలాంటిదేమీ లేదని ఆయన పేర్కొన్నాడు. నేను కులమతాలకు అతీతంగా పని చేస్తున్నా అన్నారు.
గతంలో విదేశాల్లో చదువుకుంటూ ఇండియాకు వచ్చినప్పుడు చాలా మంది ప్రముఖులను కలిశాను.. ఆ సందర్భంగా వేల ఫొటో లు దిగాను. వాటిలో ఓ రెండు మూడు ఫోటోలు తీసుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని లోకేష్ వాపోయారు. చెయ్యి నొప్పి కారణంగా ఓ రెండు రోజులు పార్టీ నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు తాను హాజరు కాలేదని, అయితే ఈ విషయంలో తనకు, చంద్రబాబుకు మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయంటూ చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని ఆయన అన్నాడు.  ఆ మధ్య ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్పతో తాను చేతులు తిప్పుతూ మాట్లాడినంత మాత్రాన.. ఆయనను దుర్భాషలాడానని ఆ ఘటనను తప్పుడుగా చిత్రీకరించారని లోకేష్ విమర్శించారు. రాష్ట్ర రాజధానికి 32 వేల ఎకరాలెందుకని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు.. అయితే బెంగుళూరులో ఆయనకు 32 ఎకరాల ఇల్లుండవచ్చుగానీ రాష్ట్ర రాజధానికి 32 వేల ఎకరాలుండకూడదా అని లోకేష్ ప్రశ్నించారు.


Sunday, August 23, 2015

సినిమా చేస్తున్నా.....చిరంజీవి...!


ష్టిపూర్తి వయస్సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్న మెగాస్టార్ చిరంజీవి తన 60వ బర్త్‌‌డే ని పురస్కరించుకుని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన రాజేకీయ, సినీ విశేషాలను పంచుకున్నారు.తన 150వ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన చిరంజీవి..భారీ అంచనాలు, అసాధారణ పరిస్థితులు ఉన్నందువల్లే కథను ఎంచుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదన్నారు, పూరీ జగన్నాథ్ చెప్పిన కథలో ఫస్టాఫ్ అందరికీ నచ్చిందని, కానీ సెకండాఫ్ పూరికి కూడా నచ్చలేదని చిరు తెలిపారు. కథలో మార్పు చేశాక మా ఇద్దరికీ నచ్చితే ఆయనే (పూరీయే) డైరెక్ట్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు.
 ఇక ప్రేక్షకులు నా నుంచి కోరేది డ్యాన్స్..కాబట్టి డ్యాన్సులు తప్పనిసరి..బన్నీ, రామ్ చరణ్‌‌ల డ్యాన్సుల దూకుడు నిజమే..వాటిని ఛాలెంజింగ్‌‌గా తీసుకుంటా.. కమాన్.. రమ్మనండి.. వాళ్ళని..రఫ్ఫాడిస్తా ..నిజానికి నేను వస్తుంటే వాళ్ళే భయపడుతున్నారు అని మెగా స్టార్ హుషారుగా చమత్కరించారు. సినీ ప్రస్థానం తర్వాత రాజకీయాల్లో కొనసాగుతున్నానని, అయితే ఈ రంగంలో ఏర్పడిన స్తబ్దత వల్లే తాను సినిమా చేయాలని అధిక శాతం మంది ప్రేక్షకులు కోరుతున్నారని ఆయన చెప్పారు. ఈ సమయాన్ని అందుకే వాడుకోవాలని అనుకుంటున్నానని చెప్పిన ఆయన.. రాజకీయాల్లో ఎదురు పోరాటాలు, దెబ్బలు సహజమని, అది నిరంతర పోరాటమని అన్నారు.తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించిన చిరంజీవి-తామిద్దరం ఎప్పుడూ రాజకీయాలగురించి మాట్లాడుకోమని, 
అది తమ మధ్య కుదిరిన ఒప్పందమని తెలిపారు. తన అభిరుచులు, అభిప్రాయాలు నాకన్నా భిన్నమైనవి..అయితే వ్యక్తిగతంగా నాకు  రామ్‌‌చరణ్ ఎంతో పవన్ కళ్యాణ్ కూడా అంతే..పవన్ కూడా నా బిడ్డే అని చిరు వ్యాఖ్యానించారు.కాగా ఏపీకి ప్రత్యేక హోదా గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..ఏపీకి కావలసింది ప్రత్యేక హోదాయేనని, ఎన్ని నిధులు, ప్యాకేజీలు ఇస్తామన్నా అది కేంద్రం దయా దాక్షిణ్యాలపై ఆధారపడినట్టే తప్ప..హక్కుగా సాధించుకోలేమని తాను, తమపార్టీ హోదా కోసం పట్టుబడుతున్నామని ఆయన చెప్పారు. 
కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజు కొంటుందన్న విశ్వాసాన్ని చిరు వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్నారు. గతంలో రెండు సీట్లున్న బీజేపీ అధికారంలోకి వచ్చింది..కాంగ్రెస్ కూడా తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయంగా ఎంతో పరిణతి చెందారని, మీడియా కూడా ఇదే విషయాన్ని అంగీకరించిందని చిరంజీవి చెప్పారు.

Thursday, March 5, 2015

మాట నిలబెట్టుకోవాలి

రాష్ర్ట విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని విశాఖపట్టణం(వైజాగ్),తిరుపతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ ఇచ్చారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని వెంకయ్య నాయుడు అప్పట్లో పార్లమెంట్‌లో ‌పోరాటం జరిపారు. ఇప్పుడు మోదీ తనమాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది.అయితే ఆంధ్రలో బాజాప పుంజుకుంటుదన్న సమయంలో తప్పులు దిర్లిస్తున్నారు. రాష్ర్ట విభజన సమయంలో వున్న పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు విభజనకే మొగ్గు చూపాయి. అయితే, రెండు రాష్ర్టాలకు సమ న్యాయం చేసిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండని అప్పట్లో చంద్రబాబునాయ్డు సూచించినప్పటికీ అందరూ తన మాటని పెడచెవిన పెట్టారు.రాష్ర్ట విభజన తో ఒక్క కాంగ్రేస్ పార్టీనే యావత్ తప్పు పడుతున్నప్పటికిని దానంతటికి కారణం బాజాప అనక తప్పదు..ఇలాగే వ్యవహరించుకు పోతుంటే వాళ్ళకి  పట్టిన గతే పడతాది.

Tuesday, March 3, 2015

అర్ధనగ్నంగా రేవ్ పార్టీ... ఫైనాన్షియర్లు, యువతులు అరెస్ట్


రేవ్ పార్టీల సంస్కృతి క్రమంగా దేశంలోని పలు ప్రధాన నగరాలకు విస్తరిస్తోంది.రేవ్ పార్టీ కల్చర్ బీచ్ సిటీ వైజాగ్‌కి కూడా పాకింది. బీచ్ పరిసరాలతోపాటు నగర శివార్లలోని కొన్ని రిసార్ట్స్, ఫామ్ హౌజ్‌లలో తరచూ రేవ్ పార్టీలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఫామ్ హౌజ్‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో  తాజాగా, విశాఖపట్నంలోని ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ సమీపంలో ఓ గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు, గెస్ట్ హౌస్‌పై దాడి చేశారు. ఆరుగురు మహిళలను, నలుగురు ఫైనాన్షియర్లను అరెస్టు చేశారు. మరో 40 మంది పరారయ్యారు. హైదరాబాద్ శివార్లలో గత కొంతకాలంగా ఇలాంటి రేవ్ పార్టీలు జరుగుతుండటం తెలిసిందే. ఇప్పడు ఈ రేవ్ పార్టీల కల్చర్
విశాఖలోనూ కనిపించడంతో సామాజికి వేత్తలను కలవరపెడుతుంది.