Friday, August 17, 2018

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికు ఘన నివాళి


భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికు ఘన నివాళి
భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి (1924-2018) గురువారం సాయంత్రం ఢిల్లీలోని అఖిల భారత
వైద్య విజ్ఞాన సంస్థలో పరమపదించారు. వాజపేయి గురువారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. వాజపేయి మరణంతో బీజేపీతోపాటు ఇతర పార్టీల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. గత జూన్ నుండి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
 వాజపేయి మరణం పట్ల రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, బీజేపీతోపాటు ఇతర పార్టీల అధినాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. మూడుసార్లు ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వాజపేయి దాదాపు పదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2009లో క్రియాశీల
రాజకీయాల నుండి తప్పుకున్న వాజపేయి లోక్‌సభకు పదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015లో వాజపేయిని భారతరత్న అవార్డుతో సత్కరించారు. వాజపేయి మొదటిసారి 1996లో ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగారు. రెండోసారి 1998లో మరోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టి 11 నెలలు మాత్రమే కొనసాగారు. అయితే 1999లో ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు మాత్రం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగిన మొదటి కాంగ్రెసేతర నాయకుడయ్యారు. తన అద్భుతమైన ప్రసంగాలతో దేశ ప్రజల ప్రేమాభిమానాలను
చూరగొన్న వాజపేయి మంచి కవి. ఆయన రాసిన ఒక గేయంలో ‘వెనకనుండి దాడి చేయకుండా ధైర్యంగా ముందునుండి తనపై దాడి చేయాలి’ అంటూ మృత్యువును ఆహ్వానించటం గమనార్హం. దేశ భక్తికి మారుపేరైన వాజపేయి హిందూత్వాన్ని సమర్థించటంతోపాటు ఇతర మతాల పట్ల కూడా సమభావాన్ని ప్రదర్శించి అందరి గౌరవాభిమానాలు సంపాదించుకున్న మహోన్నత నాయకుడు. 1939లో రాష్ట్రీయ స్వయ సేవక్ సంఘ్‌లో చేరిన
ఆయన ఆఖరు శ్వాస వరకు ఆర్‌ఎస్‌ఎస్ విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు. రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వెంటనే అణు పరీక్షలు నిర్వహించిన వాజపేయి ఆ వెంటనే పాకిస్తాన్‌తో సంబంధాలు
పెంచుకునేందుకు అత్యున్నత స్థాయిలో కృషి చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన ఆఫీస్‌కు పార్థివ దేహాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో

అంతిమసంస్కారాలు నిర్వహిస్తారు. మరోవైపు మాజీ పీఎం వాజ్‌పేయి మరణంతో 20 రాష్ర్ట ప్రభుత్వాలు, ఆఫీసులకు, స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించడం గమనార్హం.








Tuesday, April 10, 2018

యోగా చేసిన కవిత

తంజలి యోగా పీఠం ఆధ్వర్యాన నిజామాబాద్ లో చేపట్టిన ఉచిత యోగా చికిత్స, ధ్యాన శిబిరాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. శిక్షణా శిబిరానికి వచ్చిన వారితో రాందేవ్‌బాబా యోగాసనాలు వేయించారు. యోగా అనేది ఒక్కరోజు చేసే ప్రక్రియ కాదని నిత్య సాధన ఉండాలని రాందేవ్‌బాబా అన్నారు. 2050 నాటికి భారత దేశాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారతస్వాభిమాన్ ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య కోసం లక్షకోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు. గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.


Friday, March 16, 2018

తెలుగు నూతన సంవత్సరం....

గాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాదిఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.ఉగాది”, మరియు యుగాదిఅనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగఅనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది”. ‘యుగముఅనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.
కొత్త సంవత్సరాన్ని కొంగొత్త ఆశలతో ఆహ్వానిస్తున్నాయి. నూతనత్వానికి నాంది పలుకుతూ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అయితే ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో ఉగాదిని పిలుస్తారు. తెలుగు సంవత్సరాదికే ఎందుకు ఈ ప్రత్యేకత? ఆ సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి? వాటికి అర్థాలేంటి? వంటి విశేషాలు తెలుసుకుందాం..
కోకిలమ్మ రాగాలు, ఘుమఘుమ వంటకాలు, షడ్రుచుల పచ్చడి ఉగాది పర్వదినాన్ని ఆనందమయం చేస్తున్నాయి. ఉగాదిని ఈ సంవత్సరం శ్రీ విలంబి నామ సంవత్సరంగా పిలుస్తున్నాం. గత ఉగాదిని హేవిళంబి నామంగా పిలుచుకున్నాం. ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటున్నాం. ఈ పేర్ల వెనుక ఓ పురాణ గాథ ఉంది. అదేంటంటే విష్ణుమాయ కారణంగా నారదుడికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓ యుద్ధంలో వారంతా చనిపోతారు. నారద మహర్షి విష్ణుని ప్రార్థించగా ఆయన కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలు కాలచక్రంలో తిరుగుతుంటారు, ఆ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయంటూ వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా వాడుకలో  ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేమలంబ, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ లుగా ఇలా కాలచక్రంలో నారథ పుత్రులను తలుచుకుంటున్నాం.
అరవై వసంతాలు..
ఈ ఏడాది వచ్చిన శ్రీ విలంబి నామ అర్థమేంటంటే.. "ఘోర''అని అర్థం.ఘోరం అనే పథాన్ని ఎక్కువగా పెద్ద చిక్కు వచ్చేటప్పుడే వాడుతుంటాం!ప్రపంచ పరిస్థితి విషమంగా ఉండవచ్చును. పంటలు కూడా అనుకున్నంతగా ఫలించకపోవచ్చు,అలాగే్ నిత్యం చేసుకునే పూజా కార్యక్రమాల సంకల్పములలో ఉన్న సంస్కృత పదం విలంబ అని ఉంది,
1. ప్రభవ నామ సంవత్సరం : యజ్ఞములు ఎక్కువగా జరుగుతాయని అర్థం.
2. విభవ : ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు.
3. శుక్ల : సమృద్ధిగా పంటలు పండుతాయనే సంకేతమిస్తుంది.
4. ప్రమోదూత : అందరికీ ఆనందం పంచుతుందని అర్థం.
5. ప్రజాపతి : అన్నింటా అభివృద్ధి చెందడాన్ని సూచిస్తుంది.
6. ఆంగీరస : భోగభాగ్యములు కలగాలనే అర్థాన్నిస్తుంది.
7. శ్రీముఖ : వనరులన్నీ సమృద్ధిగా అందుతాయని అర్థం.
8. భావ : సద్భావనలు, ఉన్నత భావాలు కలిగి ఉండాలని తెలుపుతుంది.
9. యువ : సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలు సుఖంగా ఉండాలి.
10.ధాత : అనారోగ్య బాధలు తొలుగుతాయని, ఔషధాలు ఫలిస్తాయని చెబుతుంది.
11.ఈశ్వర : అందరూ క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అర్థం.
12. బహుధాన్య : దేశమంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది.
13. ప్రమాది : వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి.
14. విక్రమ : సమృద్ధిగా పంటలు పండిస్తూ, అన్నింటా విజయం సాధిస్తారని అర్థం.
15.వృష : వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలుపుతుంది.
16. చిత్రభాను : అంచనాలకు అందని ఫలితాలు పొందుతారు.
17. స్వభాను : ప్రజలకు క్షేమం, ఆనందం, ఆరోగ్యం అందుతాయని అర్థం.
18. తారణ : సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి.
19. పార్ధివ : సంపద సిద్ధిస్తుంది.
20.వ్యయ : అతివృష్టి, అధిక ఖర్చులని సూచిస్తుంది.
21. సర్వజిత్తు : ప్రజలకు అనుకూలించే వర్షాలు కురుయును.
22. సర్వధారి : అందరూ సుభిక్షంగా ఉండాలని అర్థం.
23. విరోధి : వర్షాలు తక్కువగా కురుస్తాయి.
24. వికృతి : అశుభ, ప్రతికూల ఫలితాలు సూచిస్తుంది.
25. ఖర : సామాన్య పరిస్థితులు ఉంటాయి
26. నందన : ప్రజలు ఆనందంతో ఉంటారు.
27. విజయ : శత్రువుపై విజయం సాధిస్తారు.
28. జయ : కార్యసిద్ధి, రుగ్మతలను జయిస్తారు.
29. మన్మధ : భోగభాగ్యాలు సిద్ధించి, ఆరోగ్యంగా ఉంటారు. బాధలు తొలిగిపోతాయి.
30. దుర్ముఖి : ఇబ్బందులున్నా క్షేమకర ఫలితాలు పొందుతారు.
31. హేవిళంబి : ప్రజలంతా సంతోషంగా ఉంటారు.
32. విళంబి : అంతా సుభిక్షంగా ఉంటారిని అర్థం.
33.వికారి : శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
34. శార్వరి : పంటల దిగుబడి సాఽధారణంగా ఉంటుంది.
35. ప్లవ : నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి.
36. శుభకృత : ప్రజలు సుఖంగా జీవిస్తారు.
37. శోభకృత : సుఖసంతోషాలు వెల్లువిరుస్తాయి.
38. క్రోధి : కోప స్వభావంతో సామాన్య ఫలితాలు పొందుతారు.
39. విశ్వావసు : ధనం సమృద్ధిగా లభిస్తుంది.
40. పరాభవ : ఓటములు ఎదురవుతాయి.
41. ప్లవంగ : నీరు సమృద్ధిగా లభించును.
42. కీలక : పంటలు విశేషంగా పండుతాయి.
43. సౌమ్య : అందరికీ శుభాలు కలుగుతాయి.
44. సాధారణ: సామాన్య ఫలితాలు కలుగుతాయి
45.విరోధికృత: ప్రజల్లో వైరుధ్య భావాలు ఏర్పడతాయి.
46. పరీధావి: భయాలు కలుగుతాయి.
47. ప్రమాదీచ: ప్రమాదాలు ఎక్కువగా సంభవించును.
48. ఆనంద: అంతా ఆనందమయమేనని అర్థం
49. రాక్షస: క ఠినత్వం పెరగుతుంది. దుస్సంఘటనలు సంభవిస్తాయి
50. నల: సస్య సమృద్ధి కలుగుతుంది
51.పింగళ: సామాన్య ఫలితాలు కలుగుతాయి
52.కాళయుక్తి: కాలానికి అనుగుణమైన ఫలితాలు వస్తాయి
53.సిద్ధార్థి: అన్ని కార్యాలు సిద్ధిస్తాయి
54.రౌద్రి: బాధలు కలుగుతాయి
55.దుర్మతి: సామాన్య వర్షాలు కురుస్తాయి
56.దుందుభి: ధాన్య సమృద్ధితో పాటు అంతా క్షేమంగా ఉంటారు.
57.రుధిరోద్గారి: ప్రమాదాలు అధికం
58. రక్తాక్షి : అశుభాలకు సంకేతం, సామాన్య ఫలితాలు వస్తాయి
59.క్రోధన: అన్నింటా విజయం సిద్ధిస్తుంది.
60.అక్షయ : అధిక సంపదలను సూచిస్తుంది.



Wednesday, December 21, 2016

బట్టలు లేకుండా డ్యాన్స్ చేయండి..

బ్లిసిటి కావాలంటే చాలా మార్గాలున్నాయి. ఒంటిపై బట్టలు లేకుండా డ్యాన్స్ చేయండి. కావలసినంత పబ్లిసిటీ వస్తుంది  అంటూ మీడియా‌పై ఘాటు విమర్శలు చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పరిక్కర్. సదరు మంత్రి అలా నోరు ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ పారేసుకున్నారంటే.. గోవాలోని సత్తారి సబ్‌ జిల్లాలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన పారిక్కర్.. మీడియా తన హద్దులను గుర్తుపెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. 
ఎప్పుడో 1970ల్లో వాటర్‌గేట్‌ కుంభకోణం సందర్భంగా ఒక ఎడిటర్‌… రిచర్డ్‌ నిక్సన్‌కే సలహాలు ఇస్తూ, పెద్ద సంపాదకీయం రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మళ్లీ ఇప్పుడు అదే నిక్సన్‌ కోసం మరాఠీలో ఎడిటోరియల్ రాస్తామంటే ఎలా అని నిప్పులు చెరిగారు.  మీడియాలో ఉన్న కొందరు వ్యక్తులు తమ పరిధిని గుర్తించకుండా పదేపదే గోల చేస్తున్నారన్నారు మంత్రి. ఇటువంటి గొడవలన్నీ పబ్లిసిటీ స్టంట్ కోసమేననీ, దీనికి ఇంత కష్టపడాల్సిన అవసరంలేదని డ్రస్ లేకుండా  డ్యాన్సులు వేయాలని సలహా ఇచ్చేశారు. వెయ్యి కాపీలు కూడా అమ్ముడుపోని పత్రికలు కూడా అంతర్జాతీయ స్థాయిలో సంపాదకీయాలు రాసి పబ్లిసిటీ తెచ్చుకునేందుకు వెంపర్లాడుతున్నాయంటూ ఒక లోకల్‌ పత్రికపైన ఇలా విరుచుకుపడ్డారు మంత్రి మనోహర్ పరిక్కర్.

Thursday, November 24, 2016

నోట్లరద్దు విమర్శల పాలవుతుందా...!!?


ప్రజల సొమ్ము జాతీయం చేస్తారా? టైమ్స్‌ ప్రశ్న, విజయం సాధించామంటున్నారా? చీప్‌ జస్టిస్‌ ఠాగూర్‌ పార్లమెంటులో ప్రతిపక్షాల సమిష్టి సమరం సంగతి అటుంచితే మోడీ ప్రభుత్వం నోట్లరద్దు నిర్ణయంపై విపరీతమైన విమర్శల పాలవుతున్నది. ఇందాకటి పోస్టులో వ్యాఖ్యానించినట్టు అగ్ర తెలుగు పత్రిక మినహాయిస్తే మిగిలినవన్నీ విమర్శనాత్మక వైఖరినే తీసుకున్నాయి. బుధవారం(23వ తేదీ) టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సంపాదకీయం చాలా సూటిగా ప్రభుత్వ చర్యను తప్పు పట్టింది. నల్లడబ్బును అంటుకునే చర్యలు తీసుకున్నది లేదు గాని ప్రజల సొమ్మును జాతీయం చేసినట్టు కనిపిస్తుందని ఆ పత్రిక రాసింది. తన రాజకీయ స్వభావాన్ని బట్టి ఇది 1990లకు ముందున్న సరళీకరణ పూర్వపు దశలోకి తీసుకువెళ్లినట్టు కనిపిస్తుందని కూడా రాసింది. ప్రజాపక్ష ఆర్థిక వేత్త ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ కూడా మరో కోణంలో ఇలాటి ప్రశ్నే వేశారు. మీరు ఇంతకాలం చెప్పిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఓపెనింగ్‌ లన్నీ ఏమైపోయాయి?సామాన్యులపై సర్జికల్‌ స్ట్రయిక్‌ ఎందుకు? హిందూస్తాన్‌ టైమ్స్‌ కూడా నోట్లరద్దు వల్ల అనుకున్న ఫలితాలు కలిగే అవకాశం లేదని స్పష్టం చేసే చాలా అధ్యయనాలను ఇచ్చింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ, గూగుల్‌ ఇండియా కన్సల్టెన్సీ, మూడీ సంస్థతో సమానమైన ఫిచ్‌, హెచ్‌ఎస్‌బిసి వంటివన్నీ వివరాలతో సహా ఇదే చెబుతున్నాయి. చిన్న వ్యాపారాలకు కరెన్సీ అందుబాటులో లేకపోవడం వల్ల దీర్థకాలిక నష్టం వుంటుందని వీరంతా హెచ్చరిస్తున్నారు. 
ఇక ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కెసి చక్రవర్తి మరింత స్పష్టంగా సోదాహరణంగా ఈ నిర్ణయం దుష్పలితాలు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులకు రుణాలు ఇచ్చేశక్తి తగ్గి డిపాజిట్లపై ఇవ్వాల్సిన వడ్డీ భారం పెరుగుతుందని ఆయన తెలిపారు. 17 లక్షల కోట్టు నల్లధనం కాదు. అది పన్ను చెల్లింపుదారుల చేతుల్లోకి పోతే తెల్లదే అవుతుంది. అక్రమధనాధిపతులు తమ సొమ్ము చాలా త్వరితంగా ప్రజల చేతుల్లోకి వచ్చేట్టు చేయగలరు. రిజర్వు బ్యాంకు దగ్గరకు ధనం చేరినా అది చెత్తకాగితమే. దాన్ని తిరిగి ముద్రించడానికి చాలా సమయం పడుతుంది. ఇక భారీ రుణ ఎగవేతల విషయంలో ఇప్పటికీ సమాచారం బయిటపెట్టడం లేదు. ఇప్పటికే 4 లక్షల కోట్లు రద్దు చేశారు. మరో 5 లక్షల కోట్టు ఎన్‌పిఎలు అంటున్నారు. ఇంకా రెండు లక్షల కోట్టు రద్దు చేసే అవకాశముంది. ఈ జాబితాలు సక్రమంగా వెల్లడించకుండా మనం నోట్లపై యుద్ధంచేస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక అంచనా ప్రకారం వినిమయ దారీ సరుకులు(ఎఫ్‌ఎంసిజి)వ్యాపారం 30 నుంచి 70శాతం పడిపోయే అవకాశముంది.. హైకోర్టులలో కేసుల నిలిపివేయాలన్న కేంద్రం అభ్యర్థనను సుప్రీం కోర్టు ఈరోజు తోసిపుచ్చింది. ప్రజలు ఇన్ని సమస్యల్లో వుంటే తలుపులు ఎలా మూసేయగలననిప్రశ్నించింది.ఇప్పటికే విజయం సాధించామని అటార్జీ జనరల్‌ ముకుల్‌ రోహ్తగి చెప్పగా విజయం సాధించారా అని ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాగూర్‌ ఆక్షేపణగా అడిగారు. సహకార బ్యాంకుల సమస్యలపై గాని ఇతరత్రా అంశాలపై గాని ఎవరైనా దిగువ కోర్టులకు వెళ్లవచ్చని అనుమతినిచ్చింది.

Thursday, November 17, 2016

క్యూలైన్లో అమ్మను సామాన్యప్రజలని నిలబెట్టాడు... అంబానీని వదిలేశాడు!?


మ్మను లైన్ లో నిలబెట్టాడు..కానీ అంబానీని నిలబెట్ట లేకపోయాడు'. ఇదే స్లోగన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పెద్దకరెన్సీ నోట్ల రద్దుతో సామాన్యప్రజలంతా బ్యాంకులకు క్యూకడుతుంటే, నల్లకుబేరులు, బిగ్ షాట్స్ మాత్రం బ్యాంకుల మొఖం కూడా చూడకుండా పనులు కానిచ్చేసు కుంటున్నారు.మోదీ ఝుళిపించిన నల్లకుబేరులపై కొరడా సరాసరి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు తాకుతోందితప్ప, అపర కుబేరులు దగ్గరకి కూడా వెళ్లలేక పోతోందన్నది ఈ స్లోగన్ లోని సారాంశమంటూ కొందరు అంటుంటే, మోదీ తల్లిని బ్యాంక్ క్యూలైన్లో నిలబెట్టాడు గాని, అంబానీని నిలబెట్టలేక పోయాడంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.  

తనకు 32ఎకరాల ఇల్లుండవచ్చట! రాష్ట్ర రాజధానికి మాత్రం 32 వేల ఎకరాలు ఎందుకట!?


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం మీద ఇంతెత్తున ఎగిరిపడ్డారు. నాపై కొందరు కరపత్రాలు వేసి, గతంలో తనెప్పుడో కొందరితో దిగిన ఫొటోలను హైలైట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ఎవరు  చేస్తున్నారో తనకు తెలుసునని ఆయన అన్నాడు. నేను నాన్నకు, (చంద్రబాబు), తాత (ఎన్టీఆర్) కు చెడ్డపేరు తెస్తానని, మా కుటుంబంలో నాకు, నాన్నకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఈ కరపత్రాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని, కానీ అలాంటిదేమీ లేదని ఆయన పేర్కొన్నాడు. నేను కులమతాలకు అతీతంగా పని చేస్తున్నా అన్నారు.
గతంలో విదేశాల్లో చదువుకుంటూ ఇండియాకు వచ్చినప్పుడు చాలా మంది ప్రముఖులను కలిశాను.. ఆ సందర్భంగా వేల ఫొటో లు దిగాను. వాటిలో ఓ రెండు మూడు ఫోటోలు తీసుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని లోకేష్ వాపోయారు. చెయ్యి నొప్పి కారణంగా ఓ రెండు రోజులు పార్టీ నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు తాను హాజరు కాలేదని, అయితే ఈ విషయంలో తనకు, చంద్రబాబుకు మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయంటూ చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని ఆయన అన్నాడు.  ఆ మధ్య ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్పతో తాను చేతులు తిప్పుతూ మాట్లాడినంత మాత్రాన.. ఆయనను దుర్భాషలాడానని ఆ ఘటనను తప్పుడుగా చిత్రీకరించారని లోకేష్ విమర్శించారు. రాష్ట్ర రాజధానికి 32 వేల ఎకరాలెందుకని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు.. అయితే బెంగుళూరులో ఆయనకు 32 ఎకరాల ఇల్లుండవచ్చుగానీ రాష్ట్ర రాజధానికి 32 వేల ఎకరాలుండకూడదా అని లోకేష్ ప్రశ్నించారు.